వడ్డీ రాయితీ పెద్ద సున్నా!
2014-15 నుంచి 2018-19 వరకు రైతులు తీసుకున్న పంట రుణాలపై 4% సున్నా వడ్డీ లెక్కిస్తే రూ.11,595 కోట్లు కట్టాలి.
పంట రుణాలపై ‘సున్నా వడ్డీ’ 20% మందికే
ఏటా రూ.3వేల కోట్లు చెల్లిస్తామన్న సీఎం.. 2020-21లో ఇచ్చింది రూ.158 కోట్లే
2019-20లో రూ.418 కోట్లు విడుదల
ఈనాడు - అమరావతి
2014-15 నుంచి 2018-19 వరకు రైతులు తీసుకున్న పంట రుణాలపై 4% సున్నా వడ్డీ లెక్కిస్తే రూ.11,595 కోట్లు కట్టాలి. అదే విధంగా 2019-20 నుంచి 2021-22 వరకు రాష్ట్రంలో భూమిపై తీసుకున్న రూ.1,46,261 కోట్ల పంట రుణాలకు వైఎస్సార్ సున్నా వడ్డీ 4% లెక్కిస్తే.. రూ.5,850 కోట్లు చెల్లించాలి. కానీ.. ఇప్పటివరకు ఇచ్చింది రూ.1,834.55 కోట్లే. ఇందులో గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలుగా రూ.1,180 కోట్లని పేర్కొన్నారు. అంటే.. 2021 ఖరీఫ్ వరకు తీసుకున్న రుణాలకు ఇచ్చిన వడ్డీ రాయితీ కేవలం రూ.654 కోట్లే.
2019 జులై 12న అసెంబ్లీలో సీఎం జగన్ చెప్పిన లెక్కలు
రైతుల కోసం వైఎస్సార్ సున్నా వడ్డీ అనే కొత్త పథకం తెచ్చాం. గతంలో ఇదెప్పుడూ లేదు. సున్నా వడ్డీకి రుణాలివ్వాలని ఆలోచన చేసిన నాథుడే లేరు. పంట రుణాలు తీసుకున్న రైతులు గడువులోగా చెల్లిస్తే.. ఆ రుణాలపై ఎలాంటి వడ్డీ కట్టాల్సిన పనిలేదు.
2019 జులై 8న జమ్మలమడుగులో జరిగిన రైతు దినోత్సవంలో సీఎం జగన్
వాస్తవం ఇదీ..
నిజానికి సున్నా వడ్డీ కొత్త పథకం కాదు. ఉమ్మడి రాష్ట్రంలోనూ సున్నా వడ్డీ, పావలా వడ్డీ పథకాలున్నాయి. వైకాపా వచ్చాక ‘పావలా వడ్డీ’కి మంగళం పాడింది.
పంట రుణాలపై సున్నా వడ్డీ అమలు చేస్తున్నామని ప్రభుత్వం గొప్పగా చెబుతున్నా 80% మందికి ఆ ఫలాలు దక్కడం లేదు. రాష్ట్రంలో ఏటా భూమిపై పంట రుణాలు తీసుకునే రైతులు 52 లక్షలకు పైగా ఉంటున్నా.. వారిలో 10 లక్షల మంది కూడా లబ్ధి పొందలేకపోతున్నారు. లోపం ఎక్కడ?, ఎందుకు అధిక శాతం రైతులు అర్హత సాధించలేకపోతున్నారనే విషయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఉన్న పంట రుణాలపై గతంలో ‘పావలా వడ్డీ’ పథకమైనా వర్తించేది. వైకాపా ప్రభుత్వం ఆ పథకానికి మంగళం పాడింది. పైగా సున్నా వడ్డీ కింద ఏడాదికి రూ.3వేల కోట్ల వరకు ఇవ్వాల్సి ఉంటుందని 2019 జులైలో సీఎం జగన్ అసెంబ్లీలో చెప్పారు. ఆ మేరకు నిధులు కేటాయించడం లేదు. గణాంకశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం రైతుల సంఖ్య 85.14 లక్షలు. వారిలో 2.5 ఎకరాల్లోపు భూమి ఉన్నవారు 69%. అయిదెకరాల్లోపు రైతులు 75.5 లక్షలు. సున్నా వడ్డీ అర్హుల సంఖ్య 2020-21 సంవత్సరంలో 10 లక్షలు కూడా లేదు. మూడేళ్లుగా పంట ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, రైతుల పరిస్థితి బాగుందని చెబుతున్న ప్రభుత్వం ఎక్కువ మందికి సున్నా వడ్డీ ఎందుకు వర్తించడం లేదనే అంశంపై దృష్టి సారించడం లేదు. సున్నా వడ్డీ పంట రుణాలకు అర్హతను పదేళ్ల కిందట ప్రకటించిన విధంగా రూ.లక్ష వరకే కొనసాగిస్తున్నారు. పథకంతో అధిక శాతం మందికి ప్రయోజనం పొందాలంటే రూ.2 లక్షల రుణం వరకు వర్తింపజేయాలని రైతులు అభిప్రాయపడుతున్నారు.
వడ్డీ వసూళ్లు ఇలా..
పంటరుణంపై అసలు బ్యాంకులు వసూలు చేసే వడ్డీ 9%. ఇందులో ఏడాదిలోగా రుణం చెల్లిస్తే కేంద్రం 5% రాయితీ. రైతుల వాటా 4%. ప్రభుత్వాలు రాయితీ ప్రకటిస్తే ఈ 4 శాతం తగ్గుతుంది.
గతంలో ఇలా..
గతంలో రూ.లక్ష వరకు పంట రుణం తీసుకుని ఏడాదిలోపు చెల్లిస్తే ‘వడ్డీ లేని రుణాలు (వీఎల్ఆర్)’ పథకం కింద రైతు కట్టాల్సిన 4% వడ్డీని బ్యాంకర్లు మినహాయించేవారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకునేవారు.
* రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు తీసుకుని ఏడాదిలోపు చెల్లిస్తే అందులో ‘పావలా వడ్డీ’ కింద 1% వడ్డీని ప్రభుత్వం ఇచ్చేది. 3% రైతులు చెల్లించేవారు.
2019 నుంచి ఇలా..
వీఎల్ఆర్నే 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’ పథకంగా అమలు చేస్తోంది. రూ.లక్ష వరకు రుణాలు తీసుకున్న రైతులకు వర్తింపజేస్తోంది. అదీ.. ఏడాదిలోపు వడ్డీతో సహా చెల్లించిన రైతుల పేర్లను బ్యాంకర్ల నుంచి తీసుకుని ఆ తర్వాత వారి ఖాతాల్లో ప్రభుత్వం వడ్డీ జమ చేస్తోంది. కానీ.. అధిక శాతం మంది రైతులు తమకు సున్నా వడ్డీ జమ కావడం లేదనే చెబుతున్నారు.
* వైకాపా ప్రభుత్వం ‘పావలా వడ్డీ’ ఎత్తేసింది. దీంతో రూ.లక్ష నుంచి రూ.3 లక్షల పంటరుణం తీసుకొని ఏటా చెల్లించే వారికి వడ్డీల భారం తప్పడం లేదు.
వడ్డీ రాయితీ అడ్డంకులెన్నో..!
* ఈ-క్రాప్ నమోదు చేయించుకోకపోవడం.
* ఈ-క్రాప్లో నమోదైన పంటకు కాకుండా.. వేరే పంటకు రుణం తీసుకున్నా రాయితీ రావడం లేదు.
* రూ.లక్షపైన రుణం తీసుకున్నా వడ్డీ ఇవ్వరు.
* మూడున్నర ఎకరాల వరి, వేరుసెనగ వేసిన రైతులు రూ.లక్షపైగా రుణం తీసుకున్నా.. సున్నా వడ్డీ లభించడం లేదు.
* బ్యాంకులు ప్రభుత్వాలకు సమయానికి రైతుల పేర్లు పంపడం లేదనే ఆరోపణలూ ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు.. డిగ్రీ పరీక్షలు రాయకుండా నిర్బంధం
‘పోలీసులు నన్ను అక్రమంగా నిర్బంధించి తీవ్రంగా హింసించారు. డిగ్రీ పరీక్షలు రాయనివ్వకుండా నా భవిష్యత్తును నాశనం చేశారు’ అని దళిత విద్యార్థి శశాంక్ వాపోయారు. -
గులకరాయి ఘటనను ఎన్నికల్లో లబ్ధికి వినియోగించుకోకుండా అడ్డుకోండి
గులకరాయి ఘటనను ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం సీఎం జగన్ సహా వైకాపా నేతలు వాడుకుంటున్నారనీ, దీనిని నిలువరించాలని కోరుతూ విజయవాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు నమోదవుతోంది. వడగాలులు సైతం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో తలెత్తిన ఒక భూవివాదంలో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు బొత్స సందీప్ పేరు తెరపైకి వచ్చింది. -
మీ భూమి మీది కాదు
ఆ ఆస్తి మాదే... రికార్డుల్లో మా పేరే ఉంది, మాకేం భయం... అనుకుంటే పొరపాటే. రాత్రికి రాత్రే రికార్డులు మారిపోవచ్చు. -
పింఛను కుట్ర.. తీస్తోంది ప్రాణం
సీఎం గారూ.. పండుటాకులు ఎంత ఘోష అనుభవిస్తున్నారో కనిపిస్తోందా? అభాగ్యులు పడే వేదన వినిపిస్తోందా? పదవిలో ఉండి ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయకుండా వికృత రాజకీయ క్రీడ నడుపుతూ పింఛనుదారులపై ఇంత కిరాతకంగా వ్యవహరిస్తారా? -
సీఈఓ మౌనం.. వైకాపాకు లాభం!
ఫుట్బాల్ క్రీడలో రిఫరీలా.. ఎన్నికల ప్రక్రియలో నియమ నిబంధనలు అమలు చేసే పాత్ర పోషిస్తూ తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఎన్నికల సంఘం ఆ బాధ్యతల నిర్వహణలో విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. -
జగన్ వంచనకు ఏడు ప్రాణాలు బలి
పింఛన్ల రాజకీయ క్రీడ ఏడుగురిని బలి తీసుకుంది. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, పంపిణీలో నిర్లక్ష్యంతోపాటు ముఖ్యమంత్రి జగన్, ఉన్నతాధికారుల వైఫల్యం పేద కుటుంబాలకు పెద్దదిక్కును దూరం చేస్తున్నాయి. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
ఇటీవల కన్నుమూసిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి ఆహ్వానం
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. -
సీఎం జగన్ను ఓడించడమే మా లక్ష్యం
ఈ ఎన్నికల్లో సీఎం జగన్ను ఓడించడమే 35మాదిగ సంఘాల ఐక్యవేదిక లక్ష్యమని.. ఆ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు అన్నారు. -
యువత పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోంది
‘ఓటేసే ముందు మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి.. ఎవరు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారో.. వారినే ముఖ్యమంత్రిగా చేయండి’ అని సౌదీ అరేబియాలోని ఆరామ్కో సంస్థతో కలిసి ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ నిర్వహిస్తున్న రావి రాధాకృష్ణ ఓటర్లకు పిలుపునిచ్చారు. -
పేదల ఇళ్లపై దా‘గూడు’ మూతలు!
ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన్నాటి నుంచి... అభివృద్ధి మరచి తెదేపాపై అక్కసుతో వ్యవహరించిన జగన్... పేదలకిచ్చే ఇళ్లలోనూ ఆ అవలక్షణాన్నే ప్రదర్శించారు. -
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
సీఎం జగన్ను ఓటమి భయం పట్టుకుందా? కొన్ని నెలల క్రితం ‘వైనాట్.. 175’ అంటూ ధీమా ప్రదర్శించిన ఆయనలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందా? ఎందుకీ ఎదురుగాలి.. అని మదన పడుతున్నారా? -
వేసవిలో భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు
వేసవి సెలవుల్లో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. -
‘ఉత్తర్వుల ఎత్తివేత’పై త్వరగా విచారించండి
మాజీ మంత్రి వివేకా హత్య విషయంలో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై వ్యాఖ్యలు చేయెద్దంటూ వెలువరించిన ఉత్తర్వులను ఎత్తివేయాలని (స్టే వెకేట్) కోరుతూ మృతుడి కుమార్తె నర్రెడ్డి సునీత, పీసీసీ అధ్యక్షురాలు, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి (బీటెక్ రవి)లు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై త్వరగా విచారణ చేసి, ఈ నెల 8లోపు నిర్ణయం వెల్లడించాలని కడప జిల్లా న్యాయస్థానాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పింఛన్ పెంచలే.. కానుకకు కరుణించలే!
ముఖ్యమంత్రి జగన్ తన ఐదేళ్ల పాలనాకాలంలో దివ్యాంగులపై ఎనలేని వివక్ష చూపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం దివ్యాంగ పింఛనుదారులు 8.07 లక్షల మంది ఉన్నారు. -
అవినాష్రెడ్డి ముందస్తు బెయిలు రద్దుకు నిరాకరణ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి బెయిలును రద్దు చేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి గడువు పొడిగించాలి
పోలింగ్ ముందు రోజు వరకు పోస్టల్ బ్యాలట్ వినియోగానికి అనుమతించాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్, ఏపీ ఉపాధ్యాయ సంఘం వేర్వేరు ప్రకటనల్లో ఎన్నికల సంఘాన్ని కోరాయి. -
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
సీఎం జగన్ ఎక్కడ సిద్ధం సభలు నిర్వహించినా... అక్కడ విధ్వంసం పరిపాటిగా మారింది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో శుక్రవారం సిద్ధం సభ జరిగింది. -
‘అ’భివృద్ధి ‘నిల్’.. అవినీతి ఫుల్!
ఆయనో యువ ప్రజాప్రతినిధి.. బెట్టింగ్ అనగానే టక్కున గుర్తుకొస్తారు. జిల్లాలోని సహజ వనరులను సొంతవాటిలా భావించారు.. ఈ ఐదేళ్లలో యథేచ్ఛగా కొల్లగొట్టేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
-
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
-
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?