భారీగా తగ్గనున్న రెవెన్యూ లోటు భర్తీ నిధులు
కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వానికి కేంద్రం నుంచి వచ్చే రెవెన్యూ లోటు భర్తీ నిధులు భారీగా తగ్గనున్నాయి.
15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు రాష్ట్రానికి వచ్చేది రూ.2,691 కోట్లే
ఈనాడు, దిల్లీ: కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వానికి కేంద్రం నుంచి వచ్చే రెవెన్యూ లోటు భర్తీ నిధులు భారీగా తగ్గనున్నాయి. కేంద్ర పన్నుల్లో వాటా పంపిణీ చేశాక కూడా 2021-26 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్కు రూ.30,497 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడుతుందని తేల్చిన 15వ ఆర్థిక సంఘం దాని భర్తీకి కేంద్రం గ్రాంట్లు మంజూరు చేయాలని సిఫారసు చేసింది. అందులో రూ.17,257 కోట్లను 2021-22లో, రూ.10,549 కోట్లను 2022-23లో, రూ.2,691 కోట్లను 2023-24లో ఇవ్వాలని సూచించింది. 2024-25, 2025-26 సంవత్సరాల్లో రాష్ట్రానికి రెవెన్యూ లోటు ఉండబోదని తేల్చింది. ఆ సిఫారసులను యథాతథంగా ఆమోదించిన కేంద్రం గత రెండేళ్లలో రెవెన్యూలోటు కింద రూ.27,806 కోట్లు ఇచ్చింది. 2023-24లో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పద్దు కింద కేవలం రూ.2,691 కోట్లు మాత్రమే రానున్నాయి. కేంద్రం నుంచి వచ్చే రెవెన్యూ లోటు గ్రాంటును రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది లేకుండా తన అవసరాలకు వాడుకునేది. దానివల్ల నిధుల సర్దుబాటు కోసం బహిరంగ మార్కెట్నుంచి అప్పులు తీసుకోవాల్సిన అవసరం ఆ మేరకు తగ్గేది. ఇప్పుడు 2022-23తో పోలిస్తే 2023-24లో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.7,858 కోట్ల మేర గ్రాంట్లు తగ్గిపోతుండటంవల్ల ఆర్థిక సంక్లిష్టతలు పెరిగే అవకాశముంది.
తగ్గుతున్న ఆర్థిక సంఘం గ్రాంట్లు
15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం కేంద్రం రాష్ట్రాలకు విడుదల చేసే గ్రాంట్ల మొత్తం క్రమంగా తగ్గుతోంది. 2021-22లో రూ.2,07,434 కోట్ల గ్రాంట్లు విడుదల చేయగా.. 2022-23 బడ్జెట్లో రూ.1,92,108 కోట్లు కేటాయించింది. అంచనాల సవరణ సమయానికి అది రూ.1,73,257 కోట్లకు తగ్గింది. గత బడ్జెట్లో జరిపిన కేటాయింపుల్లో పట్టణ స్థానిక సంస్థలకు రూ.7,882 కోట్లు, గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.5,513 కోట్లు, వైద్య రంగం గ్రాంట్లు రూ.4,297 కోట్లు, రాష్ట్ర వైపరీత్య నిర్వహణ నిధికి రూ.1,158 కోట్ల మేర కోత పడినట్లు సవరించిన అంచనాలను బట్టి వెల్లడైంది. 2023-24బడ్జెట్లో 15వ ఆర్థిక సంఘం గ్రాంట్ల పద్దు కింద కేటాయింపులు రూ.1,65,480 కోట్లకు పరిమితమయ్యాయి. అందుకు ప్రధాన కారణం 17 రాష్ట్రాలకు అందించే రెవెన్యూ లోటు గ్రాంట్లు తగ్గడమే. ఇది 2021-22లో రూ.1,18,452 కోట్లుండగా, 2022-23లో రూ.86,201 కోట్లకు తగ్గింది. 2023-24లో ఇది రూ.51,673 కోట్లకు పరిమితం కానుంది. 2022-23లో కేంద్రం నుంచి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.7,95,131.04 కోట్ల నిధులు బదిలీ కావాల్సి ఉండగా కేవలం రూ.7,62,422.74 కోట్లు (4.11%మేర కోత) మాత్రమే బదిలీ అయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్