అదానీకి 60 ఎకరాలు
నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న రామాయపట్నం పోర్టులో రెండు క్యాప్టివ్ బెర్తుల నిర్మాణానికి జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కు 250 ఎకరాల్ని లీజు ప్రాతిపదికన కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
విశాఖలో టెక్పార్క్కు కేటాయింపు
రామాయపట్నంలో రెండు బెర్తులు జేఎస్డబ్ల్యూకి..
వైకాపా కార్యాలయాలకు మూడు చోట్ల ప్రభుత్వ స్థలాలు
మంత్రివర్గం నిర్ణయాలు
ఈనాడు, అమరావతి: నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న రామాయపట్నం పోర్టులో రెండు క్యాప్టివ్ బెర్తుల నిర్మాణానికి జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కు 250 ఎకరాల్ని లీజు ప్రాతిపదికన కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలో అదానీ సంస్థ ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్, ఐటీ, బిజినెస్ పార్క్, స్కిల్, రిక్రియేషన్ సెంటర్ల ఏర్పాటుకు 60.29 ఎకరాల భూమిని వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్ (వీటీపీఎల్)కు కేటాయించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వీటిని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. వైకాపా కార్యాలయాల నిర్మాణానికి రాజమహేంద్రవరంలో 2 ఎకరాలు, కర్నూలులో ఏపీ ఆగ్రోస్కు చెందిన 1.60 ఎకరాలు కేటాయించారు. ఈ అంశాలు సమావేశ ఎజెండాలో ఉన్నప్పటికీ, మంత్రి వాటిని విలేకర్లకు వెల్లడించలేదు. కేబినెట్ నిర్ణయాలకు సంబంధించి ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన నోట్లోనూ వైకాపా కార్యాలయాలకు స్థలం కేటాయింపు ప్రస్తావన లేదు. మరో జిల్లాలో నీటిపారుదల శాఖకు చెందిన స్థలాన్ని వైకాపా కార్యాలయానికి కేటాయిస్తున్నట్లుగా కేబినెట్ సమావేశం ఎజెండాలో 52వ అంశంగా చేర్చారు. కానీ అది ఏ జిల్లా, ఎంత స్థలం కేటాయించారు అన్న వివరాలు దానిలో లేవు.
* ఏపీ హైడ్రో ప్రాజెక్టు ప్రమోషన్ పాలసీ-2022లోని ప్రొవిజన్ 3 ప్రకారం వివిధ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టు సంస్థలకు అనుమతుల మంజూరు
* ఎకోరన్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ సంస్థకు సుమారు 1000 మెగావాట్ల పవన విద్యుత్, 1000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో దశల వారీగా వాటి నిర్మాణం.
* అనంతపురం జిల్లా రాళ్ల అనంతపురంలో 250 మెగావాట్లు, కురుబరాహల్లిలో 251.2 మెగావాట్లు, కర్నూలు జిల్లా బేతంచెర్లలో 118.8 మెగావాట్లు, చిన్నకొలుములపల్లిలో 251.2 మెగావాట్లు, మెట్టుపల్లిలో 100 మెగావాట్లు, జలదుర్గంలో 130 మెగావాట్లు, విండ్ ప్రాజెక్టుల ఏర్పాటు. అనంతపురం జిల్లా కమలపాడు, యాడికిలలో 250 మెగావాట్లు, శ్రీసత్యసాయి జిల్లా కొండాపురంలో 250 మెగావాట్లు, నంద్యాల జిల్లా నొస్సంలో 500 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు.
* అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్కు 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం పెద్దకోట్ల, దాడితోట గ్రామాల పరిధిలో 406.46 ఎకరాలను.. ఎకరం రూ.5 లక్షల చొప్పున కేటాయించాలన్న ప్రతిపాదనకు ఆమోదం.
* మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి రుణసదుపాయానికి అవసరమైన రూ.3,940.42 కోట్లకు బ్యాంక్ గ్యారంటీ నిమిత్తం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్కు, మచిలీపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కు మధ్య కుదిరిన అవగాహన ఒప్పందానికి ఆమోదం.
* ఇటీవల రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం. వాటి ద్వారా రూ.1.20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు, 70 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడి.
* నెల్లూరు బ్యారేజ్ పేరును నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డినెల్లూరు బ్యారేజ్గా మారుస్తూ నిర్ణయం.
కర్నూలులో రెండో న్యాయ విశ్వవిద్యాలయం
* కర్నూలులో 50 ఎకరాల్లో రెండో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు.
* వైయస్ఆర్ జిల్లాలోని ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 2015-16లో కేటగిరీలో ఏతో పాటు, తర్వాత సంవత్సరానికి కేటగిరీ బీ, సీలకు చెందిన విద్యార్థుల ఫీజురీయింబర్స్మెంట్ అంశాన్ని ప్రత్యేక కేసుగా పరిగణించి చెల్లించాలన్న ప్రతిపాదనకు ఆమోదం. రూ.9.12 కోట్లు చెల్లించాలని నిర్ణయం.
* మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ ఉపాధ్యాయుల విధానం అమలు. ఈ విధానంలో అర్హత పొందిన 5,809 మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు నెలకు రూ.2,500 చొప్పున అలవెన్స్.
* నాడు-నేడులో అభివృద్ధి చేసిన పాఠశాలల్లో 6వ తరగతి పైన ఉన్న అన్ని తరగతులకు 30,213 ఇంటరాక్టివ్ ప్యానెల్బోర్డుల ఏర్పాటు. మిగతా వాటిలో స్మార్ట్ టీవీల ఏర్పాటుకు నిర్ణయం.
* కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న బోధన సిబ్బందికి ప్రస్తుతం అందిస్తున్న గౌరవవేతనానికి అదనంగా 23% పెంపు ప్రతిపాదనకు ఆమోదం.
* కస్తూర్బా విద్యాలయాల్లో పనిచేస్తున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులకు కాంట్రాక్టు రెసిడెన్షియల్ ఉపాధ్యాయుల (సీఆర్టీల)తో సమానంగా గౌరవవేతనం.
* ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను రూ.34.48 కోట్ల వ్యయంతో 100 పడకల ఏరియా ఆసుపత్రిగా ఉన్నతీకరించాలనే నిర్ణయానికి ఆమోదం.
* విజయనగరంలో అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం
రెవెన్యూ డివిజన్గా తాడేపల్లిగూడెం
* కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పరిపాలన సౌలభ్యం కోసం వివిధ మండల కేంద్రాల్ని మార్చడంతో పాటు, కొత్త మండలాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం.
* ఎన్టీఆర్ జిల్లాలోని వీరులపాడు మండల కేంద్రాన్ని జుజ్జూరుకు మారుస్తూ నిర్ణయం.
* జిల్లా కేంద్రాలుగా ఉన్న విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, ఒంగోలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు మండలాల్ని.. గ్రామీణ, అర్బన్ మండలాలుగా విభజిస్తూ నిర్ణయం.
* రెవెన్యూ డివిజన్గా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం. అక్కడ కొత్త పోలీస్ సబ్డివిజన్ ఏర్పాటుకూ ఆమోదం.
* ఏలూరు జిల్లాలోని ఏలూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని గణపవరం మండలం భీమవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోకి మార్పు.
* విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలాన్ని చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ నుంచి విజయనగరం రెవెన్యూ డివిజన్కు మార్చుతూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం.
కొత్తగా మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు
* వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలో ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేసి రాష్ట్ర, జోనల్, జిల్లా స్థాయిలో పోస్టుల భర్తీకి నిర్ణయం. ఏపీపీఎస్సీ పరిధిలోకి రాని పోస్టులను ఈ బోర్డు ద్వారా భర్తీ చేస్తారు.
* పశుసంవర్థక శాఖలో నిపుణుల కొరతను తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ పారా వెటర్నరీ అండ్ అలైడ్ కౌన్సిల్ చట్టం-2023 ముసాయిదా బిల్లుకు మంత్రిమండలి ఆమోదం. దీని ప్రకారం పారా వెటర్నరీ అండ్ అలైడ్ కౌన్సిల్ను ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం.
* మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం.
* ఆంధ్రప్రదేశ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్)-2023 బిల్లు సవరణకు ఆమోదం
1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఊరట
* 1998 డీఎస్సీలో అర్హత సాధించిన అభ్యర్థులతో 4,534 సెకండరీ గ్రేడ్ టీచర్ల పోస్టుల భర్తీ. కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం. వీరికి మినిమమ్ టైమ్ స్కేలు వర్తింపజేస్తారు. ప్రాథమిక విద్యాశాఖతోపాటుగా ఖాళీలను అనుసరించి బీసీ, సాంఘిక సంక్షేమ పాఠశాలల్లోనూ వారిని నియమిస్తారు.
మధ్యాహ్న భోజన పథకంలో రాగిజావ
* మార్చి 2 నుంచి విద్యార్థులకు మధ్యాహ్నభోజన పథకంలో వారంలో మూడు రోజులపాటు రాగిజావ.
* ఈ నెల 10న వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా అమలు.
* ఈ నెల 17న వైఎస్సార్ లా నేస్తం పథకం కింద సాయం విడుదల.
* 24న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపు
* ఈ నెల 28న జగనన్న విద్యాదీవెన అమలు.
* ఉగాది సందర్భంగా మూడో విడత ఆసరా సాయం విడుదల
* మార్చిలో ఈబీసీ నేస్తం పథకం అమలు
* మార్చిలో జగనన్న వసతి దీవెన.
జగనన్న విదేశీ విద్యాదీవెనలో మార్పులు
జగనన్న విదేశీ విద్యాదీవెన పథకంలో మార్పులు. ఇంతకు ముందు క్యూఎస్ ర్యాంకింగ్లో 200 అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలకే ఈ పథకం పరిమితం. ఇకపై దాదాపు 21 సబ్జెక్టులు/ ఫ్యాకల్టీకి సంబంధించి ప్రతి ఒక్క సబ్జెక్టు లేదా ఫ్యాకల్టీలో మొదటి 50 కళాశాలలు లేదా విద్యాసంస్థల్లో సీటు సాధించినవారికి జగనన్న విద్యాదీవెన వర్తింపు. గతంలో కేవలం క్యూఎస్ సంస్థ ర్యాంకింగ్ మాత్రమే పరిగణనలోకి తీసుకోగా.. ఇకపై క్యూఎస్ సంస్థ ర్యాంకింగ్తోపాటు టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్ ఆధారంగా సీటు సంపాదించినవారికి జగనన్న విదేశీ విద్యాదీవెన వర్తింపు. ఈ మార్పులతో 320 కళాశాలలు, విద్యాసంస్థల్లో విద్యార్థులకు అందుబాటులో కోర్సులు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.1.25 కోట్ల వరకు, అర్హులైన ఇతరులకు రూ.కోటి వరకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM