ఏపీలో దళితులకు భద్రత కొరవడింది
ఆంధ్రప్రదేశ్లో దళితులకు భద్రత లేకుండా పోయిందని, 3 జిల్లాల్లో ఏడు హత్యలు జరిగాయని విశాఖ దళిత సంఘాల (విదసం) ఐక్య వేదిక ఆందోళన వ్యక్తం చేసింది.
జాతీయ ఎస్సీ కమిషన్కు దళిత సంఘాల ఐక్య వేదిక ఫిర్యాదు
హైదరాబాద్, న్యూస్టుడే: ఆంధ్రప్రదేశ్లో దళితులకు భద్రత లేకుండా పోయిందని, మూడు జిల్లాల్లో ఏడు హత్యలు జరిగాయని విశాఖ దళిత సంఘాల (విదసం) ఐక్య వేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఈ వేదిక ప్రతినిధుల బృందం మంగళవారం గ్రీన్ల్యాండ్స్లోని హరిత ప్లాజా హోటల్లో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు సుభాష్ పార్థిని కలిసి వినతిపత్రం అందజేసింది. సాధారణ దళిత ప్రజలతో పాటు దళిత ఎమ్మెల్యేకు రక్షణ కొరవడిందని వేదిక ఏపీ రాష్ట్ర కన్వీనర్ డా.బూసి వెంకటరావు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనలపై ఏపీ ప్రభుత్వం తక్షణ న్యాయపరమైన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. బాధితులకు ఓదార్పు, న్యాయ సహాయం కోసం కమిషన్ సభ్యులు ఘటనా ప్రదేశాలను సందర్శించి విచారణ జరిపి, తగిన ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు. అనంతరం వెంకటరావు మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారన్న ఆరోపణలతో తనకు హాని ఉందని రక్షణ కల్పించాలని ఎస్సీ కమిషన్కు బహిరంగంగా విజ్ఞప్తి చేశారని, ఆమెకు రక్షణ కల్పించి... హాని తలపెట్టే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాణభయం ఉందని ఫిర్యాదు చేసిన సందర్భాల్లో పోలీసులు పట్టించుకోవడంలేదని, హత్యలు జరిగిన తర్వాత అనుమానాస్పద మృతిగా కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మార్చి 21న కాకినాడ జిల్లా తొండంగి మండలం శృంగవృక్షంలో దళితుడైన నడిపల్లి రామును ఆధిపత్య సామాజిక వర్గం హత్య చేసింది. ఈ ఘటనలో మరో ఆరుగురు గాయపడ్డారు. నిందితులు 12 మంది ఉండగా... ప్రధాన నిందితుడిని ఇప్పటికీ అరెస్టు చేయలేదు. ఈ గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో పీఎల్పురంలో ఫిబ్రవరి 28న వీరనాగేంద్ర అనే యువకుడిని హత్య చేసి బావిలో పడేశారు. మార్చి 25న కడపలో డిప్యూటీ కలెక్టర్ డా.అచ్చెన్న హత్య పోలీసుల నిర్లక్ష్యంతోనే జరిగింది. 12వ తేదీ నుంచి కనిపించడం లేదని 14న ఆయన కుమారుడు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. మార్చి 2న శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం నీలంపేటలో సుదర్శన్రావు హత్యకు గురి కాగా ఒక్కరినే అరెస్టు చేశారు. మార్చి 11న అదే జిల్లా చిలకపాలెంలో లింగా నరేంద్రకుమార్ను హత్య చేసి రైల్వే ట్రాక్పై పడేశారు. ఫిబ్రవరి 19న విజయనగరం జిల్లా మెంతుపేట కాలనీలో వెంకటేష్కు విషం ఇచ్చి కొట్టి చంపారు. మార్చి 17న అదే జిల్లా పోనుగోటివలసలో ఎచ్చెర్ల వీరయ్య హత్యకు గురయ్యారు...’ అని వెంకటరావు వివరించారు. ఏ కేసులోనూ దర్యాప్తు ముందుకు సాగలేదన్నారు. కమిషన్ సభ్యుడిని కలిసిన వారిలో వేదిక నాయకులు గణేష్, మహేశ్వర్రాజ్, రంగారావు తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!