రూ.29 లక్షలు కాదని.. రూ.1,600కే రాసిచ్చారు
కర్నూలులోని ఏపీ ఆగ్రోస్కు చెందిన స్థలానికి ఏటా రూ.29.04 లక్షల అద్దె ఇస్తామన్న వారిని కాదని, రాష్ట్ర ప్రభుత్వం వైకాపా కార్యాలయం కోసం కేవలం రూ.1,600కే కేటాయించింది.
వైకాపా కార్యాలయానికి సర్కారీ స్థలం లీజు
కోర్టును ఆశ్రయించాలని బాధిత సంస్థ నిర్ణయం
ఈనాడు, కర్నూలు: కర్నూలులోని ఏపీ ఆగ్రోస్కు చెందిన స్థలానికి ఏటా రూ.29.04 లక్షల అద్దె ఇస్తామన్న వారిని కాదని, రాష్ట్ర ప్రభుత్వం వైకాపా కార్యాలయం కోసం కేవలం రూ.1,600కే కేటాయించింది. ప్రభుత్వానికి భారీగా ఆదాయం ఒనగూరే అవకాశాన్ని కాలదన్ని, సొంత పార్టీ అవసరాలకు సర్కారీ స్థలాన్ని కేటాయించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారీ అద్దెతోపాటు లీజు గడువు ముగిశాక రూ.కోట్ల విలువైన వాణిజ్య సముదాయం ప్రభుత్వ పరమయ్యే అవకాశాన్ని వదులుకొని, రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా వైకాపాకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కర్నూలులోని ఐదు రోడ్ల కూడలిలో 1.6 ఎకరాల స్థలాన్ని ఆగ్రో ట్రేడ్ సెంటర్ నిర్మాణం కోసం ‘మెస్సర్స్ ఆగ్రో ట్రేడ్ సెంటర్ (కర్నూలు) ప్రైవేటు లిమిటెడ్’ సంస్థకు లీజు ప్రాతిపదికన కేటాయించాలని 2012లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఏటా రూ.29.04 లక్షల అద్దె చెల్లించేందుకు ముందుకొచ్చిన ఆ సంస్థకే లీజుకు ఇస్తూ తర్వాత అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చింది. ఒప్పందంలో భాగంగా సంస్థ పాటించాల్సిన నిబంధనలు, చెల్లించాల్సిన సొమ్ము వివరాలను ప్రకటించింది. ప్రభుత్వ సూచనల ప్రకారం ఆగ్రో ట్రేడ్ సెంటర్ నిర్మాణం కోసమే ఈ సంస్థ ఏర్పడింది. అందులో ఎస్వీ ఇంజినీరింగ్ కన్స్ట్రక్షన్స్ ప్రధాన భాగస్వామి కాగా, ఏరోస్పేస్ ఇంజినీరింగ్, నియోటెక్ సొల్యూషన్స్ సంస్థలు వాటాదారులు. ఒప్పందం మేరకు ఆగ్రో సంస్థ ఇప్పటికే ప్రభుత్వానికి రుసుం చెల్లించింది.
కేటాయించిన స్థలంలో వాణిజ్య భవనం నిర్మించి ట్రేడ్ సెంటర్ నిర్వహణకు అవసరమైన మేర ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది. మిగిలిన స్థలాన్ని వాణిజ్య ప్రాతిపదికన లీజు పొందిన సంస్థ వినియోగించుకోవచ్చు. 33 ఏళ్ల పాటు లీజు మనుగడలో ఉంటుంది. గడువు ముగిశాక అక్కడ నిర్మించిన భవనాలను ప్రభుత్వానికి అప్పగించాలి. లీజుదారుకు ఆదాయం వచ్చినా, రాకపోయినా లీజు రుసుములను మాత్రం ప్రభుత్వానికి కట్టాల్సిందే. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరించినప్పటికీ, స్థలాన్ని లీజుదారుకు ఇంకా అప్పగించలేదు. ఖాళీగా ఉన్న ఆ స్థలాన్ని ఎప్పటికైనా అప్పగిస్తారన్న ఆశతో లీజుదారులు ఉన్నారు. ఇంతలో ప్రభుత్వం తాజాగా వైకాపా కార్యాలయానికి కేటాయించడంపై మెస్సర్స్ ఆగ్రో ట్రేడ్ సెంటర్ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమైంది. ‘కర్నూలు నడిబొడ్డున విలువైన ఈ స్థలాన్ని మాకు కేటాయిస్తామని చెప్పి, భారీ మొత్తంలో రుసుములు కూడా కట్టించుకున్నాక అన్యాయం చేయడమేంటి? మేం చెల్లించిన సొమ్ము వెనక్కి ఇవ్వకుండా, ఒప్పందాన్ని రద్దు చేసుకోకుండా ఇతరులకు ఆ స్థలాన్ని ఎలా కేటాయిస్తారు’ అని సంస్థ ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!