Vizag Drugs Case: కంటెయినర్లో వచ్చింది డ్రగ్సే
సంధ్య ఆక్వా చిరునామాతో బ్రెజిల్ నుంచి విశాఖపట్నానికి వచ్చిన కంటెయినర్లోని ‘ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్’ బస్తాల్లో నుంచి 49 నమూనాల్ని తీసి పరీక్షించగా 48 నమూనాల్లో కొకైన్, మెథక్వలోన్ వంటి మాదక ద్రవ్యాలున్నట్లు తేలింది.
49 నమూనాల్ని పరీక్షిస్తే.. కొకైన్, మెథక్వలోన్ ఉన్నట్లు నిర్ధారణ
టెస్ట్-ఏలో 27 నమూనాల్లో మార్ఫిన్, ఓపియం, హెరాయిన్
విశాఖ డ్రగ్ రాకెట్ కేసులో సుదీర్ఘ ఆపరేషన్
ఇంటర్పోల్ నుంచి మెయిల్లో సమాచారం
ఆ వెంటనే విమానంలో విశాఖకు ప్రయాణం
సీబీఐ నివేదికలో వెల్లడి
ఈనాడు, అమరావతి: సంధ్య ఆక్వా చిరునామాతో బ్రెజిల్ నుంచి విశాఖపట్నానికి వచ్చిన కంటెయినర్లోని ‘ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్’ బస్తాల్లో నుంచి 49 నమూనాల్ని తీసి పరీక్షించగా 48 నమూనాల్లో కొకైన్, మెథక్వలోన్ వంటి మాదక ద్రవ్యాలున్నట్లు తేలింది. ఓపియం, మార్ఫిన్, హెరాయిన్, యాంఫిటమిన్, మెస్కలిన్ తదితరాల ఉనికి ఉందా?అనేది తెలుసుకునేందుకు 27 నమూనాలకు టెస్ట్-ఏ నిర్వహించగా... అన్నింటిలోనూ ఆ డ్రగ్స్ ఉన్నట్లు తేలింది. ఒక్కోటీ 25 కిలోల పరిమాణం కలిగిన 1,000 బస్తాల ‘ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్’ను 20 ప్యాలెట్లలో నింపి బ్రెజిల్ నుంచి కంటెయినర్లో విశాఖపట్నానికి తీసుకొచ్చారు. వాటిలో ఒక్కో ప్యాలెట్ నుంచి ఒక్కోటి చొప్పున ర్యాండమ్గా 20 బస్తాలను సీబీఐ అధికారులు బయటకు తీసి నమూనాలను పరీక్షించారు.
అన్నింటిలో మాదకద్రవ్యాలు ఉన్నట్లు నిర్ధారణైంది. అంటే మొత్తం 25 వేల కిలోల ‘ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్’ లోనూ మాదకద్రవ్యాలు ఉనికి ఉన్నట్లు స్పష్టమైంది. ఎంత పరిమాణంలో ఉన్నాయో తేలాల్సి ఉంది. కనీసం 20 శాతం మేర మాదకద్రవ్యాలు కలగలిసి ఉంటాయనుకున్నా... ఇంత భారీ మొత్తంలో చిక్కడం దేశంలోనే తొలిసారి కావొచ్చు. వీటి విలువ వేల కోట్ల రూపాయల్లో ఉంటుందనేది అనధికారిక అంచనా. ఇంతటి అతిపెద్ద అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ రాకెట్ను ఛేదించేందుకు సీబీఐ సుదీర్ఘ ఆపరేషన్ చేపట్టింది. ఆ వివరాలన్నింటినీ ఎఫ్ఐఆర్తో పాటు ఓ నివేదిక రూపంలో పొందుపరిచింది.
ఆఘమేఘాలపై...
అది దిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం.... ఈ నెల 18న ఇంటర్పోల్ నుంచి వారికి ఓ మెయిల్ అందింది.. ‘బ్రెజిల్ నుంచి విశాఖపట్నానికి ఎస్ఈకేయూ 4375380 నంబరు కంటెయినర్ వస్తోంది... అందులో భారీగా డ్రగ్స్ ఉన్నాయి. మేం దాన్ని గుర్తించేలోగానే అది ఇక్కడ పోర్టు దాటేసింది. మీరు దాన్ని పట్టుకుని తనిఖీ చేయండి’ అనేది దాని సారాంశం. ఆ సమాచారం ఆధారంగా నిమిషాల వ్యవధిలో సీబీఐ ఫిర్యాదు నమోదు చేసి రంగంలోకి దిగింది. ఎస్పీ గౌరవ్మిట్టల్ నేతృత్వం, పర్యవేక్షణలో డీఎస్పీలు ఉమేశ్ శర్మ, ఆకాశ్కుమార్ మీనాలతో పాటు మరికొందరితో బృందాన్ని ఏర్పాటు చేసింది. ‘ప్రత్యేక ఆపరేషన్ కోసం దిల్లీ నుంచి మీ దగ్గరకు ఓ బృందం వస్తోంది. సహకారం కోసం కొందరు అధికారులు, సిబ్బందిని సిద్ధంగా ఉంచండి’ అని విశాఖలోని సీబీఐ విభాగానికి, కస్టమ్స్ శాఖకు సమాచారమిచ్చింది.
దిల్లీ నుంచి విశాఖ వయా బెంగళూరు
బృంద సభ్యులంతా తొలుత దిల్లీ నుంచి బెంగళూరుకు ఒక విమానంలో, అక్కడి నుంచి విశాఖకు మరో విమానంలో పయనమయ్యారు. 18న సాయంత్రం దిల్లీ నుంచి బయల్దేరిన ఈ బృందం 19న ఉదయం 8.15 గంటలకు విశాఖ చేరుకుంది. ఆ తర్వాత నగరంలోని కస్టమ్స్ విభాగం ప్రిన్సిపల్ కమిషనర్ను కలిసి చేపట్టబోయే ఆపరేషన్ గురించి వివరించింది. బ్రెజిల్ నుంచి వచ్చిన కంటెయినర్ గురించి సమాచారం అడిగి తెలుసుకుంది. అది తమ ఆధీనంలోనే సురక్షితంగా ఉందని ప్రిన్సిపల్ కమిషనర్ చెప్పటంతో నేరుగా పోర్టుకు బయల్దేరింది.
లేత పసుపు రంగు పొడి
19న మధ్యాహ్నం 12.30 గంటలకు పోర్టుకు చేరుకున్న సీబీఐ, కస్టమ్స్ బృందాలు.. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులకు తాము ఎందుకొచ్చామో వివరించి... తనిఖీలు ప్రారంభించాయి. కంటెయినర్లోని ఒక్కో ప్లాస్టిక్ బ్యాగ్ తీస్తుంటే... లేత పసుపు రంగు పొడి బయటపడింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) నుంచి తీసుకొచ్చిన ‘నార్కోటిక్ డ్రగ్స్ డిటెక్షన్’ కిట్ను ఉపయోగించి అధికారులు పరీక్షలు నిర్వహించారు. కొకైన్, మెథక్వలోన్ ఉనికిని గుర్తించేందుకు టెస్ట్-ఈ, ఓపియం, మార్ఫిన్, హెరాయిన్, యాంఫిటమిన్, మెస్కలిన్ వంటి వాటిని నిర్ధారించేందుకు టెస్ట్-ఏ, గంజాయి, హాషిస్, హాషిస్ ఆయిల్ వంటివి గుర్తించేందుకు టెస్ట్-బీ చేశారు. పరీక్షించిన నమూనాల్లో ‘టెస్ట్-ఈ, టెస్ట్-ఏ’కు సంబంధించి మాదకద్రవ్యాలు ఉన్నట్లు తేలింది.
సమాధానాలు చెప్పటంలో తడబాటు
బ్రెజిల్ నుంచి వచ్చిన ‘ఇన్ యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్’లో మాదకద్రవ్యాలున్నట్లు తేలటంతో సీబీఐ అధికారులు అక్కడే ఉన్న సంధ్య ఆక్వా సంస్థ ప్రతినిధి ఆర్వీఎల్ఎన్ గంగాధర్ను ప్రశ్నించారు. తాము మొదటిసారి దీన్ని దిగుమతి చేసుకున్నామని, అందులో ఏమేం కలిసి ఉన్నాయనే దానిపై తమకు అవగాహన లేదని సమాధానమిచ్చారు. అదే సమయంలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోర్టు ఉద్యోగులు పెద్ద ఎత్తున గుమికూడటంతో పరీక్షల నిర్వహణ ప్రక్రియలో జాప్యం చోటుచేసుకుంది. అదే సమయంలో వర్షం పడే ఛాయలు కనిపించటంతో... సరకు మొత్తం తడిచిపోతే పాడైపోతుందంటూ సంధ్య ఆక్వా ప్రతినిధులు సీబీఐ అధికారులకు విన్నవించారు. సీబీఐ ఆ ప్యాలెట్లను రీప్యాక్ చేసి వాటిని కంటెయినర్లో భద్రపరచి సీల్ చేసింది. ఆ తర్వాత 20న ఉదయం 10.15 గంటల నుంచి మళ్లీ పరీక్షలు ప్రారంభించగా.. అన్ని నమూనాల్లోనూ డ్రగ్స్ మూలాలు బయటపడ్డాయి. సంధ్య ఆక్వా ప్రతినిధులు ఒక్కసారిగా కలవరపాటుకు గురయ్యారు. సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు సంతృప్తికరంగా సమాధానాలు ఇవ్వలేకపోయారు.
55 గంటల పాటు సుదీర్ఘ ఆపరేషన్
18న మధ్యాహ్నం సమాచారమందుకున్న సీబీఐ.. 55 గంటల పాటు సుదీర్ఘ ఆపరేషన్ చేపట్టి డ్రగ్స్ గుట్టురట్టు చేసింది. 20న రాత్రి 7.30 వరకూ పరీక్షలు కొనసాగించింది. బ్రెజిల్ నుంచి వచ్చిన సరకు మొత్తాన్నీ బయటకు తీసి వాటిని ఎన్వైకేయూ 0823944 నంబరు గల కంటెయినర్లోకి మార్చి దానికి సీబీఐ బ్రాస్ సీల్ వేసింది. ఆ తర్వాత సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మరికొందరు వ్యక్తులపై ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 29 రెడ్విత్ 8, 23, 38ల ప్రకారం కేసు నమోదు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!