శివయ్య సాక్షిగా.. రాజీ నాటకం
‘నా భర్తను అంతు చూస్తానని హెచ్చరించారట.. ఈ వయసులో ఆయన్ను కొట్టారు. ఏమైనా అయితే ఎవరు సమాధానం చెబుతారు’.. కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులపై మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావు దాడి చేయడంపై దేవాదాయశాఖ అధికారులు మంగళవారం విచారణ చేపట్టినప్పుడు బాధిత అర్చకుడి భార్య చేసిన వ్యాఖ్యలివి.
అర్చకులపై దాడి చేసిన వైకాపా నేతను కాపాడే యత్నాలు
బలవంతంగా క్షమాపణ చెప్పించి, రాజీ చేయించే యత్నం
ఆలయ ప్రాంగణంలోనే ఆర్జేసీ విచారణ
మొక్కుబడి కేసుతో సరిపెట్టిన పోలీసులు
ఈనాడు - కాకినాడ, న్యూస్టుడే- గాంధీనగర్: ‘నా భర్తను అంతు చూస్తానని హెచ్చరించారట.. ఈ వయసులో ఆయన్ను కొట్టారు. ఏమైనా అయితే ఎవరు సమాధానం చెబుతారు’.. కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులపై మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావు దాడి చేయడంపై దేవాదాయశాఖ అధికారులు మంగళవారం విచారణ చేపట్టినప్పుడు బాధిత అర్చకుడి భార్య చేసిన వ్యాఖ్యలివి. అర్చకుడు పెద్దసోమయాజుల వెంకట సత్యసాయిని సోమవారం చెంపపై కొట్టడంతోపాటు కాలితో తన్నిన చంద్రరావు, సర్దిచెప్పడానికి ప్రయత్నించిన మరో అర్చకుడు మద్దిరాల విజయ్కుమార్పైనా చేయిచేసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటనపై దేవాదాయశాఖ ఇన్ఛార్జ్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేసీ) విజయరాజు మంగళవారం ఆలయ ప్రాంగణంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగానూ నిందితుడు చంద్రరావు మళ్లీ దూకుడుగా ప్రవర్తించారు. అర్చకుల డిమాండ్ మేరకు క్షమాపణ చెప్పడానికి సైతం ఇబ్బంది పడ్డారు. నేనేం దాడి చేయలేదంటూ తొలుత బుకాయించినా.. అందరూ గద్దించడంతో గత్యంతరం లేక బాధిత అర్చకుడి చేతులు పట్టుకుని, అక్కడున్న అందరికీ రెండు చేతులు జోడించి క్షమించండని కోరారు. అయితే అక్కడి నుంచి బయటకు వచ్చాక ‘నేనేం తప్పు చెయ్యలేదు.. క్షమాపణ చెప్పలేదు’ అంటూ మీడియా ముందు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. మొత్తానికి రాజకీయ ఒత్తిళ్లతో కేసును నీరుగార్చేందుకు పోలీసులు చూస్తుండగా, మరికొందరు అర్చకులకు సర్దిచెప్పి రాజీ కుదిర్చేందుకు విఫలయత్నాలు చేశారు.
ఆర్జేసీపైనా బెదిరింపు ధోరణే
దేవాదాయశాఖ ఆర్జేసీ విజయరాజు విచారణకు వస్తున్నారని తెలియడంతో నిందితుడు చంద్రరావు అక్కడికి చేరుకున్నారు. అర్చకులను ఎందుకు కొట్టారని ఆర్జేసీ ప్రశ్నించగా.. తానేమీ కొట్టలేదని, కేవలం నెట్టానంటూ చంద్రరావు నిర్లక్ష్యంగా జవాబిచ్చారు. మిమ్మల్ని కొడితే ఊరుకుంటారా అని ఆర్జేసీ నిలదీశారు. వెంటనే చంద్రరావు గట్టిగా మాట్లాడేందుకు చూశారు. దీంతో అక్కడివారంతా కలగజేసుకొని క్షమాపణ చెబితే అంతా సర్దుకుంటుందన్నారు. నేను క్షమాపణ చెప్పనని, కాదూకూడదంటే పెట్రోలు పోసుకుంటానంటూ చంద్రరావు చొక్కా గుండీలు తీసి బెదిరించేలా ప్రవర్తించారు. దీంతో ఆర్జేసీ ‘అర్చకులు, ఉద్యోగులంటే మీకు బానిసల్లా కనబడుతున్నారా? తప్పుచేసి అలా మాట్లాడుతున్నారేంటి? వారికి అవమానం కాదా? అర్చక వ్యవస్థనే ఇబ్బంది పెడుతున్నారు. నా ముందే అలా మాట్లాడడం సరికాదు. ఉద్యోగులపై చేయిచేసుకోవడం మీ సంస్కారమా? అంత సహనం లేనప్పుడు గుడికి ఎందుకొచ్చారు? ఏమైనా ఉంటే ఈవోకు ఫిర్యాదు చెయ్యాలి కదా?’ అని మండిపడ్డారు. వెంటనే డీఎస్పీకి ఫోన్ చేసి బాధ్యుణ్ని అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.
విచారణ సమయంలో పూజారి వెంకట సత్యసాయి, విజయ్కుమార్ల కుటుంబసభ్యులు ఆర్జేసీ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. చర్యలు తీసుకుంటామని ఆయన వారికి భరోసా ఇచ్చారు. దేవాదాయశాఖ కమిషనర్తో బాధిత అర్చకుడు సత్యసాయిని మాట్లాడించారు. న్యాయం జరిగేలా చూస్తానని కమిషనర్ హామీ ఇచ్చారు. అందరితో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్న అనంతరం ఆర్జేసీ విలేకర్లతో మాట్లాడారు. దేవుడి సన్నిధిలోనే అర్చకులను కొట్టడం దురదృష్టకరమన్నారు. దాడి ఘటనపై ఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారని, శాఖాపరంగానూ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) ఆర్జేసీని కోరారు.
మొక్కుబడి సెక్షన్తో సరి
ఈ ఘటనలో పోలీసుల తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాణహాని ఉందని బాధిత కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. నామమాత్రమైన ఐపీసీ సెక్షన్ 332 (ప్రభుత్వ ఉద్యోగిపై దాడి) కింద కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించడం గమనార్హం. ఈ సెక్షన్ ప్రకారం 41ఏ నోటీసిచ్చే వీలుందే తప్ప, అరెస్టు చేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఓవైపు బాధ్యుడిపై కేసు నమోదు చేశామని, తమ అదుపులోనే ఉన్నారని కాకినాడ డీఎస్పీ హనుమంతరావు మీడియా సమావేశంలో వెల్లడిస్తే.. మరోవైపు నిందితుడు చంద్రరావు మాత్రం శివాలయంలో హడావుడి చేస్తూ కనిపించారు.
‘నేను చెయ్యి చేసుకోలేదు. ఎవర్నీ కొట్టలేదు. తోశానంతే. నేను సారీ చెప్పలేదు. పెద్దలందరూ పొరపాటయిందని చెప్పమంటే చెప్పాను అంతే’
వైకాపా నాయకుడు సిరియాల చంద్రరావు
‘నా భర్తను అంతు చూస్తానని హెచ్చరించారట.. వాళ్లు ఏమైనా చెయ్యగలరు. అదే మా భయం. ప్రతిరోజు తెల్లవారుజామున 5 గంటలకు నడుచుకుంటూ గుడికి వెళతారు. ఆయనకు ప్రాణాపాయం లేకుండా చూడాలి. 30 ఏళ్లుగా ఇక్కడ దేవుడి సేవలో ఉండిపోయాం. ఈ వయసులో ఆయన్ను కొట్టారు. ఏమైనా అయితే ఎవరు సమాధానం చెబుతారు. మా ఆయన సేవలు ఇష్టం లేదంటే వెళ్లిపోతాం కానీ ఇలా కొట్టడమేంటి?
బాధిత అర్చకుడు వెంకటసత్యసాయి భార్య నాగమణి ఆవేదన
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ