పింఛన్‌ పొందక అవ్వ మృతి

పింఛన్‌ కోసం పరితపించి చివరికి అది పొందకుండానే ఓ వృద్ధురాలు మృతిచెందిన ఘటన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని ముచ్చువోలులో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు..

Published : 23 Apr 2024 05:05 IST

శ్రీకాళహస్తి గ్రామీణం(ఏర్పేడు), న్యూస్‌టుడే: పింఛన్‌ కోసం పరితపించి చివరికి అది పొందకుండానే ఓ వృద్ధురాలు మృతిచెందిన ఘటన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని ముచ్చువోలులో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన గుమ్మళ్ల ఆదిలక్ష్మమ్మ(85) తెదేపా పాలనలో వృద్ధాప్య పింఛన్‌ అందుకునేవారు. వైకాపా అధికారంలోకి రాగానే తెదేపా సానుభూతిపరురాలి పేరిట పింఛన్‌ తొలగించారు. అప్పటి నుంచి తమకు న్యాయం చేయాలని పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా ప్రయోజనం లేకపోయింది. ఇటీవల ముచ్చువోలులో ప్రచారం నిర్వహించిన తెదేపా నేతలకు ఆదిలక్ష్మమ్మ పింఛన్‌ కోసం విన్నవించుకోవడంతో అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇంతలో ఆమె మృతిచెందడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని