తెలుగు రాష్ట్రాల్లో మరో 150 శాఖలు: ముత్తూట్ మినీ ఫైనాన్షియర్స్
బ్యాంకింగేతర ఆర్థిక సేవల సంస్థ (ఎన్బీఎఫ్సీ) ముత్తూట్ మినీ ఫైనాన్షియర్స్, దేశవ్యాప్తంగా కొత్త శాఖలను పెద్దఎత్తున ఏర్పాటు చేయనుంది. తద్వారా ఈ ఏడాదిలో 1000 శాఖలకు చేరుకోనున్నట్లు ముత్తూట్ మినీ ఫైనాన్షియర్స్ ప్రకటించింది.
ఈనాడు, హైదరాబాద్: బ్యాంకింగేతర ఆర్థిక సేవల సంస్థ (ఎన్బీఎఫ్సీ) ముత్తూట్ మినీ ఫైనాన్షియర్స్, దేశవ్యాప్తంగా కొత్త శాఖలను పెద్దఎత్తున ఏర్పాటు చేయనుంది. తద్వారా ఈ ఏడాదిలో 1000 శాఖలకు చేరుకోనున్నట్లు ముత్తూట్ మినీ ఫైనాన్షియర్స్ ప్రకటించింది. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 150 కొత్త శాఖలు ఏర్పాటు చేస్తామని పేర్కొంది. దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 600 మందికి ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించింది. కాకినాడ, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, కామవరపుకోట, దేవరపల్లిలో కొత్త శాఖలను ప్రారంభించినట్లు ముత్తూట్ మినీ ఫైనాన్షియర్స్ ఎండీ మాథ్యూ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం