పాన్ - ఆధార్ను లింక్ చేయడం ఎలా..?
మార్చి 31 లోపు పాన్-ఆధార్లను అనుసంధానించకపోతే రూ.1000 ఆలస్య రుసము చెల్లించాల్సి ఉంటుంది.
ఇంటర్నెట్డెస్క్: పాన్ కార్డును ఆధార్తో అనుసంధానించేందుకు చివరి తేదీ మార్చి 31. ఈ గడువు లోపు లింక్ చేయకపోతే రూ.1000 ఆలస్య రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు 2021 ఆర్థిక బిల్లులో ప్రభుత్వం కొత్త సెక్షన్ 234 హెచ్ను ప్రవేశపెట్టింది. ఇంతవరకు పాన్- ఆధార్ లింక్ చేయని వారు ఈ నెలాఖరు లోపు లింక్ చేయడం మంచిది. పాన్ కార్డుతో, ఆధార్ను లింక్ చేసే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
పాన్తో ఆధార్ అనుసంధానం ఇలా..
1. ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ తెరవండి.
2. మొదటిసారి లాగిన్ అయ్యే వారు రిజిస్టర్ చేసుకోవాలి. మీ పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య) మీ యూజర్ ఐడీ అవుతుంది.
3. యూజర్ ఐడీ, పాస్వర్డ్, పుట్టిన తేదీని నమోదు చేసి లాగిన్ అవ్వండి.
4. ఆధార్-పాన్ లింక్ కోసం ఒక పాప్-అప్ విండో ఓపెన్ అవుతుంది.
5. పాన్ కార్డులోని వివరాల ప్రకారం పేరు, పుట్టిన తేదీ వంటి సమాచారం కనిపిస్తుంది.
6. స్క్రీన్పై కనిపిస్తున్న పాన్ కార్డు వివరాలను ఆధార్లో పేర్కొన్న వివరాలతో ధ్రువీకరించుకోవాలి. ఒకవేళ వివరాలలో ఏమైనా తేడాలు ఉంటే రెండింటిలో ఒకే విధంగా ఉండేలా సరి చేసుకోవాలి.
7. వివరాలు సరిపోలితే, మీ ఆధార్ నంబర్ను ఎంటర్ చేసి “ లింక్ నౌ ” బటన్ పై క్లిక్ చేయండి.
8. మీ ఆధార్, పాన్తో విజయవంతంగా లింక్ అయినట్లు పాప్-అప్ విండోతో సందేశం వస్తుంది.
9. ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ హోమ్ పేజీలో కనిపిస్తున్న “లింక్ ఆధార్” పై క్లిక్ చేయడం ద్వారా కూడా నేరుగా అనుసంధానించవచ్చు.
10. https://www.utiitsl.com/ లేదా https://www.egov-nsdl.co.in/ వెబ్సైట్ల ద్వారా కూడా ఆధార్, పాన్లను లింక్ చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ