Mahindra XUV700: మహీంద్రా కొత్త కారు.. 57 నిమిషాల్లో 25,000 బుకింగ్‌లు

ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా ఇటీవల విడుదల చేసిన సరికొత్త ఫ్లాగ్‌షిప్‌ కారు ఎక్స్‌యూవీ 700కు మంచి క్రేజ్‌ లభిస్తోంది. ఈ కారు బుకింగ్స్‌ను

Published : 07 Oct 2021 16:17 IST

దిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా ఇటీవల విడుదల చేసిన సరికొత్త ఫ్లాగ్‌షిప్‌ కారు ఎక్స్‌యూవీ 700కు మంచి క్రేజ్‌ లభిస్తోంది. ఈ కారు బుకింగ్స్‌ను గురువారం ప్రారంభించగా హాట్‌కేకుల్లా బుక్‌ అయ్యాయి. కేవలం 57 నిమిషాల్లోనే 25వేల బుకింగ్స్‌ వచ్చినట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. 

‘‘ఎక్స్‌యూవీ 700 కోసం ఈ ఉదయం 10 గంటలకు బుకింగ్స్‌ తెరిచాం. 57 నిమిషాల్లోనే 25వేల మంది ఈ కారును బుక్‌ చేసుకున్నారు. ఈ కారుకు వచ్చిన స్పందన చూసి ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది’’ అని మహీంద్రా అండ్‌ మహీంద్రా ఆటోమోటివ్‌ డివిజన్‌ సీఈవో విజయ్‌ నక్రా తెలిపారు. అటు సంస్థ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా కూడా ట్విటర్‌ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. కస్టమర్లకు తమ సంస్థపై ఎంత నమ్మకం ఉందో, తమ భుజాలపై ఎంత బాధ్యత ఉందో దీన్ని చూస్తుంటే అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు. 

సెప్టెంబరు నెలాఖరులో ఎక్స్‌యూవీ 700 కారును విడుదల చేశారు. దీని ప్రారంభ వేరియంట్‌(ఎక్స్‌షోరూం) ధర రూ.11.99 లక్షలుగా.. టాప్‌ వేరియంట్‌ ధర రూ.21.09లక్షలుగా నిర్ణయించారు. దీనిని పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్లతో తొమ్మది వేరియంట్లల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆల్‌వీల్‌ డ్రైవ్‌  ఫీచర్‌ కూడా ఉంది. ఐదు, ఏడు సీట్ల ఆప్షన్లలో లభిస్తుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు