Oxygen కొరత.. మారుతీ కీలక నిర్ణయం
దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న వేళ ప్రముఖ కార్ల తయారీ మారుతీ సుజుకీ కీలక నిర్ణయం తీసుకుంది. హరియాణాలోని తమ ఫ్యాక్టరీలన్నింటినీ......
ముంబయి: దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న వేళ ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ కీలక నిర్ణయం తీసుకుంది. హరియాణాలోని తమ ఫ్యాక్టరీలన్నింటినీ మూసివేయాలని నిర్ణయించింది. తద్వారా తమ వద్ద ఉన్న ఆక్సిజన్ నిల్వల్ని వైద్య అవసరాల కోసం మళ్లించనున్నట్లు తెలిపింది. సాధారణంగా నిర్వహణ కార్యకలాపాల నిమిత్తం ప్రతి ఏటా రెండుసార్లు మారుతీ ఫ్యాక్టరీలను కొద్దిరోజుల పాటు మూసివేస్తుంటారు. ఈ క్రమంలో జూన్లో మూసివేయాల్సిన ఫ్యాక్టరీలను ఈసారి కాస్త ముందుగానే క్లోజ్ చేయాలని నిర్ణయించారు. మే 1 నుంచి మే 9 వరకు హరియాణాలోని మారుతీ ఫ్యాక్టరీలన్నీ మూసి ఉంచనున్నారు. తద్వారా తమ ఉద్ద ఉన్న ఆక్సిజన్ నిల్వల్ని ఆస్పత్రులకు తరలించే అవకాశం ఏర్పడుతుందని భావించారు. ప్రజల ప్రాణాల్ని రక్షించడంలో ప్రభుత్వానికి తమ సహకారం నిరంతరం కొనసాగుతుందని మారుతీ హామీ ఇచ్చింది. గుజరాత్లోని సుజుకీ మోటార్స్ ఇండియా సైతం ఇదే నిర్ణయం తీసుకుందని మారుతీ తన ప్రకటనలో పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం