iPhone 5G Update: డిసెంబరులో ఐఫోన్ 5జీ సాఫ్ట్వేర్ అప్డేట్!
iPhone 5G Update: 5జీ సేవలకు అనువైన సాఫ్ట్వేర్ను డిసెంబర్ నాటికి అప్డేట్ చేస్తామని యాపిల్ తెలిపింది. ఈ విషయంపై నేడు వివిధ కంపెనీలతో ప్రభుత్వం సమావేశం నిర్వహించనుంది.
దిల్లీ: దేశంలో 5జీ సేవలు ప్రారంభమైనప్పటికీ.. ఇంకా స్మార్ట్ఫోన్లు దానికి అనువైన సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాల్సిన ఉందన్న వార్తలపై ఐఫోన్ తయారీ కంపెనీ యాపిల్ స్పందించింది. డిసెంబరు నాటికి ఐఫోన్ 14 సహా ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆ సంస్థకు చెందిన అన్ని 5జీ మోడళ్లకు సాఫ్ట్వేర్ అప్డేషన్ అందిస్తామని మంగళవారం తెలిపింది. 5జీ సేవల నాణ్యత, పనితీరుపై జరుగుతున్న ప్రయోగ పరీక్షలు సఫలమైన వెంటనే అప్డేట్ అందిస్తామని పేర్కొంది. ప్రస్తుతం ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ 14 సిరీస్లతో పాటు ఐఫోన్ ఎస్ఈ (3వ తరం) ఫోన్లు 5జీ సామర్థ్యం కలిగి ఉన్నాయి. వీటిని ఎయిర్టెల్, జియో 5జీ నెట్వర్క్లపై యాపిల్ పరీక్షిస్తోంది.
దేశంలో 10 కోట్ల మందికి పైగా వినియోగదారులు ఇప్పటికే ‘5జీ రెడీ’ అని ప్రకటిత స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసుకున్నారు. వీటన్నింటికీ 5జీ సేవలకు అనువైన సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే టెలికాం విభాగ కార్యాలయంలో బుధవారం అత్యున్నత సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో టెలికాం-ఐటీ కార్యదర్శులతో పాటు యాపిల్, శాంసంగ్, వివో, షియోమీ వంటి మొబైల్ తయారీ కంపెనీల నిర్వాహకులతో పాటు దేశీయ టెలికాం ఆపరేటర్లయిన రిలయన్స్, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా ప్రతినిధులు పాల్గొననున్నారు. దేశీయంగా 5జీ సేవలు పొందేలా సాఫ్ట్వేర్ అప్డేట్లను వినియోగదారులకు పంపేందుకు మొబైల్ తయారీ సంస్థలు ‘ప్రాధాన్యత’ ఇవ్వాలని కోరనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విదేశీ మదుపర్లలో ఎన్నికల గుబులు
దశాబ్దకాలంలోనే తొలిసారిగా భారత స్టాక్ మార్కెట్లపై విదేశీ మదుపర్లు నిరాశావాద దృక్పథంతో ఉన్నట్లు కనిపిస్తోంది. -
బీసీజీ షేర్ల ట్రేడింగ్పై జూన్ 14 నుంచి సస్పెన్షన్
బీసీజీ (బ్రైట్కామ్ గ్రూపు) సంస్థకు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ కంపెనీ షేర్ల ట్రేడింగ్పై బీఎస్ఈ, ఎన్ఎన్సీ సస్పెన్షన్ విధించాయి. -
విదేశీ ఖనిజాలపై కోల్ ఇండియా, ఎన్ఎమ్డీసీ దృష్టి
ప్రభుత్వ రంగ కంపెనీ (పీఎస్యూ)లైన కోల్ ఇండియా, ఎన్ఎమ్డీసీ, ఓఎన్జీసీ విదేశ్ (ఓవీఎల్).. విదేశాల్లో కీలక ఖనిజ ఆస్తుల కొనుగోలు విషయంలో చురుగ్గా ముందుకు వెళుతున్నాయని కేంద్రం బుధవారం పేర్కొంది. -
టెక్ ఉద్యోగాల్లో మహిళల వాటా తక్కువే
దేశంలోని టెక్ ఉద్యోగాల్లో లింగ అసమానత కనిపిస్తోందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) బోర్డు డైరెక్టర్, ముకేశ్ అంబానీ కుమార్తె ఈశా అంబానీ బుధవారం వెల్లడించారు. -
ఒడుదొడుకుల్లో స్వల్ప నష్టాలు
రోజంతా ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, రిలయన్స్ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. -
కేవైసీ ధ్రువీకరణ మరింత సులభం
కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీ (కేఆర్ఏ)ల ద్వారా కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకో) వివరాల ధ్రువీకరణ ప్రక్రియను సులభతరం చేయాలని సెబీ నిర్ణయం తీసుకుంది. -
4 నెలల గరిష్ఠానికి వాణిజ్య లోటు
మనదేశం నుంచి వస్తు ఎగుమతులు ఈ ఏడాది ఏప్రిల్లో 34.99 బిలియన్ డాలర్లు (సుమారు రూ.2.90 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. -
ఎల్ఐసీకి మరో మూడేళ్ల సమయం
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో ప్రజల కనీస వాటా 10 శాతానికి చేరేందుకు మరో మూడేళ్ల గడువు లభించింది. 2022 మే 17న ఎల్ఐసీ స్టాక్ మార్కెట్లో నమోదయ్యింది. -
సోరియాసిస్ వ్యాధికి ఔషధం
జర్మనీకి చెందిన బోహ్రింగర్ ఇంగెల్హీమ్ అనే ఔషధ సంస్థ మనదేశంలో సొరియాసిస్ (జనరలైజ్డ్ పస్టులర్ సోరియాసిస్-జీపీపీ) అనే వ్యాధి చికిత్సలో వినియోగించే స్పెవిగో (స్పెసోలిమాబ్) ఇంజెక్షన్ను అందుబాటులోకి తీసుకురానుంది. -
ఫోన్ ఛార్జీలు పెంచాల్సిందే
ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో టెలికాం ఛార్జీలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయని భారతీ ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విత్తల్ పేర్కొన్నారు. -
డిపాజిట్ రేట్లు పెంచిన ఎస్బీఐ
ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. -
సంక్షిప్త వార్తలు
గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో బెర్జర్ పెయింట్స్ రూ.222.62 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/05/24)
-
సముద్రం ముప్పు.. థాయ్లాండ్ రాజధానిని తరలించాల్సిందేనా..?
-
అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు.. ఎందుకో తెలుసా?
-
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
-
‘గర్జనకు సిద్ధం’.. బైడెన్ సవాలును స్వీకరించిన ట్రంప్!
-
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కే స్పందనిదే