Adani Stocks: అదానీ మదుపర్లు లబోదిబో
అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు...అదానీ గ్రూపు షేర్లను కుదిపేస్తున్నాయి. శుక్రవారం మరో 5- 20% వరకు ఇవి పతనమయ్యాయి.
గ్రూపు కంపెనీల షేర్లకు హిండెన్బర్గ్ ఆరోపణల సెగ
శుక్రవారం 5- 20% వరకు పతనం
రెండు రోజుల్లోనే రూ.4.17 లక్షల కోట్ల మార్కెట్ విలువ ఆవిరి
స్టాక్ మార్కెట్లపైనా ప్రభావం
ప్రపంచ కుబేరుల జాబితాలో ఏడో స్థానానికి దిగొచ్చిన గౌతమ్!
అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు...అదానీ గ్రూపు షేర్లను కుదిపేస్తున్నాయి. శుక్రవారం మరో 5- 20% వరకు ఇవి పతనమయ్యాయి. అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని.. ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ హిండెన్బర్గ్ నివేదిక వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలు నిరాధారమైనవని, తమ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే దురుద్దేశంతోనే ఈ నివేదికను విడుదల చేశారని అదానీ గ్రూపు వివరణ ఇచ్చింది. అయినప్పటికీ శుక్రవారమూ షేర్ల పతనం ఆగలేదు. దీంతో రెండో రోజుల్లోనే అదానీ గ్రూపునకు చెందిన నమోదిత కంపెనీల షేర్ల మొత్తం మార్కెట్ విలువ రూ.4.17 లక్షల కోట్ల మేర ఆవిరైంది. హిండెన్బర్గ్ ఆరోపణల ప్రభావం నిన్న ప్రారంభమైన అదానీ ఎంటర్ప్రైజెస్ రూ.20,000 కోట్ల మలి విడత పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ) పైనా పడింది. అదానీ గ్రూపు షేర్ల పతనంతో.. దేశీయ స్టాక్ మార్కెట్లు రెండు రోజులుగా నష్టాలను చవిచూస్తున్నాయి. నివేదికలో అదానీ గ్రూపు రుణాల వ్యవహారానికి సంబంధించిన ఆరోపణలు ఉండటంతో బ్యాంకింగ్ షేర్లు డీలాపడటం సూచీల నష్టాలకు ఆజ్యం పోసిందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు అదానీ గ్రూపుపై హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై సెబీ, ఆర్బీఐలు దర్యాప్తు చేసి వాస్తవాలను బయటపెట్టాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ డిమాండు చేస్తున్నారు.
100 బి.డాలర్ల దిగువకు గౌతమ్ సంపద
గౌతమ్ అదానీ సంపద ఈ ఏడాది ప్రారంభం నుంచి తగ్గుతూ వస్తోంది. హిండెన్బర్గ్ నివేదిక అనంతరం ఈ పరిస్థితి మరింత తీవ్రమయ్యింది. హిండెన్బర్గ్ నివేదిక వెల్లడైన బుధవారం నాడు షేర్ల పతనంతో బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ సూచీలో గౌతమ్ అదానీ సంపద విలువ దాదాపు 6 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.48,600 కోట్లు) తగ్గి 113 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. శుక్రవారమూ షేర్లకు భారీ నష్టాలు కొనసాగడంతో ఆయన సంపద 100 బి.డాలర్ల దిగువకూ వచ్చింది. బుధవారం నాటితో పోలిస్తే 15% పతనమైంది. దీంతో ఫోర్బ్స్ రియల్టైం ప్రపంచవ్యాప్త శ్రీమంతుల జాబితాలో ఏడో స్థానానికి ఆయన దిగివచ్చినట్లు తెలుస్తోంది.
ఆరోపణలపై స్పందన సంతృప్తినివ్వలేదా!
హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై అదానీ గ్రూపు ఇచ్చిన వివరణ మదుపర్లకు సంతృప్తినివ్వలేదనే విషయం.. శుక్రవారం నాటి షేర్ల పతనంతో అర్థం చేసుకోవచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే గతంలోనూ అదానీ గ్రూపు భారీ రుణ భారంపై ఫిచ్ గ్రూప్నకు చెందిన క్రెడిట్సైట్స్ లాంటి సంస్థలు కూడా ఆందోళనలు వెలిబుచ్చాయి. అటు అదానీ గ్రూపు కూడా వాటిని ఖండించుకుంటూనే వస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా హిండెన్బర్గ్ కూడా అదే తరహా ఆరోపణలు చేయడంతో.. మదుపర్లు ఈ వ్యవహారంపై అదానీ గ్రూపు నుంచి పూర్తి స్పష్టతను కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. అదే రెండో రోజూ షేర్ల పతనానికి దారి తీసిందని విశ్లేషిస్తున్నారు. దీనిపై సెబీ ఎలా స్పందిస్తుందోనని కూడా మదుపర్లు గమనిస్తున్నారు. ఒకవేళ అదానీ గ్రూపు షేర్ల పతనం మున్ముందూ కొనసాగితే.. ఆ ప్రభావం మార్కెట్పై ఉండకపోవచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సూచీల్లో పటిష్ఠమైన మూలాలున్న కంపెనీలు ఉండటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. అయితే రుణాలపై ఆందోళనలకు కంపెనీ నుంచి సరైన సమాధానం రాకుంటే.. బ్యాంకింగ్ షేర్లకు ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు అమ్మకాల ఒత్తిడి కొనసాగొచ్చని, ఆ ప్రభావం మార్కెట్పైనా ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
గతంలోనూ ఇదే తరహా నివేదికలు
ప్రపంచవ్యాప్తంగా కంపెనీల్లో జరిగే అవకతవకలను, మోసాలను గుర్తించేందుకు ఒక ‘ఫోరెన్సిక్ ఫైనాన్షియల్ పరిశోధన’ కంపెనీని 2017లో నాథన్ అండర్సన్ ఏర్పాటు చేసి.. దానికి హిండెన్బర్గ్ రీసెర్చ్గా నామకరణం చేశారు. ఈ సంస్థ తన పరిశోధనల ఆధారంగా షార్ట్ సెల్లింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తుంటుంది. అంతకుముందు లార్డ్స్టోన్ మోటార్స్ కార్ప్ (యూఎస్), కండి (చైనా), నికోలా మోటార్ కంపెనీ (యూఎస్), క్లోవర్ హెల్త్ (యూఎస్), టెక్నోగ్లాస్ (కొలంబియా)లపైనా ఇదే తరహా అవకతవకలను గుర్తించి షార్ట్ సెల్లింగ్ చేసింది. ఇప్పుడు తాజాగా అదానీ గ్రూపుపై అవకతవకలు ఆరోపణలు చేసి భారత స్టాక్ మార్కెట్లో కలకలం సృష్టిస్తోంది.
టీ+1 సెటిల్మెంట్ విధానం అమల్లోకి
భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం నుంచి పూర్తిగా టీ+1 సెటిల్మెంట్ విధానంలోకి మారాయి. టీ+1 సెటిల్మెంట్ వ్యవస్థ వల్ల మదుపర్లు షేర్ల కొనుగోళ్లు, అమ్మకాలు జరిపిన తర్వాత ఖాతాలోకి షేర్లు/నిధులు వేగంగా జమవుతాయి. మదుపర్లు ఎక్కువ లావాదేవీలు నిర్వహించుకునే సౌలభ్యం కలుగుతుంది. టీ+1 సెటిల్మెంట్తో లావాదేవీ జరిగిన ఒకరోజులోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఇప్పటివరకు టీ+2 సెటిల్మెంట్ పద్ధతి అమలవుతోంది. జనవరి 27 నుంచి అన్ని లావాదేవీల సెటిల్మెంట్ టీ+1 పద్ధతిలో పూర్తిచేయనున్నట్లు ఎన్ఎస్ఈ వెల్లడించింది.
* ఫిబ్రవరి 1 నుంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు టీ+2 సెటిల్మెంట్ వ్యవస్థకు మారనున్నాయి. ప్రస్తుతం రెడెమ్షన్ ప్రక్రియ పూర్తయిన 3 రోజుల్లోగా మదుపర్ల బ్యాంక్ ఖాతాల్లోకి నిధులు బదిలీ అవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
Dmart Q4 results: దేశవ్యాప్తంగా డీమార్ట్ పేరిట సూపర్ మార్కెట్లు నిర్వహించే అతిపెద్ద రిటైల్ చైన్ అవెన్యూ సూపర్మార్ట్స్ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. -
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
layoffs: ప్రపంచవ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్ నెలలోనే 20 వేల మందిని సాగనంపాయి. -
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్పై జిరోదా సీఈవో పోస్ట్
Nithin Kamath: కర్మ ఫలితం అనుభవిస్తున్నానని అంటున్నారు జిరోదా సీఈవో నితిన్ కామత్. స్పామ్ కాల్స్పై ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. -
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా తన బ్యాగేజీ పాలసీని మార్చింది. కొత్త రూల్స్ మే 2 నుంచి అమల్లోకి వచ్చాయి. -
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!
ఉద్యోగం కోసం అభ్యర్థులు భిన్న మార్గాలను ఎంచుకుంటుంటారు. రిక్రూటర్ మెప్పు పొందేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తుంటారు. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
ఉల్లి ఎగుమతులపై కేంద్రం ఎత్తివేసింది. మహారాష్ట్రలో ఎన్నికల వేళ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
రూ.25,000 కోట్ల పెట్టుబడులకు అవకాశం
ద్విచక్ర వాహనాలు, బస్సులు మనదేశంలో ఈవీ (విద్యుత్తు వాహన) పరిశ్రమకు చోదక శక్తిగా మారుతున్నాయి. -
టెస్లా పవర్పై టెస్లా దావా
భారత్కు చెందిన ఒక కంపెనీ తమ పేరును వినియోగిస్తూ, వినియోగదారుల్లో గందరగోళ సృష్టిస్తోందని ఆరోపిస్తూ, దిల్లీ హైకోర్టులో అమెరికా విద్యుత్ వాహన (ఈవీ) దిగ్గజం టెస్లా దావా వేసింది. -
కొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్
యువతను ఆకట్టుకునే లక్ష్యంతో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో సరికొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్ ను విపణిలోకి శుక్రవారం విడుదల చేసింది. -
క్యాపిటా ల్యాండ్కు హైదరాబాద్లో 25 లక్షల చ.అ. కార్యాలయ స్థలం
స్థిరాస్తి సేవల సంస్థ ఫినిక్స్ గ్రూపు, హైదరాబాద్లోని హైటెక్ సిటీ సమీపంలో నిర్మిస్తున్న 25 లక్షల చదరపు అడుగుల వాణిజ్య భవనాన్ని కేపిటా ల్యాండ్ ఇండియా ట్రస్ట్ అనే సంస్థ కొనుగోలు చేయనుంది. -
ఎంఆర్ఎఫ్ తుది డివిడెండ్ రూ.194
టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్, మార్చి త్రైమాసికంలో రూ.396 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. -
39% తగ్గిన అదానీ గ్రీన్ ఎనర్జీ లాభం
అదానీ గ్రూప్నకు చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్), మార్చి త్రైమాసికంలో రూ.310 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. -
గోద్రేజ్ ప్రాపర్టీస్ రికార్డు అమ్మకాలు
గోద్రేజ్ గ్రూప్నకు చెందిన స్థిరాస్తి సంస్థ గోద్రేజ్ ప్రాపర్టీస్, మార్చి త్రైమాసికంలో గతంలో ఎన్నడూ లేనంతగా రూ.471.26 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
గరిష్ఠాల నుంచి వెనక్కి
సూచీల గరిష్ఠ స్థాయుల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ముగిశాయి. టెలికాం, యంత్ర పరికరాలు, టెక్ షేర్లు డీలాపడటంతో సెన్సెక్స్ 74,000 పాయింట్ల దిగువకు చేరింది. -
నరేశ్ గోయల్కు బెయిల్ ఇవ్వొద్దు.. ఈడీ
మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్, వైద్య ప్రాతిపదికన మధ్యంతర బెయిల్ కోరడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం వ్యతిరేకించింది. -
అంతరిక్ష కార్యకలాపాలకు నిధులు
మనదేశంలో అంతరిక్ష రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలకు నిధులు సమకూర్చడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏబీబీ) సుముఖంగా ఉంది. -
యాపిల్ ఆదాయాల్లో రెండంకెల వృద్ధి
భారతదేశంలో మార్చి త్రైమాసికంలో రికార్డు ఆదాయాన్ని నమోదుచేసినట్లు అమెరికా దిగ్గజ సంస్థ యాపిల్ ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు( 8)
సిగ్నిటీ టెక్నాలజీస్లో 54% వాటా కొంటున్న కోఫోర్జ్ లిమిటెడ్, ఇప్పుడు ఆ సంస్థ వాటాదార్లకు ‘ఓపెన్ ఆఫర్’ జారీ చేసింది. -
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ భారత్లో పెద్దఎత్తున ఖాతాలపై చర్యలు చేపట్టింది. ఒక్క 2024 తొలి త్రైమాసికంలోనే ఏకంగా 2.23 కోట్ల ఖాతాలపై నిషేధం విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?