ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో ఐడీఎఫ్సీ విలీనం!
పూర్తిగా షేర్ల లావాదేవీ ద్వారా ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్లో, మాతృసంస్థ ఐడీఎఫ్సీ ని విలీనం చేసే ప్రతిపాదనకు సోమవారం ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ బోర్డు డైరెక్టర్లు ఆమోదముద్ర వేశారు.
ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తయ్యే అవకాశం
ప్రతీ 100 ఐడీఎఫ్సీ షేర్లకు 155 ఫస్ట్ షేర్లు
ముంబయి: పూర్తిగా షేర్ల లావాదేవీ ద్వారా ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్లో, మాతృసంస్థ ఐడీఎఫ్సీ ని విలీనం చేసే ప్రతిపాదనకు సోమవారం ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ బోర్డు డైరెక్టర్లు ఆమోదముద్ర వేశారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో దాని మాతృసంస్థ హెచ్డీఎఫ్సీ విలీనం అయిన కొద్ది రోజులకే అదే తరహాలో ఇది చోటు చేసుకోనుంది. విలీన సంస్థ విలువను బ్యాంకు చెప్పలేదు. అయితే సోమవారం బీఎస్ఈలో ఇరు కంపెనీల షేర్ల ముగింపు ధరలను బట్టి సంయుక్త సంస్థ విలువ రూ.71,767 కోట్లుగా ఉండొచ్చని అంచనా. ఐడీఎఫ్సీతో పాటు ఐడీఎఫ్సీ ఫైనాన్షియల్ హోల్డింగ్ కూడా బ్యాంకులో విలీనం అవుతుంది.
20 శాతం ప్రీమియంతో..
విలీన నిష్పత్తిని 155:100గా నిర్ణయించారు. అంటే ప్రతి 100 ఐడీఎఫ్సీ షేర్లకు 155 ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు లభిస్తాయి. 2023 జూన్ 30 నాటి ఇరు సంస్థల షేర్ల ముగింపు ధరతో పోలిస్తే 20 శాతం ప్రీమియంకు షేర్ల మార్పిడి నిష్పత్తి ఉన్నట్లు తెలుస్తోంది.
మార్కెట్ విలువ ఎంతంటే..
ఈ విలీనం అనంతరం ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ స్టాండలోన్ బుక్ విలువ ఒక్కో షేరుకు 4.9% పెరుగుతుంది. 2023 జూన్ 30 నాటికి ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో ఐడీఎఫ్సీకి 39.93% వాటా ఉంది. సోమవారం బీఎస్ఈలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ స్క్రిప్ 3% పెరిగి రూ.81.7 వద్ద ముగిసింది. దీంతో మార్కెట్ విలువ రూ.54,311.48 కోట్లుగా నమోదైంది. ఐడీఎఫ్సీ షేరు 7% లాభంతో రూ.110 వద్ద స్థిరపడడంతో.. మార్కెట్ విలువ రూ.17,456 కోట్లకు చేరింది. మొత్తం మీద ఇరు కంపెనీల సంయుక్త మార్కెట్ విలువ రూ.71,767 కోట్లకు చేరినట్లయింది.
ప్రమోటర్ల వాటా లేని సంస్థగా..
‘ఈ విలీనం వల్ల ఐడీఎఫ్సీ ఎఫ్హెచ్సీఎల్, ఐడీఎఫ్సీ లిమిటెడ్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ల కార్పొరేట్ నిర్మాణం సరళీకృతమవుతుంది. ఇవన్నీ ఒకే సంస్థగా మారడం వల్ల నియంత్రణపరమైన నిబంధనలను పాటించడం సులువవుతుంది. ఈ విలీనం వల్ల ఇతర భారీ స్థాయి ప్రైవేటు రంగ బ్యాంకుల్లాగే.. ప్రజలు, సంస్థలు వాటాదార్లుగా ఉన్న సంస్థగా, ప్రమోటర్ల వాటా లేని సంస్థగా ఎదగడానికి వీలవుతుంద’ని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో పేర్కొంది. ‘అనుకోని పరిస్థితులు ఎదురైతే మినహా.. ఈ ఆర్థిక సంవత్సరంలోనే విలీనాన్ని పూర్తి చేయనున్న’ట్లు తెలిపింది. ఇక దీర్ఘకాల దృక్పథంతో తదుపరి దశ వృద్ధి దిశగా అడుగులు పడతాయని బ్యాంక్ ఛైర్పర్సన్ సంజీబ్ ఛౌధురి పేర్కొన్నారు.
ఇలా ఏర్పడ్డాయ్..
1997లో ఒక మౌలిక రుణదాతగా ఐడీఎఫ్సీ ఏర్పాటైంది. 2014 ఏప్రిల్లో ఆర్బీఐ ఇచ్చిన అనుమతులతో ఐడీఎఫ్సీ బ్యాంక్ కార్యకలాపాలను 2015 అక్టోబరులో ఐడీఎఫ్సీ ప్రారంభించారు. ఆ సమయంలో ఐడీఎఫ్సీకి చెందిన రుణ ఆస్తులు బ్యాంకుకు తరలించారు. 2018 డిసెంబరు 18న క్యాపిటల్ ఫస్ట్ను ఐడీఎఫ్సీ బ్యాంక్లో విలీనం చేసి, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్గా నామకరణం చేశారు. అప్పటి నుంచి బ్యాంకు తన డిపాజిట్ ఫ్రాంఛైజీని ఏటా 36% వృద్ధితో రూ.1,36,812 కోట్లకు చేర్చింది. ప్రస్తుతం 809 శాఖలు, 925 ఏటీఎంలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జయహో.. జీడీపీ
దేశ ఆర్థిక వ్యవస్థ, గత ఆర్థిక సంవత్సరంలో అంచనాలను మించి రాణించింది. నాలుగో త్రైమాసికంలో వృద్ధిరేటు 7.8 శాతంగా నమోదైంది. -
పదేళ్లలో పెట్టుబడులు రూ.7.50 లక్షల కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో అదానీ గ్రూప్ కంపెకనీల లాభం 2022-23తో పోలిస్తే 55 శాతం పెరిగింది. గ్రూప్ నమోదిత కంపెనీల నికర లాభం 2023-24లో రూ.30,767 కోట్లకు చేరింది. -
బ్రిటన్ నుంచి భారత్కు 100 టన్నుల బంగారం
బ్రిటన్లో ఉంచిన తన పసిడి నిల్వల నుంచి 100 మెట్రిక్ టన్నుల (లక్ష కిలోల) పసిడిని దేశీయ ఖజానాకు భారత్ చేర్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. -
క్విక్ కామర్స్లోకి జియోమార్ట్!
రిలయన్స్ రిటైల్కు చెందిన జియోమార్ట్, ఆన్లైన్లో ఆర్డరు తీసుకున్న నిత్యావసరాలను సాధ్యమైనంత వేగంగా అందించే (క్విక్ కామర్స్) సేవల్లోకి అడుగుపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
5 రోజుల నష్టాలకు అడ్డుకట్ట
సూచీల అయిదు రోజుల వరుస నష్టాలకు అడ్డుకట్ట పడింది. దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడం ఇందుకు కలిసొచ్చింది. -
రూ.10 లక్షల కోట్ల మొండి బాకీలు వసూలయ్యాయ్
సంస్కరణలు, మెరుగైన పాలన ద్వారా మోదీ ప్రభుత్వం బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేసిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. -
ఏడాదికి 50 లక్షల కార్ల విక్రయాలు!
దేశీయంగా ప్రయాణికుల వాహనాల (పీవీ-కార్లు, ఎస్యూవీలు, వ్యాన్ల) అమ్మకాలు ఏడాదికి 50 లక్షలకు మించడం కొన్నేళ్లలో సాధ్యపడుతుందని టాటా మోటార్స్ అంచనా వేస్తోంది. -
బీమా కంపెనీలో 14.50% వాటా విక్రయించనున్న కెనరా బ్యాంకు
కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 14.50% వాటా విక్రయించడానికి కెనరా బ్యాంకు సిద్ధపడుతోంది. కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ త్వరలో పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) కు వెళ్లనుంది. -
సంక్షిప్త వార్తలు(5)
తయారీ రంగ అంకుర సంస్థల కోసం ఇంక్యుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిందిగా 100కు పైగా కార్పొరేట్లు, యూనికార్న్ (100 కోట్ల డాలర్ల విలువైన సంస్థ)లను ప్రభుత్వం కోరిందని అధికార వర్గాలు తెలిపాయి. -
ఆ విషయాలు నా పిల్లల నుంచే నేర్చుకున్నా.. మామా ఎర్త్ సీఈఓ
Ghazal Alagh: పిల్లల నుంచి తాను నేర్చుకున్న పాఠాలను ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు మామాఎర్త్ సీఈఓ గజల్ అలఘ్. -
లక్షకు పైగా టెస్లా కార్ల రీకాల్.. కారణం ఇదే..
Tesla: కార్ల తయారీ సంస్థ టెస్లా లక్షకు పైగా కార్లను రీకాల్ చేపట్టింది. సీట్ బెల్ట్ వార్నింగ్ సిస్టమ్ పనితీరులో తలెత్తిన లోపం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
నాగ్పుర్లో 56 డిగ్రీలు నిజం కాదు.. వాతావరణ శాఖ స్పష్టత
-
పవన్కల్యాణ్ విజయం కోరుతూ.. మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన యువతి
-
రివ్యూ: కీచురాళ్ళు.. మలయాళ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా?
-
కాకరేపుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
-
ప్రియుడిని బంధించి ప్రియురాలిపై హోంగార్డు అత్యాచారం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM