సినిమా సూపర్హిట్.. టీవీ అంతంతే
మీడియా, వినోద పరిశ్రమకు 2023 సంవత్సరం మిశ్రమ ఫలితాలను అందించింది. ప్రకటనల పరంగా టీవీ విభాగం ఇంకా పూర్తిగా కోలుకోకపోగా.. సినిమా వసూళ్లు మాత్రం కొత్త గరిష్ఠాలను నమోదుచేశాయి.
2023 ఆదాయంపై అంచనా
టీవీ ప్రకటనల్లో రికవరీ కొంతే
అదరగొట్టిన సినిమా వసూళ్లు
దిల్లీ: మీడియా, వినోద పరిశ్రమకు 2023 సంవత్సరం మిశ్రమ ఫలితాలను అందించింది. ప్రకటనల పరంగా టీవీ విభాగం ఇంకా పూర్తిగా కోలుకోకపోగా.. సినిమా వసూళ్లు మాత్రం కొత్త గరిష్ఠాలను నమోదుచేశాయి. ఈ ఏడాది ప్రకటనల వ్యయాల వృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. ఇ-కామర్స్, గేమింగ్ కంపెనీలు వ్యయాలు తగ్గించుకోవడం ఇందుకు కారణం. దీంతోపాటు 2023 క్రికెట్ ప్రపంచకప్ కోసం, పండగ వ్యయాలను కూడా కంపెనీలు బదిలీ చేయడం వల్లా ఇతర విభాగాల వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడిందని విశ్లేషకులు చెబుతున్నారు. క్రీడా ప్రకటనల వ్యయాలను మినహాయిస్తే.. టీవీ ప్రకటనల ఆదాయం ఏడాది క్రితంతో పోలిస్తే, 1-2 శాతం తగ్గిందని అంచనా. క్రికెట్ ప్రపంచకప్ ప్రకటనల ఆదాయం అంచనాలను మించి, 25 శాతం వృద్ధితో దాదాపు రూ.3,000 కోట్లకు చేరింది. అయితే ప్రపంచకప్ కారణంగా జీ ఎంటర్టైన్మెంట్, సన్టీవీ వంటి సంస్థలు ప్రకటనల ఆదాయ పరంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాయని చెబుతున్నారు.
సెప్టెంబరు త్రైమాసికంలో జీ ప్రకటనల ఆదాయం 3.3 శాతం తగ్గి రూ.980 కోట్లకు పరిమితమైంది. సన్టీవీ ఆదాయం స్తబ్దుగా ఉంది. పండగల సీజన్ వల్ల డిసెంబరు త్రైమాసికంలో ఆదాయం పెరగొచ్చని జీ యాజమాన్యం భావిస్తోంది.
టీవీ ప్రకటనల ఆదాయం
2023లో టీవీ ప్రకటనల ఆదాయాలు 8.9 శాతం వృద్ధి చెంది రూ.36,500 కోట్లకు చేరొచ్చని అంతర్జాతీయ మీడియా పెట్టుబడుల సంస్థ మాగ్నా అభిప్రాయపడింది. 2024లో ఈ ఆదాయం 9.9% వృద్ధితో రూ.40,100 కోట్లకు పెరగొచ్చని భావిస్తున్నారు.
దేశంలో మొత్తం ప్రకటనల ఆదాయం
2022లో దేశీయ మొత్తం ప్రకటనల మార్కెట్ 17.4% వృద్ధి చెందగా.. ఈ ఏడాది 11.8 శాతానికి నెమ్మదించింది. 2024లో ప్రకటనల వృద్ధి 11.4% తగ్గే అవకాశం ఉంది. 2023లో రూ.లక్ష కోట్లకు చేరిన భారత ప్రకటనల మార్కెట్.. వచ్చే ఏడాది రూ.1.2 లక్షల కోట్లకు చేరొచ్చు.
సినిమా వసూళ్ల జోరు
దేశంలో సినిమా బాక్సాఫీస్ మాత్రం రికార్డులు బద్దలు కొట్టింది. 2023 జనవరి నుంచి నవంబరు మధ్య బాక్సాఫీస్ వ్యాపారం రూ.10,252 కోట్లుగా నమోదైంది. డిసెంబరులో వచ్చిన యానిమల్ సినిమాతో ఈ వసూళ్లు రూ.11,000 కోట్ల మార్కును దాటాయి. దీంతో అత్యధిక సినిమా వసూళ్లు సాధించిన ఏడాదిగా 2023 నిలిచింది. సలార్, డంకీ సినిమా వసూళ్లతో కలిపి ఇవి రూ.12,000 కోట్లను అధిగమించే అవకాశం ఉంది. కరోనాతో కుదేలైన బాలీవుడ్ పరిశ్రమ ఈ ఏడాది 20% వృద్ధితో రూ.4,700 కోట్ల వసూళ్లు నమోదుచేసింది. 2024లో భారీ బడ్జెట్ సినిమాలు తక్కువగా ఉండటంతో ఈ స్థాయి వసూళ్లు ఉండకపోవచ్చని అంటున్నారు. ఈ ఏడాది మే నుంచి నవంబరు మధ్య జరిగిన రచయిత సంఘం సమ్మె వల్ల, వచ్చే ఏడాది విడుదలయ్యే హాలీవుడ్ చిత్రాల సంఖ్య తగ్గనుంది.
విలీనాలే కీలకం: జీ- సోనీ విలీనానికి అదనంగా నెల రోజుల గడువు లభించింది. ఈ విలీన సంస్థకు చెందిన టీవీ, ఓటీటీ విభాగాలపై అందరూ దృష్టి పెట్టారు. టీవీ, ఓటీటీ ప్రకటనల విభాగంలో దేశీయంగా ఈ సంస్థకు 65% మార్కెట్ వాటా లభించనుంది. ఓటీటీ విభాగంలో మరిన్ని విలీనాలు జరగొచ్చని అంటున్నారు. ఇప్పటికే భారత మీడియా కార్యకలాపాల విలీనానికి రిలయన్స్ ఇండస్ట్రీస్తో డిస్నీ సంస్థకు ఒప్పందం కుదిరినట్లు వార్తలు వచ్చాయి. మీడియా, వినోద రంగంలో ఇది అతిపెద్ద విలీనం కానుంది. 100కు పైగా ఛానెళ్లు, రెండు ఓటీటీ ప్లాట్ఫామ్లతో ఇది అతిపెద్ద సంస్థగా అవతరించనుంది. ఓర్మాక్స్ గణాంకాల ప్రకారం.. భారత ఓటీటీ వీక్షకుల సంఖ్య 13.5% పెరిగి 48.11 కోట్లకు చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విదేశీ ఖనిజాలపై కోల్ ఇండియా, ఎన్ఎమ్డీసీ దృష్టి
ప్రభుత్వ రంగ కంపెనీ (పీఎస్యూ)లైన కోల్ ఇండియా, ఎన్ఎమ్డీసీ, ఓఎన్జీసీ విదేశ్ (ఓవీఎల్).. విదేశాల్లో కీలక ఖనిజ ఆస్తుల కొనుగోలు విషయంలో చురుగ్గా ముందుకు వెళుతున్నాయని కేంద్రం బుధవారం పేర్కొంది. -
టెక్ ఉద్యోగాల్లో మహిళల వాటా తక్కువే
దేశంలోని టెక్ ఉద్యోగాల్లో లింగ అసమానత కనిపిస్తోందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) బోర్డు డైరెక్టర్, ముకేశ్ అంబానీ కుమార్తె ఈశా అంబానీ బుధవారం వెల్లడించారు. -
ఒడుదొడుకుల్లో స్వల్ప నష్టాలు
రోజంతా ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, రిలయన్స్ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. -
కేవైసీ ధ్రువీకరణ మరింత సులభం
కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీ (కేఆర్ఏ)ల ద్వారా కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకో) వివరాల ధ్రువీకరణ ప్రక్రియను సులభతరం చేయాలని సెబీ నిర్ణయం తీసుకుంది. -
4 నెలల గరిష్ఠానికి వాణిజ్య లోటు
మనదేశం నుంచి వస్తు ఎగుమతులు ఈ ఏడాది ఏప్రిల్లో 34.99 బిలియన్ డాలర్లు (సుమారు రూ.2.90 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. -
ఎల్ఐసీకి మరో మూడేళ్ల సమయం
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో ప్రజల కనీస వాటా 10 శాతానికి చేరేందుకు మరో మూడేళ్ల గడువు లభించింది. 2022 మే 17న ఎల్ఐసీ స్టాక్ మార్కెట్లో నమోదయ్యింది. -
సోరియాసిస్ వ్యాధికి ఔషధం
జర్మనీకి చెందిన బోహ్రింగర్ ఇంగెల్హీమ్ అనే ఔషధ సంస్థ మనదేశంలో సొరియాసిస్ (జనరలైజ్డ్ పస్టులర్ సోరియాసిస్-జీపీపీ) అనే వ్యాధి చికిత్సలో వినియోగించే స్పెవిగో (స్పెసోలిమాబ్) ఇంజెక్షన్ను అందుబాటులోకి తీసుకురానుంది. -
ఫోన్ ఛార్జీలు పెంచాల్సిందే
ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో టెలికాం ఛార్జీలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయని భారతీ ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విత్తల్ పేర్కొన్నారు. -
డిపాజిట్ రేట్లు పెంచిన ఎస్బీఐ
ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. -
సంక్షిప్త వార్తలు
గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో బెర్జర్ పెయింట్స్ రూ.222.62 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/05/24)
-
సముద్రం ముప్పు.. థాయ్లాండ్ రాజధానిని తరలించాల్సిందేనా..?
-
అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు.. ఎందుకో తెలుసా?
-
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
-
‘గర్జనకు సిద్ధం’.. బైడెన్ సవాలును స్వీకరించిన ట్రంప్!
-
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కే స్పందనిదే