సీబీడీటీ ఛైర్మన్‌గా నితిన్‌ గుప్తా

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) కొత్త ఛైర్మన్‌గా నితిన్‌ గుప్తాను ప్రభుత్వం నియమించింది. సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. గుప్తా 1986 బ్యాచ్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కేడర్‌కు చెందిన ఐఆర్‌ఎస్‌ అధికారి. ప్రస్తుతం సీబీడీటీ బోర్డులో (దర్యాప్తు) సభ్యుడిగా

Published : 28 Jun 2022 03:04 IST

దిల్లీ: కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) కొత్త ఛైర్మన్‌గా నితిన్‌ గుప్తాను ప్రభుత్వం నియమించింది. సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. గుప్తా 1986 బ్యాచ్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కేడర్‌కు చెందిన ఐఆర్‌ఎస్‌ అధికారి. ప్రస్తుతం సీబీడీటీ బోర్డులో (దర్యాప్తు) సభ్యుడిగా ఉన్నారు. 2023 సెప్టెంబరులో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. 1986 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి, బోర్డులో సభ్యురాలిగా ఉన్న సంగీతా సింగ్‌ ప్రస్తుతం సీబీడీటీ ఛైర్మన్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జేబీ మహాపాత్ర ఏప్రిల్‌ 30న పదవీ విరమణ చేయడంతో ఆమె ఈ బాధ్యతలు చేపట్టారు. సీబీడీటీకి ఛైర్మన్‌, ప్రత్యేక కార్యదర్శి హోదాతో ఆరుగురు సభ్యులు ఉంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు