
ITR: ఈ 10 సందర్భాల్లో ఐటీఆర్ సమర్పించాల్సిందే.. మరి మీరు ఈ కేటగిరీలో ఉన్నారా?
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా ఆదాయం పన్ను మినహాయింపు పరిమితి దాటినప్పుడు లేదా మన ఆదాయంలో మూలం వద్దే పన్ను కోత ఉంటేనే ఐటీ రిటర్నులు దాఖలు చేయాలని (ITR Filing) భావిస్తుంటారు. కానీ, అది నిజం కాదు. ఆదాయ పన్ను చట్టం (IT Act)లోని సెక్షన్ 139 ఏయే సందర్భాల్లో ఐటీఆర్ (ITR) దాఖలు చేయాలో స్పష్టంగా చెబుతోంది. ఈ నిబంధనల్లో ఇటీవల కేంద్రం కొన్ని మార్పులు కూడా చేసింది. మరి రిటర్నులు సమర్పించాల్సిన 10 సందర్భాలేంటో చూద్దాం..
☞ సాధారణ పన్ను మినహాయింపు పరిమితి దాటితే..
- వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలు దాటిన సాధారణ పౌరులు
- 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్ల ఆదాయం రూ.3 లక్షలు
- 80 ఏళ్లు దాటిన వారి ఆదాయం రూ.5 లక్షలు దాటితే.. కచ్చితంగా ఐటీఆర్ దాఖలు చేయాలి.
అయితే, ఆదాయాన్ని లెక్కించేటప్పుడు సెక్షన్ 80సీ (Section 80C) వంటి మినహాయింపులను పరిగణనలోకి తీసుకునే వెసులుబాటు ఉందని గమనించాలి.
☞ భారత్కు వెలుపల ఆస్తులు ఉంటే..
- ఇతర దేశాల్లో ఎలాంటి ఆస్తులు ఉన్నా ఐటీఆర్ (ITR) తప్పనిసరిగా దాఖలు చేయాలి. ఏదైనా విదేశీ కంపెనీలో భాగస్వాములైనా.. లేదా దాంట్లో సైనింగ్ అథారిటీ ఉన్నా రిటర్నులు దాఖలు చేయాల్సిందే. లేదా ఏదైనా ఆస్తుల నుంచి ఆదాయం పొందుతున్నా రిటర్నులు సమర్పించాల్సి ఉంటుంది.
☞ ఒకటి లేదా ఎక్కువ బ్యాంకుల్లోని కరెంటు ఖాతాల్లో ఒక ఏడాదిలో రూ.కోటికి మించి నగదు డిపాజిట్ చేస్తే రిటర్నులు దాఖలు చేయాలి. అయితే, పోస్టాఫీసులోని కరెంటు ఖాతాలో చేసే డిపాజిట్ను మాత్రం సెక్షన్ 139లో ప్రత్యేకంగా పేర్కొనలేదు.
☞ క్రితం సంవత్సరంలో ఎవరైనా విదేశీయానం కోసం రూ.2 లక్షలు వెచ్చిస్తే వారు రిటర్నులు దాఖలు చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. అయితే, ఎవరు ప్రయాణిస్తున్నారన్న దానితో సంబంధం లేకుండా విదేశీయ ప్రయాణాల పేరిట ఖర్చు చేస్తే రిటర్నులు ఫైల్ చేయాల్సిందే.
☞ కిందటేడాదిలో కరెంటు బిల్లు రూ.1లక్ష దాటితే వారు రిటర్నులు దాఖలు చేయాల్సిందే.
☞ వ్యాపారంలో మొత్తం విక్రయాలు, టర్నోవర్ రూ.60 లక్షలు దాటితే ఐటీ రిటర్నులు సమర్పించాలి.
☞ ఏదైనా వృత్తి లేదా పని ద్వారా రూ.10 లక్షలకు మించిన ఆదాయం ఆర్జిస్తే ఐటీఆర్ దాఖలు చేయాలి.
☞ మూలం వద్ద పన్ను కోత (TDS), మూలం వద్ద పన్ను వసూలు (TCS) కలిపి మొత్తం ఒక ఏడాదిలో రూ.25,000 దాటితే కచ్చితంగా రిటర్నులు సమర్పించాలని ఐటీ నిబంధనలు తెలియజేస్తున్నాయి.
☞ సీనియర్ సిటిజన్ల (60 ఏళ్లు పైబడినవారు) టీడీఎస్, టీసీఎస్ల మొత్తం రూ.50,000 దాటితేనే ఐటీఆర్ దాఖలు చేయాలి.
☞ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సేవింగ్స్ ఖాతాల్లో చేసే డిపాజిట్ మొత్తం ఏడాదిలో రూ.50 లక్షలు దాటితే కచ్చితంగా రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Actress Meena: మీనా భర్త మృతి.. పావురాల వ్యర్థాలే కారణమా..?
-
Business News
Car Loan: ఈఎంఐ భారం కావొద్దంటే కారు లోన్కు ఏ వడ్డీరేటు బెటర్?
-
Sports News
IND vs IRE : అందుకే ఆఖరి ఓవర్ను ఉమ్రాన్కు ఇచ్చా : హార్దిక్ పాండ్య
-
Politics News
Telangana News: హైదరాబాద్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా హోర్డింగ్లు, ఫ్లెక్సీలు
-
Politics News
Maharashtra: ‘మహా’ సంక్షోభం.. ఠాక్రే సర్కారుకు రేపే బలపరీక్ష
-
India News
India Corona: లక్షకు చేరువగా క్రియాశీల కేసులు..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Actress Meena: ఊపిరితిత్తుల సమస్యతో నటి మీనా భర్త మృతి
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
- Udaipur Murder: భగ్గుమన్న ఉదయ్పుర్
- IND vs IRE : గెలిచారు.. అతి కష్టంగా
- Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
- AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావు మరోసారి సస్పెన్షన్
- ఒత్తిళ్లకు లొంగలేదని బదిలీ బహుమానం!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29-06-22)
- ‘Disease X’: డిసీజ్ ఎక్స్.. ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు..?
- DilRaju: తండ్రైన దిల్రాజు.. మగబిడ్డకు జన్మనిచ్చిన తేజస్విని