Billionaires: 40% దేశ సంపద ఒకశాతం ధనవంతుల చేతుల్లో..!
దేశంలో ఉన్న ఆర్థిక అసమానతలపై ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఆక్స్ఫామ్ (Oxfam Report) ఆసక్తికర విషయాలను వెల్లడించింది. దేశంలోని 100 మంది ధనవంతుల మొత్తం సంపద రూ. 54.12 లక్షల కోట్లకు చేరుకుంది.
దావోస్: భారత్లోని మొత్తం సంపదలో 40 శాతం కేవలం ఒకశాతం ధనవంతుల దగ్గరే ఉందని ప్రముఖ నివేదిక తెలిపింది. అట్టడుగున ఉన్న సగం జనాభా వద్ద దేశ సంపదలో కేవలం 3 శాతం మాత్రమే ఉందని పేర్కొంది. ప్రముఖ హక్కుల సంస్థ ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ ‘సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్’ పేరిట భారత్లోని ఆర్థిక అసమానతలపై సోమవారం నివేదిక (Oxfam Report) విడుదల చేసింది. దావోస్లో జరుగుతున్న ‘ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum)’ వార్షిక సమావేశం సందర్భంగా ఆక్స్ఫామ్ (Oxfam Report) ఈ నివేదికను బహిర్గతం చేసింది.
నివేదికలోని కీలకాంశాలు..
- తొలి 100 మంది భారతీయ బిలియనీర్లపై 2.5 శాతం లేదా మొదటి 10 మంది బిలియనీర్లపై 5 శాతం పన్ను విధిస్తే.. బడి మానేసిన పిల్లలను తిరిగి పాఠశాలలకు తీసుకురావడానికి అవసరమైన డబ్బు మొత్తం సమకూరుతుంది.
- 2017- 2021 మధ్య పెరిగిన బిలియనీర్ గౌతమ్ అదానీ (Gautam Adani) సంపదపై ఒకసారి విధించే పన్నుతో రూ. 1.79 లక్షల కోట్ల నిధుల్ని సమీకరించవచ్చు. ఇది దేశంలో ప్రాథమిక పాఠశాలల్లో కావాల్సిన 50 లక్షల మంది ఉపాధ్యాయులకు ఏడాదిపాటు వేతనాలివ్వడానికి సరిపోతుంది.
- భారత్లోని బిలియనీర్లపై ఒకసారి రెండు శాతం పన్ను విధిస్తే రూ.40,423 కోట్ల ఆదాయం వస్తుంది. దీంతో దేశంలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలందరికీ వచ్చే మూడేళ్ల పాటు పోషకాహారం అందించవచ్చు.
- దేశంలోని 10 మంది సంపన్న బిలియనీర్లపై ఒకేసారి 5 శాతం పన్ను విధిస్తే వచ్చే రూ. 1.37 లక్షల కోట్లు.. 2022-23 సంవత్సరానికిగానూ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (రూ. 86,200 కోట్లు), ఆయుష్ మంత్రిత్వ శాఖ (రూ. 3,050 కోట్లు) అంచనా వేసిన నిధుల కంటే 1.5 రెట్లు ఎక్కువ.
- లింగ అసమానతల విషయానికి వస్తే నివేదిక ప్రకారం.. ఒక పురుష కార్మికుడు సంపాదించే ప్రతి రూపాయికి మహిళా కార్మికులు కేవలం 63 పైసలు మాత్రమే పొందుతున్నారు.
- షెడ్యూల్డ్ కులాలు, గ్రామీణ ప్రాంత కార్మికుల సంపాదనల్లో వ్యత్యాసం మరింత ఎక్కువగా ఉంది. అగ్ర సామాజిక వర్గాలు సంపాదిస్తున్న దానితో పోలిస్తే షెడ్యూల్డ్ కులాలు 55 శాతం మాత్రమే పొందుతున్నాయి. గ్రామీణ ప్రాంత కార్మికులు పట్టణాల్లో వారితో పోలిస్తే 2018- 2019 మధ్య సగం మాత్రమే సంపాదించారు.
- కరోనా సంక్షోభం ప్రారంభమైన నాటి నుంచి 2022 నవంబరు వరకు దేశంలో బిలియనీర్ల సంపద 121 శాతం పెరిగింది. రోజుకు రూ. 3,608 కోట్ల సంపద జతయ్యింది.
- 2021-22లో ‘వస్తు సేవల పన్ను(GST)’ ద్వారా వచ్చిన మొత్తం రూ.14.83 లక్షల కోట్లలో దాదాపు 64 శాతం.. సంపదలో అట్టడుగున ఉన్న 50 శాతం జనాభా నుంచి వచ్చింది. జీఎస్టీ మొత్తం ఆదాయంలో కేవలం 3 శాతం మాత్రమే తొలి పది మంది బిలియనీర్ల నుంచి వస్తోంది.
- భారతదేశంలో మొత్తం బిలియనీర్ల సంఖ్య 2020లో 102 కాగా 2022 నాటికి 166కు పెరిగింది.
- భారతదేశంలోని 100 మంది ధనవంతుల మొత్తం సంపద 660 బిలియన్ల డాలర్ల (రూ. 54.12 లక్షల కోట్లు)కు చేరుకుంది. దీనితో కేంద్ర బడ్జెట్కు 18 నెలలకు పైగా నిధులు సమకూర్చవచ్చు.
భారతదేశంలో అసమానతల ప్రభావాన్ని అంచనా వేయడానికి గుణాత్మక (qualitative), పరిమాణాత్మక (quantitative) సమాచారంతో కూడిన మిశ్రమ డేటాను వినియోగించుకున్నట్లు ఆక్స్ఫామ్ తెలిపింది. అలాగే ఫోర్బ్స్, క్రెడిట్ సూయిజ్ వంటి ఇతర మార్గాల ద్వారానూ సమాచారాన్ని సేకరించినట్లు వెల్లడించింది. ఎన్ఎస్ఎస్, కేంద్ర బడ్జెట్ పత్రాలు, పార్లమెంట్లో సభ్యుల ప్రశ్నలు.. నివేదికలో చేసిన వ్యాఖ్యలకు ఆధారమని పేర్కొంది.
రోజుకి 2.7 బి.డాలర్ల చొప్పున పెరుగుతున్న బిలియనీర్ల సంపద
ప్రపంచవ్యాప్తంగానూ ఆర్థిక అసమానతలపై ఆక్స్ఫామ్ ఆసక్తికర అంశాలను వెల్లడించింది. ప్రపంచంలోని ధనవంతుల్లో తొలి ఒక శాతం మంది గత రెండేళ్లలో సంపాదించిన సంపద.. ప్రపంచ జనాభాలోని మిగిలిన వారు ఆర్జించిన దాంతో పోలిస్తే దాదాపు రెట్టింపని నివేదిక తెలిపింది. ఓవైపు 170 కోట్ల మంది వేతనాలు ద్రవ్యోల్బణం కంటే దిగువ స్థాయిలో ఉంటే.. మరోవైపు బిలియనీర్ల సంపద రోజుకి 2.7 బిలియన్ డాలర్ల చొప్పున పెరుగుతోందని పేర్కొంది.
ప్రపంచంలోని మల్టీ-మిలియనీర్లు, బిలియనీర్లపై 5 శాతం పన్ను విధిస్తే వచ్చే 1.7 ట్రిలియన్ డాలర్లతో 200 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేయొచ్చు. 2020 తర్వాత జరిగిన 42 ట్రిలియన్ డాలర్ల సంపద సృష్టిలో 66.7 శాతం కేవలం ఒకశాతం మంది సంపన్నులే ఆర్జించారు. గత పదేళ్లలో వచ్చిన మొత్తం సంపదలో సగానికి పైగా వీరి చేతుల్లోకే వెళ్లింది.
ప్రపంచంలో ఆకలితో ఉన్న జనాభాలో దాదాపు 60 శాతం మంది మహిళలు, బాలికలే. పైగా తరచూ తక్కువ, చివరిగా తినేది కూడా వీరేనని ఆక్స్ఫామ్ నివేదిక తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అసమానతలు, పేదరికం భారీ ఎత్తున పెరిగిపోతున్నాయని ప్రపంచ బ్యాంక్ తెలిపిన విషయాన్ని ఈ సందర్భంగా నివేదిక గుర్తుచేసింది. ధనవంతులు, కార్పొరేషన్లకు దశాబ్దాలుగా ఇస్తున్న పన్ను తగ్గింపులే అసమానతలకు ఆజ్యం పోశాయని తెలిపింది. అనేక దేశాల్లోని పేద ప్రజలు బిలియనీర్ల కంటే ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నారని పేర్కొంది. ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన ఎలాన్ మస్క్ 2014- 2018 మధ్య 3 శాతం ట్యాక్స్ రేటు వద్ద పన్ను చెల్లిస్తే.. ఉగాండాలో పిండి విక్రయించే అబెర్ క్రిస్టీన్ నెలకు 80 డాలర్లు సంపాదించి 40 శాతం రేటు వద్ద పన్ను చెల్లిస్తున్నారని ఆక్స్ఫామ్ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
Dmart Q4 results: దేశవ్యాప్తంగా డీమార్ట్ పేరిట సూపర్ మార్కెట్లు నిర్వహించే అతిపెద్ద రిటైల్ చైన్ అవెన్యూ సూపర్మార్ట్స్ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. -
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
layoffs: ప్రపంచవ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్ నెలలోనే 20 వేల మందిని సాగనంపాయి. -
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్పై జిరోదా సీఈవో పోస్ట్
Nithin Kamath: కర్మ ఫలితం అనుభవిస్తున్నానని అంటున్నారు జిరోదా సీఈవో నితిన్ కామత్. స్పామ్ కాల్స్పై ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. -
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా తన బ్యాగేజీ పాలసీని మార్చింది. కొత్త రూల్స్ మే 2 నుంచి అమల్లోకి వచ్చాయి. -
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!
ఉద్యోగం కోసం అభ్యర్థులు భిన్న మార్గాలను ఎంచుకుంటుంటారు. రిక్రూటర్ మెప్పు పొందేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తుంటారు. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
ఉల్లి ఎగుమతులపై కేంద్రం ఎత్తివేసింది. మహారాష్ట్రలో ఎన్నికల వేళ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
రూ.25,000 కోట్ల పెట్టుబడులకు అవకాశం
ద్విచక్ర వాహనాలు, బస్సులు మనదేశంలో ఈవీ (విద్యుత్తు వాహన) పరిశ్రమకు చోదక శక్తిగా మారుతున్నాయి. -
టెస్లా పవర్పై టెస్లా దావా
భారత్కు చెందిన ఒక కంపెనీ తమ పేరును వినియోగిస్తూ, వినియోగదారుల్లో గందరగోళ సృష్టిస్తోందని ఆరోపిస్తూ, దిల్లీ హైకోర్టులో అమెరికా విద్యుత్ వాహన (ఈవీ) దిగ్గజం టెస్లా దావా వేసింది. -
కొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్
యువతను ఆకట్టుకునే లక్ష్యంతో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో సరికొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్ ను విపణిలోకి శుక్రవారం విడుదల చేసింది. -
క్యాపిటా ల్యాండ్కు హైదరాబాద్లో 25 లక్షల చ.అ. కార్యాలయ స్థలం
స్థిరాస్తి సేవల సంస్థ ఫినిక్స్ గ్రూపు, హైదరాబాద్లోని హైటెక్ సిటీ సమీపంలో నిర్మిస్తున్న 25 లక్షల చదరపు అడుగుల వాణిజ్య భవనాన్ని కేపిటా ల్యాండ్ ఇండియా ట్రస్ట్ అనే సంస్థ కొనుగోలు చేయనుంది. -
ఎంఆర్ఎఫ్ తుది డివిడెండ్ రూ.194
టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్, మార్చి త్రైమాసికంలో రూ.396 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. -
39% తగ్గిన అదానీ గ్రీన్ ఎనర్జీ లాభం
అదానీ గ్రూప్నకు చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్), మార్చి త్రైమాసికంలో రూ.310 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. -
గోద్రేజ్ ప్రాపర్టీస్ రికార్డు అమ్మకాలు
గోద్రేజ్ గ్రూప్నకు చెందిన స్థిరాస్తి సంస్థ గోద్రేజ్ ప్రాపర్టీస్, మార్చి త్రైమాసికంలో గతంలో ఎన్నడూ లేనంతగా రూ.471.26 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
గరిష్ఠాల నుంచి వెనక్కి
సూచీల గరిష్ఠ స్థాయుల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ముగిశాయి. టెలికాం, యంత్ర పరికరాలు, టెక్ షేర్లు డీలాపడటంతో సెన్సెక్స్ 74,000 పాయింట్ల దిగువకు చేరింది. -
నరేశ్ గోయల్కు బెయిల్ ఇవ్వొద్దు.. ఈడీ
మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్, వైద్య ప్రాతిపదికన మధ్యంతర బెయిల్ కోరడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం వ్యతిరేకించింది. -
అంతరిక్ష కార్యకలాపాలకు నిధులు
మనదేశంలో అంతరిక్ష రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలకు నిధులు సమకూర్చడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏబీబీ) సుముఖంగా ఉంది. -
యాపిల్ ఆదాయాల్లో రెండంకెల వృద్ధి
భారతదేశంలో మార్చి త్రైమాసికంలో రికార్డు ఆదాయాన్ని నమోదుచేసినట్లు అమెరికా దిగ్గజ సంస్థ యాపిల్ ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు( 8)
సిగ్నిటీ టెక్నాలజీస్లో 54% వాటా కొంటున్న కోఫోర్జ్ లిమిటెడ్, ఇప్పుడు ఆ సంస్థ వాటాదార్లకు ‘ఓపెన్ ఆఫర్’ జారీ చేసింది. -
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ భారత్లో పెద్దఎత్తున ఖాతాలపై చర్యలు చేపట్టింది. ఒక్క 2024 తొలి త్రైమాసికంలోనే ఏకంగా 2.23 కోట్ల ఖాతాలపై నిషేధం విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
రష్యా వాంటెడ్ లిస్ట్లో జెలెన్స్కీ..!
-
దంచికొట్టిన డుప్లెసిస్, కోహ్లీ.. గుజరాత్పై బెంగళూరు విజయం
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM