Interest Rates: ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్స్ vs పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్స్
పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్లు కూడా బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల మాదిరిగానే పనిచేస్తాయి
పెట్టుబడి భద్రతతో పాటు రాబడికి హామీ ఉండడంతో ఫిక్స్డ్ డిపాజిట్లకు పెట్టుబడిదారుల్లో మంచి ఆదరణ ఉంది. ప్రస్తుతం ఎస్బీఐ సహా అన్ని ప్రధాన ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఫిక్స్డ్ డిపాజిట్లను అందిస్తున్నాయి. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఇండస్ఇండ్ వంటి పలు బ్యాంకులు వివిధ కాలపరిమితుల ఎఫ్డీలపై వడ్డీ రేట్లను ఇటీవలే పెంచాయి.
అలాగే, పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్లు కూడా బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల మాదిరిగానే పనిచేస్తాయి. వీటిలో కూడా పెట్టుబడికి భద్రత ఉంటుంది. పోస్టాఫీసు అందించే వివిధ రకాల చిన్న మొత్తాల పొదుపు పథకాలలో టర్మ్ డిపాజిట్లు కూడా ఒకటి. ఇందులో వడ్డీ రేట్లను త్రైమాసిక ప్రాతిపదికన సవరిస్తారు. మూడు నెలలకోసారి వడ్డీ లెక్కిస్తారు. ఏడాదికోసారి చెల్లిస్తారు. 1,2,3,5 సంవత్సరాల కాలపరిమితితో టర్మ్ డిపాజిట్లు అందుబాటులో ఉన్నాయి. రాబడి, ఎంత కాలానికి డిపాజిట్ చేస్తున్నారనే దానిపై ఉంటుంది.
పోస్టాఫీస్ టైమ్ లేదా టర్మ్ డిపాజిట్ ప్రస్తుత త్రైమాసికానికి (జనవరి - మార్చి, 2022) వడ్డీ రేట్లు..
1 సంవత్సరం డిపాజిట్లపై - 5.50 శాతం
2 సంవత్సరాల డిపాజిట్లపై - 5.50 శాతం
3 సంవత్సరాల డిపాజిట్లపై - 5.50 శాతం
5 సంవత్సరాల డిపాజిట్లపై - 6.70 శాతం వడ్డీ లభిస్తుంది.
ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్లు..
ఎస్బీఐ 7 రోజుల నుంచి మొదలుకుని 10 సంవత్సరాల కాలవ్యవధితో ఫిక్స్డ్ డిపాజిట్లను ఆఫర్ చేస్తోంది. సాధారణ ప్రజలకు వర్తించే వడ్డీ రేట్లు కాల వ్యవధిని బట్టి 2.90 శాతం నుంచి 5.50 శాతం వరకు ఉంటాయి. సీనియర్ సిటిజన్లకు మరో 0.50 శాతం అదనపు వడ్డీ లభిస్తుంది.
ఎస్బీఐ రూ.2 కోట్లలోపు డిపాజిట్లపై సాధారణ ప్రజలకు అందిస్తున్న వడ్డీ రేట్లు ఇలా..
7 - 45 రోజులకు - 2.90 శాతం
46 - 179 రోజులకు - 3.90 శాతం
180 - 210 రోజులకు - 4.40 శాతం
211 రోజుల నుంచి ఏడాది లోపు - 4.40 శాతం
ఏడాది నుంచి రెండేళ్లలోపు - 5.10 శాతం
రెండేళ్ల నుంచి మూడేళ్లలోపు - 5.20 శాతం
మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు - 5.45 శాతం
ఐదేళ్ల నుంచి పదేళ్లలోపు - 5.50 శాతం
(ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్లపై వర్తించే ఈ వడ్డీ రేట్లు ఫిబ్రవరి 15, 2022 నుంచి అమల్లో ఉన్నాయి)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని