Stock Market: ఆరంభంలో బడ్జెట్ జోష్.. నిఫ్టీ @ 17,765
Stock Market: బడ్జెట్కి ముందు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఉత్సాహంగా కదలాడుతున్నాయి. దీనికి అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు కూడా జతయ్యాయి.
ముంబయి: మరికాసేపట్లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బడ్జెట్ (Budget 2023)ను ప్రవేశపెట్టనున్న తరుణంలో దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు కూడా మార్కెట్లకు దన్నుగా నిలుస్తున్నాయి. అయితే, బడ్జెట్ (Budget 2023)లోని కేటాయింపులు, వివిధ రంగాలకు ప్రభుత్వ ప్రాధాన్యతలు నేడు మార్కెట్ల గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 336 పాయింట్ల లాభంతో 59,886 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 102 పాయింట్లు లాభపడి 17,765 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.83 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ (Sensex)30 సూచీలో ఐటీసీ, సన్ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎంఅండ్ఎం నష్టాల్లో ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఎస్బీఐ, కొటాక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ లాభాల్లో ఉన్నాయి.
అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా- పసిఫిక్ మార్కెట్లు నేడు సానుకూలంగా కదలాడుతున్నాయి. విదేశీ మదుపర్లు నిన్న రూ.5,539.64 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో దేశీయ మదుపర్లు రూ.4,506.31 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. జీఎస్టీ వసూళ్లు జనవరిలో రూ.1,55,922 కోట్లుగా నమోదైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. 2022 ఏప్రిల్లో వసూలైన రూ.1.68 లక్షల కోట్ల తర్వాత ఇదే అత్యధిక స్థాయి కావడం విశేషం.
ఈరోజు ఫలితాలు ప్రకటించనున్న ప్రముఖ కంపెనీలు: టాటా కెమికల్స్, అశోక్ లేలాండ్, బ్రిటానియా, అజంతా ఫార్మా, హిందుస్థాన్ కాపర్, యూటీఐ ఏఎంసీ, వర్ల్పూల్, జువారి అగ్రో కెమికల్స్, ఐడీఎఫ్సీ, రేమండ్, జిలెట్, ఆర్పీజీ లైఫ్ సైన్సెస్, ఆర్ఎస్ సాఫ్ట్వేర్
గమనించాల్సిన స్టాక్స్..
కోల్ ఇండియా: ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా డిసెంబరు త్రైమాసికంలో రూ.7,755.50 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదే కాల లాభం రూ.4,558.30 కోట్లతో పోలిస్తే ఇది 70 శాతం అధికం. ఏకీకృత విక్రయాలు రూ.25,990.97 కోట్ల నుంచి 25 శాతం పెరిగి రూ.32,429.46 కోట్లకు చేరాయి.
సన్ ఫార్మా: డిసెంబరు త్రైమాసికంలో రూ.2,166 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదే కాల లాభం రూ.2,059 కోట్లతో పోలిస్తే ఇది 5 శాతం ఎక్కువ. కార్యకలాపాల మొత్తం ఆదాయం రూ.9,863 కోట్ల నుంచి రూ.11,241 కోట్లకు పెరిగింది. భారత ఫార్ములేషన్ విక్రయాలు 7 శాతం పెరిగి రూ.3,392 కోట్లకు చేరాయి.
ఐఓసీ: డిసెంబరు త్రైమాసికంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) రూ.448.01 కోట్ల లాభాన్ని ప్రకటించింది. మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.1,97,168 కోట్ల నుంచి రూ.2,28.168 కోట్లకు పెరిగింది. వరుసగా రెండు త్రైమాసికాల పాటు నష్టపోయిన కంపెనీ, ఈ సమీక్షా త్రైమాసికంలో మళ్లీ లాభాల్లోకి వచ్చింది.
అదానీ ఎంటర్ప్రైజెస్: రూ.20,000 కోట్ల ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ)కు పూర్తి స్పందన లభించింది. ఇష్యూలో 4.55 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా, 5.08 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. సంస్థాగతేతర మదుపర్లు తమకు కేటాయించిన మొత్తానికి, మూడు రెట్లకు పైగా ఆసక్తి చూపగా, క్యూఐబీ విభాగంలో 1.2 రెట్ల స్పందన దక్కింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
Dmart Q4 results: దేశవ్యాప్తంగా డీమార్ట్ పేరిట సూపర్ మార్కెట్లు నిర్వహించే అతిపెద్ద రిటైల్ చైన్ అవెన్యూ సూపర్మార్ట్స్ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. -
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
layoffs: ప్రపంచవ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్ నెలలోనే 20 వేల మందిని సాగనంపాయి. -
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్పై జిరోదా సీఈవో పోస్ట్
Nithin Kamath: కర్మ ఫలితం అనుభవిస్తున్నానని అంటున్నారు జిరోదా సీఈవో నితిన్ కామత్. స్పామ్ కాల్స్పై ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. -
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా తన బ్యాగేజీ పాలసీని మార్చింది. కొత్త రూల్స్ మే 2 నుంచి అమల్లోకి వచ్చాయి. -
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!
ఉద్యోగం కోసం అభ్యర్థులు భిన్న మార్గాలను ఎంచుకుంటుంటారు. రిక్రూటర్ మెప్పు పొందేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తుంటారు. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
ఉల్లి ఎగుమతులపై కేంద్రం ఎత్తివేసింది. మహారాష్ట్రలో ఎన్నికల వేళ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
రూ.25,000 కోట్ల పెట్టుబడులకు అవకాశం
ద్విచక్ర వాహనాలు, బస్సులు మనదేశంలో ఈవీ (విద్యుత్తు వాహన) పరిశ్రమకు చోదక శక్తిగా మారుతున్నాయి. -
టెస్లా పవర్పై టెస్లా దావా
భారత్కు చెందిన ఒక కంపెనీ తమ పేరును వినియోగిస్తూ, వినియోగదారుల్లో గందరగోళ సృష్టిస్తోందని ఆరోపిస్తూ, దిల్లీ హైకోర్టులో అమెరికా విద్యుత్ వాహన (ఈవీ) దిగ్గజం టెస్లా దావా వేసింది. -
కొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్
యువతను ఆకట్టుకునే లక్ష్యంతో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో సరికొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్ ను విపణిలోకి శుక్రవారం విడుదల చేసింది. -
క్యాపిటా ల్యాండ్కు హైదరాబాద్లో 25 లక్షల చ.అ. కార్యాలయ స్థలం
స్థిరాస్తి సేవల సంస్థ ఫినిక్స్ గ్రూపు, హైదరాబాద్లోని హైటెక్ సిటీ సమీపంలో నిర్మిస్తున్న 25 లక్షల చదరపు అడుగుల వాణిజ్య భవనాన్ని కేపిటా ల్యాండ్ ఇండియా ట్రస్ట్ అనే సంస్థ కొనుగోలు చేయనుంది. -
ఎంఆర్ఎఫ్ తుది డివిడెండ్ రూ.194
టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్, మార్చి త్రైమాసికంలో రూ.396 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. -
39% తగ్గిన అదానీ గ్రీన్ ఎనర్జీ లాభం
అదానీ గ్రూప్నకు చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్), మార్చి త్రైమాసికంలో రూ.310 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. -
గోద్రేజ్ ప్రాపర్టీస్ రికార్డు అమ్మకాలు
గోద్రేజ్ గ్రూప్నకు చెందిన స్థిరాస్తి సంస్థ గోద్రేజ్ ప్రాపర్టీస్, మార్చి త్రైమాసికంలో గతంలో ఎన్నడూ లేనంతగా రూ.471.26 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
గరిష్ఠాల నుంచి వెనక్కి
సూచీల గరిష్ఠ స్థాయుల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ముగిశాయి. టెలికాం, యంత్ర పరికరాలు, టెక్ షేర్లు డీలాపడటంతో సెన్సెక్స్ 74,000 పాయింట్ల దిగువకు చేరింది. -
నరేశ్ గోయల్కు బెయిల్ ఇవ్వొద్దు.. ఈడీ
మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్, వైద్య ప్రాతిపదికన మధ్యంతర బెయిల్ కోరడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం వ్యతిరేకించింది. -
అంతరిక్ష కార్యకలాపాలకు నిధులు
మనదేశంలో అంతరిక్ష రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలకు నిధులు సమకూర్చడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏబీబీ) సుముఖంగా ఉంది. -
యాపిల్ ఆదాయాల్లో రెండంకెల వృద్ధి
భారతదేశంలో మార్చి త్రైమాసికంలో రికార్డు ఆదాయాన్ని నమోదుచేసినట్లు అమెరికా దిగ్గజ సంస్థ యాపిల్ ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు( 8)
సిగ్నిటీ టెక్నాలజీస్లో 54% వాటా కొంటున్న కోఫోర్జ్ లిమిటెడ్, ఇప్పుడు ఆ సంస్థ వాటాదార్లకు ‘ఓపెన్ ఆఫర్’ జారీ చేసింది. -
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ భారత్లో పెద్దఎత్తున ఖాతాలపై చర్యలు చేపట్టింది. ఒక్క 2024 తొలి త్రైమాసికంలోనే ఏకంగా 2.23 కోట్ల ఖాతాలపై నిషేధం విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
రష్యా వాంటెడ్ లిస్ట్లో జెలెన్స్కీ..!
-
దంచికొట్టిన డుప్లెసిస్, కోహ్లీ.. గుజరాత్పై బెంగళూరు విజయం
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM