Evergreen: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. 4 సంవత్సరాల జీతం బోనస్..!
తైవాన్కు చెందిన షిప్పింగ్ సంస్థ తన ఉద్యోగులకు అనూహ్యమైన ఆఫర్ ఇచ్చింది. భారీ స్థాయిలో బోనస్లు ఇస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
తైపీ: తైవాన్కు చెందిన ఎవర్గ్రీన్ మెరైన్ కార్పోరేషన్ (Taiwan's Evergreen Marine Corp) ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారీ స్థాయిలో బోనస్ (Bonus)లు ప్రకటించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సంవత్సరాల జీతాన్ని బోనస్గా ఇస్తోంది. ఈ విషయాన్ని ఆ సంస్థతో సంబంధం ఉన్నవర్గాలు వెల్లడించాయి.
తైవాన్ (Taiwan)కు చెందిన ఈ షిప్పింగ్ సంస్థ 50 నెలల జీతంతో సమానమైన బోనస్ను ఇస్తోంది. అంటే అది నాలుగు సంవత్సరాల జీతం కంటే ఎక్కువే. ఉద్యోగి జాబ్ గ్రేడ్, తైవాన్ ఆధారిత కాంట్రాక్టులు కలిగిన సిబ్బందికి మాత్రమే ఇది వర్తిస్తుందని ఆ వర్గాలు తెలిపాయి. ఒక ఏడాదిలో సంస్థ, ఉద్యోగి పనితీరు మీద ఆధారపడి సంవత్సరాంతపు బోనస్లు ఉంటాయని శుక్రవారం ఎవర్గ్రీన్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే మిగతా వివరాలు ఏవీ వెల్లడించలేదు.
గత రెండు సంవత్సరాల్లో ఈ సంస్థ వ్యాపారం భారీస్థాయిలో పెరిగింది. 2022లో దీని ఆదాయం 20.7 బిలియన్ల డాలర్లకు పెరగనుందని అంచనా. 2020తో పోల్చుకుంటే అది మూడు రెట్లు అధికం. అయితే ఈ బోనస్ అదృష్టం ఉద్యోగులందరికీ దక్కడం లేదని తెలుస్తోంది. మరోవైపు గతేడాది ఈ సంస్థ పేరు ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. దీనికి చెందిన నౌక ఒకటి ఈజిప్ట్లోని సూయిజ్ కాలువలో అనూహ్యంగా ఇరుక్కుపోయింది. కీలకమైన, సన్నని కృత్రిమ కాలువలో కొద్దిరోజుల పాటు ఇతర నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా