గోడకూలి 8 మంది మృతి

రాజస్థాన్‌ జోధ్‌పూర్‌లోని బస్ని పారిశ్రామిక ప్రాంతంలో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం గోడ...

Published : 11 Nov 2020 03:00 IST

జైపూర్‌: రాజస్థాన్‌ జోధ్‌పూర్‌లోని బస్ని పారిశ్రామిక ప్రాంతంలో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి 8 మంది మృతి చెందారు. ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదంపై స్పందించిన ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్ సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.40 వేల చొప్పున సీఎం పరిహారం ప్రకటించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని