జగ్గయ్యపేట వద్ద కారులో భారీగా మద్యం 

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సీతారాంపురంలోని ఓ అపార్టుమెంట్‌లో నిలిపి ఉంచిన కారులో భారీగా మద్యం సీసాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు

Updated : 30 Sep 2020 17:42 IST

కారుపై దుర్గగుడి పాలకమండలి సభ్యురాలి పేరుతో బోర్డు

జగ్గయ్యపేట: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సీతారాంపురంలోని ఓ అపార్టుమెంట్‌లో నిలిపి ఉంచిన కారులో భారీగా మద్యం సీసాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మద్యం సీసాలు లభ్యమైన కారుపై విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయ పాలకమండలి సభ్యురాలి బోర్డు ఉండటం కలకలం రేపుతోంది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. మద్యం సీసాలు కారులోకి ఎలా వచ్చాయి? ఎవరు తీసుకొచ్చారు? అనే కోణంలో ఎస్‌ఈబీ, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి వివరాలూ వెల్లడించలేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని