వార్డు వాలంటీర్‌ అనుమానాస్పద మృతి

ఒంగోలు నగర శివారులోని దివ్యాంగురాలైన యువతి శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. పోలీసులు తెలిపిన...

Published : 19 Dec 2020 01:22 IST

ఒంగోలు నేరవార్తలు: ఒంగోలు నగర శివారులో దివ్యాంగురాలైన ఓ యువతి శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒంగోలు కమ్మపాలెంలో నివాసం ఉంటున్న ఉమ్మనేని భువనేశ్వరి(22) వార్డు వాలంటీర్‌గా పనిచేస్తోంది. శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లింది. సుమారు 9 గంటలకు దశరాజుపల్లి రోడ్డులో తన మూడు చక్రాల వాహనంపై మంటల్లో ఆమె కాలిపోతూ కనిపించింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అప్పటికే భువనేశ్వరి కాలి బూడిదైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఒంగోలు తాలూకా సీఐ శివరామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. భువనేశ్వరి సోదరి కూడా దివ్యాంగురాలని స్థానికులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని