Nizamabad: ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతి మృతి

నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లిలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతి మృతి చెందింది. తనను ప్రేమించాలంటూ రెండ్రోజుల కిందట యువతిని ఓ యువకుడు తీవ్రంగా కొట్టి పరారయ్యాడు.

Published : 25 Sep 2023 10:51 IST

జక్రాన్‌పల్లి: నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లిలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతి మృతి చెందింది. తనను ప్రేమించాలంటూ రెండ్రోజుల కిందట యువతిని ఓ యువకుడు తీవ్రంగా కొట్టి పరారయ్యాడు. దీంతో గాయపడిన యువతి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది. నిందితుడు గౌసుద్దీన్‌పై యువతి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. జక్రాన్‌పల్లిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని