Telangana News: ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడు రామచంద్ర భారతిపై మరో కేసు
తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రధాన నిందితుడు రామచంద్రభారతిపై మరో కేసు నమోదైంది. నకిలీ ఆధార్కార్డు, పాన్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తయారు చేశారంటూ బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్: తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రధాన నిందితుడు రామచంద్రభారతిపై మరో కేసు నమోదైంది. నకిలీ ఆధార్కార్డు, పాన్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తయారు చేశారంటూ బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. తెరాస ఎమ్మెల్యలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారంటూ ఇప్పటికే మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. అవినీతి నిరోధకశాఖ చట్టంలోని సెక్షన్ 8తో పాటు, పలు సెక్షన్ల కింద మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
రామచంద్రభారతి.. నకిలీ ఆధార్ కార్డు, పాన్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్లు మూడేసి చొప్పున నకిలీవి తయారు చేసి తన వద్దు పెట్టుకున్నాడని తెరాస ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోహిత్ ఫిర్యాదు ఆధారంగా.. రెండ్రోజుల క్రితమే పోలీసులు ఆయనపై పలుసెక్షన్ల కింద కేసు నమోదు చేసినప్పటికీ వివరాలు వెల్లడించకుండా గోప్యత పాటించారు. ఇందుకు సంబంధించిన పలు కీలక ఆధారాలను పోలీసులు సేకరిస్తు్న్నారు. ఈకేసులో నేరం రుజువైతే రామచంద్రభారతికి పదేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు బస్సు బోల్తా.. పది మందికి గాయాలు
మహబూబ్నగర్ జిల్లాలో బుధవారం ఉదయం ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. -
‘జే బ్రాండ్’ మద్యం తాగి వృద్ధుడి మృతి
జే బ్రాండ్ మద్యం తాగి వృద్ధుడు మృతిచెందిన ఘటన వైఎస్సాఆర్ జిల్లాలోని మూలవంకలో మంగళవారం చోటుచేసుకుంది. -
అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల్లో.. అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. -
వడదెబ్బతో ఆరుగురి మృతి
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆయా జిల్లాల్లో ఆరుగురు మృత్యువాతపడ్డారు. -
చేతులూకాళ్లూ కట్టేసి.. సిగరెట్లతో భర్తకు వాతలు
‘‘నా భార్య మత్తుపదార్థాలు తీసుకొని రోజూ అర్ధరాత్రి వేళల్లో నన్ను హింసిస్తోంది. సిగరెట్లతో వాతలు పెడుతోంది. -
సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల కేసులో మరో నిందితుడి అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు.