Road Accident: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డికి గాయాలు

ఏపీకి చెందిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డికి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. 

Updated : 05 Jan 2024 04:33 IST

ఈనాడు, నెల్లూరు: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారు.. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడిచెలిక సమీపంలో గురువారం అర్ధరాత్రి రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆయన విజయవాడ నుంచి నెల్లూరు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. స్థానికుల సమాచారం మేరకు ఎమ్మెల్సీ కారుకు ముందు వెళుతున్న లారీ టైరు పంక్చరు కావడంతో ఒక్కసారిగా నెమ్మదించింది. ఆ క్రమంలో కారు వెళ్లి లారీ వెనుక భాగంలో ఢీకొని డివైడర్‌పై పడిపోయింది. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్‌రెడ్డి పీఏ అక్కడికక్కడే మృతి చెందగా, ఎమ్మెల్సీ తలకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో అయిదుగురు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని