Crime: ఖమ్మంలో డ్రగ్స్ కలకలం... హైదరాబాద్కు తరలిస్తూ పట్టుబడ్డ యువకులు
ఖమ్మంలో మాదక ద్రవ్యాల కలకలం రేపింది. నగరానికి చెందిన యువకుల నుంచి పది గ్రాముల డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకులను
ఖమ్మం: ఖమ్మంలో మాదక ద్రవ్యాల కలకలం రేపింది. నగరానికి చెందిన యువకుల నుంచి పది గ్రాముల డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి వద్ద డ్రగ్స్తో పాటు గంజాయిని గుర్తించిన పోలీసులు.. వాటిని హైదరాబాద్లో విక్రయించేందుకు తీసుకొచ్చినట్టు భావిస్తున్నారు. నిందితుల్లో ఒకరిపై బెంగళూరు, హైదరాబాద్లో కేసులు ఉన్నట్టు గుర్తించారు. సీసీ సర్కిల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో ఇద్దరు యువలకు మత్తు పదార్ధాలతో పట్టుబడినట్టు సూపరింటెండెంట్ నాగేందర్రెడ్డి తెలిపారు.
‘‘నిందితుల నుంచి 10 గ్రాముల డ్రగ్స్, 60గ్రాముల యాష్ ఆయిల్, 1600 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని, కార్ సీజ్ చేశాం. నిందితుల్లో ఒకరికి గతంలో నేర చరిత్ర ఉంది. జీవనోపాధి కోసం బెంగళూరు వెళ్లిన అతనికి డ్రగ్స్ డీలర్స్తో పరిచయం ఏర్పడింది. కొంతకాలం అక్కడ డ్రగ్స్ సరఫరా చేసిన తర్వాత పోలీసులకు చిక్కాడు. అక్కడి నుంచి హైదరాబాద్కు మకాం మార్చాడు. హైదరాబాద్లో కూడా డ్రగ్స్ సరఫరా కొనసాగించడంతో అతనిపై రెండు కేసులు నమోదయ్యాయి. 6 నెలల క్రితం తన స్థావరాన్ని ఖమ్మం మార్చుకున్నాడు. ఖమ్మం నుంచి కొరియర్, ట్రావెల్ సర్వీసు ద్వారా హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. పట్టుబడినవి సింథటిక్ డ్రగ్స్. వీటిని బెంగళూరు, గోవా, ముంబయి నుంచి దిగుమతి చేసుకుని ఖమ్మం నుంచి హైదరాబాద్కు సరఫరా చేస్తున్నాడు. గత 6 నెలల నుంచి ఈ వ్యవహారం కొనసాగుతోంది’’ అని సూపరింటెండెంట్ నాగేందర్రెడ్డి వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం