Deep fake: స్నేహితుడి ముఖంతో వీడియో కాల్.. డీప్ ఫేక్తో నయా మోసం!
Deep fake video: డీప్ ఫేక్ వీడియో టెక్నాలజీ సాయంతో జరిగిన మోసం ఇది. వీడియో కాల్ ద్వారా కోల్ ఇండియా మాజీ ఉద్యోగి నుంచి ఓ నేరగాడు రూ.40వేలు కొట్టేశాడు.
తిరువనంతపురం: టెక్నాలజీ మాటున జరుగుతున్న మరో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. డీప్ ఫేక్ టెక్నాలజీ సాయంతో స్నేహితుడి ముసుగు తొడిగి ఓ నేరగాడు కోల్ ఇండియా మాజీ ఉద్యోగికి టోకరా వేశాడు. చెల్లెలికి సర్జరీ అంటూ రూ.40వేలు దోచేశాడు. మరింత దోచుకోవడానికి ప్రయత్నించే క్రమంలో మోసం అని గ్రహించిన సదరు విశ్రాంత ఉద్యోగి.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేయగా.. ప్రధాన నిందితుడు ఆచూకీ దొరకాల్సి ఉంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన పీఎస్ రాధాకృష్ణన్ కొయ్కోడ్లో నివాసముంటున్నారు. కోల్ ఇండియా మాజీ ఉద్యోగి అయిన రాధాకృష్ణన్కు ఈ ఏడాది జులై 9న ఉదయం గుర్తు తెలీని నంబర్ నుంచి వాట్సప్లో వరుస మెసేజ్లు వచ్చాయి. తనతో పాటు నాలుగు దశాబ్దాలుగా పనిచేసిన వేణుకుమార్ ఫ్యామిలీ ఫొటోలు అవి. అవి చూస్తుండగానే ఓ వాట్సాప్ కాల్. ‘నేను వేణుని. ప్రస్తుతం దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఉన్నా. సాయంత్రానికి ముంబయి చేరుకుంటా. చెల్లెలికి సర్జరీ ఉంది. ఓ రూ.40వేలు సర్దగలవా’’ అంటూ విన్నపం. ఏళ్లుగా పరిచయం ఉన్న వ్యక్తి.. పైగా ఆపత్కాలంలో సాయం అడుగుతున్నాడు.. చేయాలా? వద్దా? వద్దా అనే మీమాంసలో ఉండగా.. మళ్లీ అంతలోనే వీడియో కాల్.
మధురవాడలో మద్యం లారీ బోల్తా.. ఎగబడిన జనం
ఎదరుగా తనకెంతగానో పరిచయం ఉన్న వేణు కుమార్ ఫోన్లో ప్రత్యక్షమయ్యాడు. ఇక అంతే అవతలి ఉన్న వ్యక్తి వేణూనే అని ధ్రువీకరించుకుని అతడు చెప్పిన ఖాతాకు రూ.40వేలు బదిలీ చేశాడు. గంటల వ్యవధిలో రెండోసారి మరో రూ.35 వేలు కావాలంటూ అడగడంతో అనుమానం వచ్చిన రాధాకృష్ణన్.. కోల్ ఇండియా మాజీ ఉద్యోగుల వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసి అందులో ఉన్న వేణు కుమార్ నంబర్కు ఫోన్ చేశాడు. అవతలి నుంచి చాలా రోజుల తర్వాత ఫోన్ చేసిన మిత్రుడితో పిచ్చాపాటీగా మాట్లాడడం మొదలుపెట్టడంతో రాధాకృష్ణన్కు ఆశ్చర్యం వేసింది. దీంతో జరిగిందంతా చెప్పాడు. మోసపోయానని గ్రహించి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
మోసం ఇలా..
రాధాకృష్ణన్ ఇచ్చిన ఫిర్యాదుతో సిటీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీడియో కాల్ ద్వారా డీప్ఫేక్ టెక్నాలజీ సాయంతో ఈ మోసం జరిగిందని గుర్తించారు. అహ్మదాబాద్కు చెందిన కౌశ్ల్ షాను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. నేర చరిత్ర ఉన్న కౌశల్.. రాధాకృష్ణన్ నుంచి కొట్టేసిన సొమ్మును తెలివిగా ఓ గ్యాంబ్లింగ్ సంస్థ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని తన ఖాతాకు బదిలీ చేయించుకున్నాడు. మూలాలు దొరక్కుకుండా ఉండేందుకు కౌశల్ ఈ పనిచేశాడని పోలీసులు తెలిపారు. బాధితుడి కంపెనీ ఉద్యోగుల వాట్సాప్ గ్రూప్ నుంచి ఈ వివరాలు తస్కరించి మోసానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో షేక్ ముర్తుజామియా భాయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పేదల పేరిట నకిలీ బ్యాంక్ అకౌంట్లు తెరిచి విక్రయించే షేక్.. బ్యాంక్ ఖాతా విషయంలో కౌశల్కు సహాయపడినట్లు గుర్తించారు. గుజరాత్లో అతడిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. డీప్ఫేక్ టెక్నాలజీ సాయంతో ఈ తరహా మోసం జరగడం ఇదే తొలిసారి అని పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
ఏజెంట్లు ఇచ్చే కమీషన్లకు ఆశపడి..ఉద్యోగాల పేరుతో యువకులను మభ్యపెట్టి కంబోడియాకు తరలిస్తున్న ముఠా గుట్టును రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఆ ముఠా సభ్యుడు కంచర్ల సాయి ప్రసాద్ను అరెస్టు చేశారు. -
ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ నాయకుడి హత్య
ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు జోగ పొడియం(48)ను మావోయిస్టులు శుక్రవారం అర్ధరాత్రి ఆయన ఇంట్లోనే దారుణంగా హత్య చేశారు. పొటాలి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపు సమీపంలో మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడ్డారు. -
ఆకస్మిక తనిఖీల్లో భారీ సొత్తు స్వాధీనం
మల్టీజోన్-1 పరిధిలోని 16 జిల్లాల్లో చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో పోలీసులు భారీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. -
డ్రగ్స్ తయారీ మాఫియా గుట్టురట్టు
గుజరాత్, రాజస్థాన్లలో మాదక ద్రవ్యాల తయారీ ముఠా గుట్టు రట్టయింది. రహస్యంగా నడుపుతున్న డ్రగ్స్ ల్యాబ్లపై మాదక ద్రవ్యాల నిరోధక విభాగం (ఎన్సీబీ), గుజరాత్కు చెందిన ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్) దాడులు నిర్వహించి 13 మందిని అరెస్టు చేశాయి. -
ఝార్ఖండ్లో స్కూల్ బస్సు బోల్తా.. 15 మంది చిన్నారులకు గాయాలు
ఝార్ఖండ్లోని రాంచీలో చిన్నారులతో పాఠశాలకు వెళుతున్న ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
-
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్