Crime News: విజయవాడలో కుటుంబం ఆత్మహత్య కేసు.. వెలుగులోకి కీలక విషయాలు
తెలంగాణలోని నిజామాబాద్కు చెందిన కుటుంబం నిన్న విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న కేసులో
విజయవాడ: తెలంగాణలోని నిజామాబాద్కు చెందిన కుటుంబం నిన్న విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫైనాన్స్ సంస్థల వేధింపులే ఆత్మహత్యకు కారణమని ఆ కుటుంబం సూసైడ్ నోట్లో వెల్లడించింది. ఆత్మహత్యకు ముందు కుటుంబ సభ్యులు సూసైడ్ నోట్ రాశారు. ఇబ్బందులు పెట్టిన వారి వివరాలను అందులో పేర్కొన్నారు. నోట్తో పాటు తమను వేధించిన వారి వివరాలను సెల్ఫీ వీడియోలో చెప్పారు. ఆ వీడియోను పప్పుల సురేష్ తమ బంధువులకు పంపించారు. ఫైనాన్స్ వారి ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు.
కుటుంబం రాసిన సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వేధింపులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో నలుగురి మృతదేహాలను ఉంచారు. పోస్టుమార్టం తర్వాత వైద్యులు మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు. మరోవైపు మృతుల బంధువులు విజయవాడ ఆస్పత్రికి చేరుకున్నారు. వేధింపులే ఆత్మహత్యలకు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు.
అప్పుల కోసం కుటుంబాన్ని వేధించిన నలుగురి పేర్లను పోలీసులు రికార్డులో నమోదు చేశారు. దుర్గమ్మ దర్శనానికి వెళ్లిన నిజామాబాద్కు చెందిన పప్పుల సురేష్ (58), ఆయన భార్య శ్రీలత (54), కుమారులు అఖిల్ (26), ఆశిష్ (24) నిన్న బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమను అంగీకరించలేదని అమ్మకు విషం పెట్టిన యువతి
తన ప్రేమకు అడ్డుచెప్పారని కన్నతల్లి సహా కుటుంబసభ్యులను హతమార్చేందుకు ఓ యువతి చికెన్ రైస్లో విషం కలిపింది. ఆ అన్నం తిన్న యువతి తల్లి, తాత మరణించారు. -
గురుగ్రంథ్ సాహిబ్లో పేజీల చించివేత.. యువకుణ్ని కొట్టిచంపిన స్థానికులు
సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ్ సాహిబ్లోని కొన్ని పేజీలను చించివేయడంతో 19 ఏళ్ల ఓ యువకుడిని స్థానికులు కొట్టిచంపిన ఘటన పంజాబ్లో చోటుచేసుకుంది. -
కుమారుణ్ని కొట్టిచంపి.. గోనెసంచిలో చుట్టి పడేశారు!
మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో కుమారుణ్ని తల్లిదండ్రులే కొట్టిచంపి గోనెసంచిలో చుట్టి బయట పడేశారు. ఇందౌర్ విమానాశ్రయ పోలీస్స్టేషను పరిధిలో ఏప్రిల్ 26న గోనెసంచిలో చుట్టి ఉన్న మృతదేహం పారిశుధ్య కార్మికులకు కనిపించింది. -
కాంగ్రెస్ నాయకుడి దారుణ హత్య
ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకుడొకరు హత్యకు గురయ్యారు. పార్టీ ప్రచార సభ ఏర్పాట్లలో ఉన్న ఆయనపై ఒకరు కత్తితో దాడికి దిగి గొంతుకోసి హత్య చేశారు. -
అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య
అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో చోటు చేసుకుంది. -
బోగస్ బిల్లులతో రూ.45 కోట్లు కాజేశారు!
వాణిజ్య పన్నుల శాఖలో బోగస్ బిల్లులతో జీఎస్టీ రిఫండ్ పొందిన కేసులో తవ్వేకొద్దీ అవినీతి వ్యవహారం బయటపడుతోంది. -
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. నేరపూరిత కుట్రను చేర్చిన దిల్లీ పోలీసులు
రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరిస్తూ రూపొందించిన నకిలీ వీడియో కేసు ఎఫ్ఐఆర్లో దిల్లీ పోలీసులు శనివారం నేరపూరిత కుట్ర అభియోగాన్ని చేర్చారు. -
నూహ్ సామూహిక అత్యాచారాలు.. జంట హత్యల దోషులకు మరణ దండన
ఎనిమిదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలిక సహా ఇద్దరిపై సామూహిక అత్యాచారం, జంట హత్యల కేసులో దోషులుగా తేలిన నలుగురు వ్యక్తులకు న్యాయస్థానం మరణ దండన విధించింది. -
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
Scam Alert : డిజిటల్ యుగంలో సైబర్ దాడులు పెరిగిపోతున్నాయి. సాంకేతికతను ఉపయోగించుకొని సైబర్ నేరగాళ్లు పెద్దఎత్తున మోసాలకు తెర తీస్తున్నారు.