కుమ్రంభీం జిల్లాలో ఇద్దరు మావోయిస్టులు మృతి

కాగజ్‌నగర్‌ మండలం కడంబ అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనాస్థలిలో రెండు తుపాకులు, విప్లవ సాహిత్యాన్ని

Updated : 20 Sep 2020 00:52 IST

కుమ్రం భీం: కాగజ్‌నగర్‌ మండలం కడంబ అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనాస్థలిలో రెండు తుపాకులు, విప్లవ సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఇరువురు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.  

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని