Tragedy: సిద్ధూ ప్రమాణస్వీకారానికి వెళ్తూ ఐదుగురు కాంగ్రెస్‌ కార్యకర్తల మృతి

పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా నవ్‌జోత్‌ సింగ్‌ సిద్ధూ ప్రమాణస్వీకారోత్సవం రోజున అపశ్రుతి చోటుచేసుకుంది. ఆయన ప్రమాణస్వీకారానికి.....

Updated : 23 Jul 2021 17:59 IST

మోగా‌: పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా నవ్‌జోత్‌ సింగ్‌ సిద్ధూ ప్రమాణస్వీకారోత్సవం రోజున అపశ్రుతి చోటుచేసుకుంది. ఆయన ప్రమాణస్వీకారానికి వెళ్తున్న కాంగ్రెస్‌ కార్యకర్తల బస్సు మోగా జిల్లాలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు మృతిచెందగా.. మరో 20మంది గాయపడినట్టు సమాచారం. ప్రైవేటు మినీ బస్సు, పంజాబ్‌ ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్టు మోఘా సీనియర్‌ ఎస్పీ హర్మాన్‌వీర్‌ సింగ్‌ గిల్‌ తెలిపారు. ఈ ఘటనపై సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ విచారం వ్యక్తంచేశారు. క్షతగాత్రులకు వైద్య చికిత్స అందించాలని సూచించారు. ఈ ప్రమాద ఘటనపై పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని