భాజపా నేత జితేందర్‌రెడ్డి నివాసం నుంచి డ్రైవర్‌ సహా నలుగురి కిడ్నాప్‌

భాజపా నేత జితేందర్‌రెడ్డి నివాసంలో అపహరణ  ఘటన కలకలం రేపింది. దిల్లీ సౌత్‌ అవెన్యూలోని ఇంట్లో నుంచి కారు డ్రైవర్‌తో పాటు మరో మగ్గురు గెస్ట్‌లను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్టు...

Updated : 02 Mar 2022 06:56 IST

దిల్లీ: తెలంగాణకు చెందిన భాజపా నేత, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి నివాసంలో అపహరణ  ఘటన కలకలం రేపింది. దిల్లీ సౌత్‌ అవెన్యూలోని ఇంట్లో నుంచి కారు డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు గెస్ట్‌లను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. దిల్లీ వచ్చినప్పుడు సౌత్‌ అవెన్యూలోని 105 నివాసంలో జితేందర్‌రెడ్డి ఉంటారు. గత 3 రోజులుగా ఆయన నివాసంలో కొందరు గెస్ట్‌లు ఉంటున్నారు. ఈక్రమంలో జితేందర్‌రెడ్డి కారు డ్రైవర్‌ తో పాటు ముగ్గురు గెస్ట్‌లను బలవంతంగా తీసుకెళ్లినట్టు సీసీటీవీల్లో నమోదైంది. ఈమేరకు దిల్లీ సౌత్‌ అవెన్యూ పీఎస్‌లో జితేందర్‌రెడ్డి వ్యక్తిగత సిబ్బంది ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేయాలా? వద్దా?అనేదానిపై కొంత సందిగ్ధత నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని