యువ బాక్సర్‌ ఆత్మహత్య 

మహారాష్ట్రలోని అకోలాలో ఓ యువ బాక్సర్‌ పవన్‌ రౌత్‌ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అకోలాలో తన హాస్టల్‌ గదిలో శుక్రవారం ఉదయం ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్టు.......

Published : 22 Feb 2020 00:20 IST

నాగ్‌పూర్‌: మహారాష్ట్రలోని అకోలాలో యువ బాక్సర్‌ పవన్‌ రౌత్‌ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అకోలాలో తన హాస్టల్‌ గదిలో శుక్రవారం ఉదయం రౌత్‌ ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్టు  కోచ్‌ సతీశ్‌చంద్ర భట్‌ వెల్లడించారు. ఇటీవల దిల్లీలో జరిగిన జాతీయ స్థాయి బాక్సింగ్‌ ఛాంపియన్‌ పోటీల్లో పవన్‌ రౌత్‌ మహారాష్ట్ర తరఫున ప్రాతినిధ్యం వహించాడని ఆయన తెలిపారు.

నాగ్‌పూర్‌కు చెందిన 19 ఏళ్ల పవన్‌ రౌత్‌ అకోలాలోని స్పోర్ట్స్‌ అకాడమీలో శిక్షణలో ఉన్నాడు. అక్కడే హాస్టల్‌లో ఉంటున్నాడు. శుక్రవారం అకోలాలోనే జరిగే ఒక టోర్నమెంట్‌లో పాల్గొనాల్సి ఉన్న నేపథ్యంలో అతడు బలవన్మరణానికి పాల్పడటం విషాదం నింపింది. అయితే, శుక్రవారం అనారోగ్యంతో పవన్‌ రౌత్‌ శిక్షణకు రాలేదని కోచ్‌ తెలిపారు. ఈ రోజు తన గదిలో ఉరివేసుకొని మృతిచెందాడని వెల్లడించారు. ఈ ఘటనను మహారాష్ట్ర క్రీడా మంత్రి సునిల్‌‌ కేదార్‌ ధ్రువీకరించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని