కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీ కొట్టిన ద్విచక్రవాహనం
కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రయాణిస్తున్న కారును.. ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి.
బైక్పై వెళ్తున్న ఇద్దరి మృతి
ఎమ్మెల్యేకు తప్పిన ప్రాణాపాయం
తలకొండపల్లి, న్యూస్టుడే: కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రయాణిస్తున్న కారును.. ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్లో సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నారాయణరెడ్డి.. తిరిగి కారులో కల్వకుర్తి వెళుతుండగా రామాసిపల్లి మైసమ్మ ఆలయం వద్ద ఈ ఘటన జరిగింది. రహదారిపై ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం వీరి కారును ఢీ కొట్టింది. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయిన కారు.. పక్కనే ఉన్న రాళ్ల గుట్టలపై నుంచి నీలగిరి తోటలోకి దూసుకుపోవడంతో ధ్వంసమైంది. కారులో బెలూన్లు తెరుచుకోవడంతో స్వల్ప గాయాలతో ఎమ్మెల్యే బయట పడ్డారు. ద్విచక్ర వాహనంపై వస్తున్న పబ్బతి నరేశ్ (25) అక్కడికక్కడే మృతి చెందగా.. బైరపాక పరశురాములు (35) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. తలకొండపల్లి మండలం వెంకటాపూర్కు చెందిన వీరిద్దరూ బైక్పై మిడ్జిల్ వెళ్లి వస్తూ ఎమ్మెల్యే కారును ఢీకొన్నారు. ఎమ్మెల్యేను కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి, తర్వాత హైదరాబాద్కు తరలించి చికిత్స అందించారు. ఎస్సై శ్రీకాంత్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కర్నూలులో చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్జెండర్ల అనుమానాస్పద మృతి
జిల్లాలోని కర్నూలు మండలం గార్గేయపురం చెరువులో ముగ్గురు ట్రాన్స్జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. -
సీఎం సభకు జనసమీకరణ పేరిట ఎమ్మెల్యేకు టోకరా
పథకాల పేరు చెప్పి ప్రజాప్రతినిధులను మోసగిస్తున్న ఒక నిందితుడిని హైదరాబాద్ సైబర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ డి.కవిత తెలిపిన వివరాల ప్రకారం.. -
ఫుట్బోర్డు మీదనుంచి జారిపడి మహిళ దుర్మరణం
రద్దీ కారణంగా ఆర్టీసీ బస్సు ఫుట్బోర్డుపై నిల్చున్న ఓ మహిళ ప్రమాదవశాత్తు వెనక టైరు కిందపడి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. -
పెళ్లింట తీవ్ర విషాదం
పెళ్లి ముహూర్తం దగ్గర పడటంతో దుస్తులు కొనుగోలు చేయడానికి కుటుంబ సభ్యులందరూ అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్లారు. రోజంతా షాపింగ్ చేసి రాత్రికి తిరుగు ప్రయాణమయ్యారు. అప్పటికే అలసిపోవడంతో అందరూ నిద్రపోయారు. -
మానవ అక్రమ రవాణా.. ఆపై సైబర్ నేరాలు
విదేశాల్లో ఉద్యోగాలు.. లక్షల్లో సంపాదన అని నమ్మించి కాంబోడియాకు మనుషులను విక్రయిస్తున్న ఓ ముఠాను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. ఓ బాధితుడు తప్పించుకుని పోలీసులకు ఇచ్చిన సమాచారంతో కొందరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. -
దివ్యాంగురాలైన తల్లి.. ఇద్దరు కూతుళ్లను కడతేర్చిన కిరాతకుడు
భార్య చనిపోయిన కొద్దిరోజులకే మరో వివాహం చేసుకొని ఊరి నుంచి వెళ్లిపోవడంతో పాక్షిక అంధురాలైన తల్లే అతని ఇద్దరు కూతుళ్లను చేరదీశారు. వారిని ప్రభుత్వ విద్యాలయాల్లో చదివిస్తూ తనకొచ్చే పింఛను, రైతుబంధుతో జీవితం సాగించేవారు. -
బస్సులో 9 మంది సజీవ దహనం
హరియాణాలోని నూహ్ జిల్లా ధులావత్ గ్రామం సమీపంలో కుండ్లి-మనేసర్- పల్వాల్(కేఎంపీ) ఎక్స్ప్రెస్వేపై శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కదులుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. -
ఫోన్లోనే ట్రిపుల్ తలాక్.. నిందితుడిపై కేసు నమోదు
తన మొదటి భార్యకు ఫోన్లో ట్రిపుల్ తలాక్ చెప్పిన నిందితుడిపై ఆదిలాబాద్ మహిళా పోలీసు స్టేషన్లో శనివారం కేసు నమోదైంది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్