విదేశీ నేరస్థులకు బ్యాంకు ఖాతాల విక్రయం
నలుగురి అరెస్ట్
ట్రేడింగ్ పేరుతో ఆ ఖాతాలకు రూ.22.24 కోట్లు జమచేయించుకున్న ముఠా
హైదరాబాద్ వాసికి రూ. 1.08 కోట్ల టోకరా
ఈనాడు, హైదరాబాద్: కమీషన్ల కోసం బ్యాంకు ఖాతాలు తెరిచి, వాటిని విదేశీ నేరస్థులకు విక్రయిస్తున్న నలుగురిని హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కె.శ్రీనివాసరెడ్డి సోమవారం ఈ ముఠా వివరాలను మీడియాకు వెల్లడించారు. రాజస్థాన్లోని బార్మర్ జిల్లాకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి కృష్ణ ఢాకా (25), వైద్యుడు మనోజ్కుమార్ (27), ఉత్తర్ప్రదేశ్ కాన్పుర్కు చెందిన ఓ ప్రైవేటు బ్యాంకు మాజీ ఉద్యోగి అశుతోష్రాజ్(29), దిల్లీ రోహిణి ప్రాంతానికి చెందిన మునిష్ బన్సల్ ముఠాగా ఏర్పడ్డారు. అశుతోష్రాజ్ బ్యాంకుల్లో తనకు పరిచయమున్న ఉద్యోగులను మచ్చిక చేసుకొని నకిలీ కేవైసీ వివరాలతో కరెంట్ బ్యాంకు ఖాతాలు తెరిచి మనోజ్కుమార్, కృష్ణ, బన్సల్కు అప్పగించేవాడు. ఈ ముగ్గురు ఆయా ఖాతాలను దుబాయ్లోని సైబర్ మోసగాళ్లకు విక్రయించేవారు. దుబాయ్కు చెందిన సైబర్ నేరస్థులు.. ట్రేడింగ్ పేరుతో ఈ ఖాతాల్లోకి నగదు జమ చేయించుకొని మోసం చేస్తున్నారు. హైదరాబాద్కు చెందిన బాధితుడికి గుర్తు తెలియని వ్యక్తులు వాట్సప్ మెసేజ్లు పంపారు. తమను తాము ‘పాంథియోన్ వెంచర్’ ప్రతినిధులుగా పరిచయం చేసుకున్నారు. స్టాక్ ట్రేడింగ్ మెలకువల్ని ఉచితంగా నేర్పించేందుకు తాము కొందరిని ఎంచుకుంటున్నట్లు తెలిపారు. తాము సూచించే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారీగా లాభాలు ఆర్జించవచ్చని చెప్పారు. బాధితుడు అందుకు అంగీకరించడంతో ట్రేడింగ్ ఖాతాను తెరిపించారు. ‘ఆదిత్య స్టాక్ షేరింగ్ వీఐపీ’ పేరిట ఏర్పాటు చేసిన వాట్సప్ గ్రూప్లో చేర్పించారు. ‘పీటీ-వీసీ’ పేరిట గూగుల్ ప్లేస్టోర్లో ఉన్న యాప్ను ఇన్స్టాల్ చేయించారు. అనంతరం ఐపీవో స్టాక్స్ కొనుగోలు పేరుతో బాధితుడి నుంచి రూ.1.08 కోట్లను పలు బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయించుకున్నారు. అనంతరం స్పందించడం మానేయడంతో బాధితుడు హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బాధితుడు నగదు జమ చేసిన ఖాతాల వివరాలపై ఆరా తీయగా.. ఈ నలుగురు నిందితుల నేరం బయటపడింది. దేశవ్యాప్తంగా ఇదే తరహాలో సుమారు రూ.22.24 కోట్లు ఈ ఖాతాలకు జమైనట్లు తేలింది. ఈ ముఠాపై పలు రాష్ట్రాల్లో 171 కేసులు నమోదైనట్లు గుర్తించారు. రాష్ట్రంలోనూ 11 కేసులున్నట్లు వెల్లడైంది. నిందితుల ఖాతాల్లోని రూ.28.94 లక్షలను జప్తు చేయించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కర్నూలులో చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్జెండర్ల అనుమానాస్పద మృతి
జిల్లాలోని కర్నూలు మండలం గార్గేయపురం చెరువులో ముగ్గురు ట్రాన్స్జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. -
సీఎం సభకు జనసమీకరణ పేరిట ఎమ్మెల్యేకు టోకరా
పథకాల పేరు చెప్పి ప్రజాప్రతినిధులను మోసగిస్తున్న ఒక నిందితుడిని హైదరాబాద్ సైబర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ డి.కవిత తెలిపిన వివరాల ప్రకారం.. -
ఫుట్బోర్డు మీదనుంచి జారిపడి మహిళ దుర్మరణం
రద్దీ కారణంగా ఆర్టీసీ బస్సు ఫుట్బోర్డుపై నిల్చున్న ఓ మహిళ ప్రమాదవశాత్తు వెనక టైరు కిందపడి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. -
పెళ్లింట తీవ్ర విషాదం
పెళ్లి ముహూర్తం దగ్గర పడటంతో దుస్తులు కొనుగోలు చేయడానికి కుటుంబ సభ్యులందరూ అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్లారు. రోజంతా షాపింగ్ చేసి రాత్రికి తిరుగు ప్రయాణమయ్యారు. అప్పటికే అలసిపోవడంతో అందరూ నిద్రపోయారు. -
మానవ అక్రమ రవాణా.. ఆపై సైబర్ నేరాలు
విదేశాల్లో ఉద్యోగాలు.. లక్షల్లో సంపాదన అని నమ్మించి కాంబోడియాకు మనుషులను విక్రయిస్తున్న ఓ ముఠాను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. ఓ బాధితుడు తప్పించుకుని పోలీసులకు ఇచ్చిన సమాచారంతో కొందరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. -
దివ్యాంగురాలైన తల్లి.. ఇద్దరు కూతుళ్లను కడతేర్చిన కిరాతకుడు
భార్య చనిపోయిన కొద్దిరోజులకే మరో వివాహం చేసుకొని ఊరి నుంచి వెళ్లిపోవడంతో పాక్షిక అంధురాలైన తల్లే అతని ఇద్దరు కూతుళ్లను చేరదీశారు. వారిని ప్రభుత్వ విద్యాలయాల్లో చదివిస్తూ తనకొచ్చే పింఛను, రైతుబంధుతో జీవితం సాగించేవారు. -
బస్సులో 9 మంది సజీవ దహనం
హరియాణాలోని నూహ్ జిల్లా ధులావత్ గ్రామం సమీపంలో కుండ్లి-మనేసర్- పల్వాల్(కేఎంపీ) ఎక్స్ప్రెస్వేపై శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కదులుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. -
ఫోన్లోనే ట్రిపుల్ తలాక్.. నిందితుడిపై కేసు నమోదు
తన మొదటి భార్యకు ఫోన్లో ట్రిపుల్ తలాక్ చెప్పిన నిందితుడిపై ఆదిలాబాద్ మహిళా పోలీసు స్టేషన్లో శనివారం కేసు నమోదైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు
-
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో