రంగు పూసి.. మాయ చేసి..!
అసలు కరెన్సీ నోట్లను పోలిన కలర్ జెరాక్స్ నోట్లను మారుస్తున్న ముగ్గురు ముఠా సభ్యులను భవానీపురం పోలీసులు గురువారం అరెస్టు చేశారు...
వృద్ధులు, మధ్య వయసు మహిళలే లక్ష్యంగా దొంగనోట్ల మారకం
భవానీపురం: అసలు కరెన్సీ నోట్లను పోలిన కలర్ జెరాక్స్ నోట్లను మారుస్తున్న ముగ్గురు ముఠా సభ్యులను భవానీపురం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. భవానీపురం అవుట్ఏజెన్సీ వద్ద ఒక దుకాణంలో ఆ నోట్లను మార్చుతుండగా వారిని పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి...విజయవాడ నగరం భవానీపురం దర్గా ప్రాంతంలో నివాసం ఉండే మహ్మద్ ఖాసిం ఏసీ మెకానిక్గా పని చేస్తున్నాడు. కరకట్ట ప్రాంతంలో ఉంటున్న మహ్మద్ రూబుల్లా అలియాస్ బడే ఆటోడ్రైవర్గా పని చేస్తాడు. గొల్లపూడి హరిజనవాడలో ఉండే కన్నా శ్రీనివాసరావు ప్రైవేటు పాఠశాలలో వాచ్మెన్గా పని చేస్తున్నాడు. మహ్మద్ ఖాసిం గతంలో సౌదీ, సూడాన్, లిబియాలో కొన్నేళ్ల పాటు పని చేసి వచ్చి వివాహం చేసుకుని నేడు ఏలూరురోడ్డులోని ఏసీలు విక్రయించే దుకాణంలో పని చేస్తున్నాడు. ఆ ముగ్గురు కలిసి.. అసలు నోట్లను స్కానింగ్ చేసి కలర్ ప్రింట్లు తీసి వాటిని మార్చి సొమ్ము చేసుకోవాలని భావించారు. అందుకు ఖాసిం తాను పని చేసే దుకాణాన్ని వేదికగా చేసుకున్నాడు. అక్కడ నోట్లను స్కానింగ్ చేసి ప్రింట్లు తీశాడు. వృద్ధులు, మధ్య వయసు మహిళలు ఉండే దుకాణాల్లో వాటిని మార్చాలని నిర్ణయించుకున్నారు. అలాగే రాత్రి వేళల్లో రోడ్లపై సంచరిస్తూ నోట్లను మారుస్తున్నారు. ఈ క్రమంలో భవానీపురం అవుట్ ఏజెన్సీ వద్ద దుకాణం నిర్వహిస్తున్న విజయలక్ష్మి(45) వద్దకు గురువారం తెల్లవారుజామున వెళ్లారు. ఆమెకు రూ.500 నోటు ఇచ్చి శీతలపానియాలు, సిగిరెట్లు తీసుకున్నారు. ఆమె వద్ద చిల్లర లేకపోవటంతో రూ.500 నోటును సమీపంలోని పెట్రోలు బంకు వద్దకు ఆమె తీసుకువెళ్లి ఇచ్చి చిల్లర అడిగింది. వారు పరిశీలించి ఇది దొంగ నోటని చెప్పారు. దీనితో స్థానికుల సాయంతో ముగ్గురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారి వద్ద నుంచి 6 కలర్ జెరాక్స్ రూ.500లు నోట్లు, రెండు రూ.100 నోట్లు, ఒక ప్రింటర్ను స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించిన అసలు నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
మరికొందరి పాత్రపై అనుమానం..: ఈ నోట్లను మార్చడంలో మరికొందరి పాత్ర ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ ముగ్గురి వెనుక ఎవరైనా ఉన్నారా..? నిజంగా వాటిని వారే తయారు చేశారా..? అనేది తెలియాల్సి ఉంది. ఖాసిం పని చేసే దుకాణం యజమానిని కేసులో చేర్చకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. భవానీపురం సీఐ మోహన్రెడ్డి మాట్లాడుతూ కేసును దర్యాప్తు చేస్తున్నామని, దానిలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం