Playing Cards: పేకాడదాం రండి..!
సాధారణంగా పెళ్లిళ్లు, ఇతర శుభాకార్యాలకు ఆహ్వాన పత్రికలను పంపిస్తుంటారు. చూడగానే ఆకట్టుకునేలా సిద్ధం చేసిన కార్డులను పంపించి పేకాట ఆడేందుకు రావాలని గుత్తా సుమన్కుమార్ ఆహ్వానించేవాడని సైబరాబాద్ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయ్యింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులకు ఆహ్వాన కార్డులు
ఈనాడు, హైదరాబాద్
సాధారణంగా పెళ్లిళ్లు, ఇతర శుభాకార్యాలకు ఆహ్వాన పత్రికలను పంపిస్తుంటారు. చూడగానే ఆకట్టుకునేలా సిద్ధం చేసిన కార్డులను పంపించి పేకాట ఆడేందుకు రావాలని గుత్తా సుమన్కుమార్ ఆహ్వానించేవాడని సైబరాబాద్ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయ్యింది. రంగు రంగుల విద్యుద్దీపాలు.. ఖరీదైన మద్యం.. అధునాతన సౌండ్ సిస్టం.. సహాయకులుగా అమ్మాయిలను ఏర్పాటు చేసేవాడని గుర్తించారు. ఆర్థిక స్థితి ఆధారంగా కస్టమర్లను ప్రత్యేక కేటగిరీలుగా విభజించి క్యాంప్లను నిర్వహించేవాడని తేలింది. అక్కడి ఏర్పాట్లకు అనుగుణంగా ప్రవేశ రుసుం రూ.25వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసేవాడని వెల్లడయ్యింది.
ఆర్థిక స్థితి ఆధారంగా కేటగిరీలు..
గండిపేట మండలం మంచిరేవులలో ఫాంహౌజ్లో ఆదివారం పేకాటాడుతూ 30 మంది పోలీసులకు చిక్కిన సంగతి విదితమే. ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖులుండటం కలకలం రేపింది. విజయవాడకు చెందిన గుత్తా సుమన్కుమార్ ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. ఇతని లీలలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ‘రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖులతో నిత్యం టచ్లో ఉండేవాడు. విదేశాల్లోని పలు క్యాసినోల నిర్వాహకులతో సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. అక్కడి అనుభవంతోనే ఇక్కడ రెస్టారెంట్లను అద్దెకు తీసుకుని క్యాసినోలు నిర్వహించాడు. విజయవాడ మామిడితోటల నుంచి కొలంబో వరకు అతని ప్రయాణం సాగింది. సుమన్ బాధితుల్లో పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు’ అని ఓ పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు.
రెండ్రోజుల కస్టడీకి అనుమతి...
గుత్తా సుమన్కుమార్ మినహా మిగిలిన 29 మందికి మంగళవారం రాజేంద్రనగర్ ఉప్పర్పల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సుమన్ను ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు రెండ్రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. చర్లపల్లి జైలు నుంచి బుధవారం కస్టడీలోకి తీసుకోనున్నారు. లీజు దస్తావేజులతో రావాలని సూచించినా టాలీవుడ్ హీరో నాగశౌర్య తండ్రి మంగళవారం కూడా హాజరుకాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్