పాతకక్షలే ప్రాణం తీశాయ్
పాతకక్షల కారణంగానే మండలంలోని ఆరికతోటకు చెందిన వర్రి చిన్నోడు హత్యకు గురయ్యాడని పోలీసులు తేల్చారు. డీఎస్పీ మోహన్రావు వివరాల ప్రకారం.. 2021 సెప్టెంబరులో యువతి విషయంలో స్థానికంగా ఉంటున్న ఓ కులస్థుల మధ్య తగాదా జరిగి,
హత్య కేసులో ఐదుగురి అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ మోహన్రావు
రామభద్రపుర, న్యూస్టుడే: పాతకక్షల కారణంగానే మండలంలోని ఆరికతోటకు చెందిన వర్రి చిన్నోడు హత్యకు గురయ్యాడని పోలీసులు తేల్చారు. డీఎస్పీ మోహన్రావు వివరాల ప్రకారం.. 2021 సెప్టెంబరులో యువతి విషయంలో స్థానికంగా ఉంటున్న ఓ కులస్థుల మధ్య తగాదా జరిగి, రెండు వర్గాలుగా విడిపోయారు. ఆ ఘర్షణలో చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి పగతో చివరికి హత్య చేయడానికి కూడా వెనకాడలేదు. ఈనెల 1న రాత్రి వర్రి చిన్నోడు ఇంటి నుంచి పనిమీద బయటికి వచ్చిన సమయంలో ప్రధాన రహదారిపై ఐదుగురు వ్యక్తులు కత్తులు, ఇనుప రాడ్లు, సుత్తులతో దాడిచేసి.. చనిపోయేంత వరకు కొట్టి, పరారయ్యారు. ఆరికతోట గ్రామానికి చెందిన వర్రి శివుడు ఆదివారం కత్తితో లొంగిపోయాడు. మిగిలిన నలుగురు వర్రి బాల, కర్రి శంకరరావు, కర్రి శ్రీను, కర్రి మహేష్ను పోలీసులు సోమవారం పట్టుకున్నారు. తామే హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు. ఈమేరకు వారిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నాలుగు రోజుల్లో కేసును ఛేదించిన సిబ్బందిని ఆయన అభినందించారు. సీఐ శోభన్బాబు, ఎస్సై కృష్ణమూర్తి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పల్నాడు జిల్లాలో వైకాపా దౌర్జన్యం.. తెదేపా కార్యకర్తలపై రాళ్ల దాడి
హోం ఓటింగ్ విషయంలో పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలో వైకాపా వర్గీయులు రెచ్చిపోయారు. -
డబ్బు కోసం జూనియర్పై సీనియర్ల దాష్టీకం
తీసుకున్న డబ్బు తిరిగివ్వలేదనే కారణంతో ఓ యువకుడిపై అతడి సీనియర్లు విచక్షణా రహితంగా దాడి చేశారు. -
‘జే బ్రాండ్’ మద్యం తాగి వృద్ధుడి మృతి
జే బ్రాండ్ మద్యం తాగి వృద్ధుడు మృతిచెందిన ఘటన వైఎస్సాఆర్ జిల్లాలోని మూలవంకలో మంగళవారం చోటుచేసుకుంది. -
హైదరాబాద్లో విషాదం.. బాచుపల్లిలో గోడకూలి ఏడుగురి మృతి
హైదరాబాద్లో విషాదం చోటుచేసుకుంది. గోడకూలి ఏడుగురు మృతిచెందారు. మంగళవారం సాయంత్రం రేణుక ఎల్లమ్మ కాలనీలో వర్షానికి గోడ కూలింది. -
ప్రైవేటు బస్సు బోల్తా.. పది మందికి గాయాలు
మహబూబ్నగర్ జిల్లాలో బుధవారం ఉదయం ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. -
అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల్లో.. అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. -
వడదెబ్బతో ఆరుగురి మృతి
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆయా జిల్లాల్లో ఆరుగురు మృత్యువాతపడ్డారు. -
చేతులూకాళ్లూ కట్టేసి.. సిగరెట్లతో భర్తకు వాతలు
‘‘నా భార్య మత్తుపదార్థాలు తీసుకొని రోజూ అర్ధరాత్రి వేళల్లో నన్ను హింసిస్తోంది. సిగరెట్లతో వాతలు పెడుతోంది. -
సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల కేసులో మరో నిందితుడి అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
ఐఎఫ్ఎస్ తుది ఫలితాలు వచ్చేశాయ్.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
-
ఆస్ట్రేలియాలో చదువు.. బ్యాంకు బ్యాలెన్స్ రూ.16 లక్షలు ఉండాల్సిందే!
-
రెండు రోజులపాటు తెలంగాణలో వర్షాలు