Drugs Case: మాదక ద్రవ్యాల గుప్పిట సినీ తారలు!
మత్తు మాఫియా ప్రధాన సూత్రధారులను హైదరాబాద్ పోలీసులు వరుసగా అరెస్ట్ చేస్తున్నారు. స్మగ్లర్లు, పెడ్లర్ల నుంచి కీలక సమాచారం రాబడుతున్నారు.
మత్తు మాఫియా ఫోన్లలో ప్రముఖుల చిట్టా
స్మగ్లింగ్ డాన్ ఎడ్విన్ ముఠా వరుస అరెస్ట్లతో వెలుగులోకి
ఈనాడు, హైదరాబాద్: మత్తు మాఫియా ప్రధాన సూత్రధారులను హైదరాబాద్ పోలీసులు వరుసగా అరెస్ట్ చేస్తున్నారు. స్మగ్లర్లు, పెడ్లర్ల నుంచి కీలక సమాచారం రాబడుతున్నారు. డ్రగ్స్ వినియోగిస్తున్న, విక్రయిస్తున్న వారిలో నగర వ్యాపారులతోపాటు బాలీవుడ్, టాలీవుడ్ సినీతారలు ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. మరిన్ని వివరాలు సేకరించాక నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నారు. హైదరాబాద్ నార్కోటిక్స్ (హెచ్న్యూ) ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఏర్పాటయ్యాక నగరానికి చేరుతున్న మాదకద్రవ్యాల మార్గాలపై నిఘా ఉంచారు. గోవా కేంద్రంగా జాతీయ, అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలున్న కీలక సూత్రధారులు 18 మందిని గుర్తించారు. వీరిలో ప్రీతీష్ నారాయణ్ బోర్కర్, జాన్ స్టీఫెన్ డిసౌజా, తుకారాం, ఎడ్విన్న్యూన్స్, బాలమురుగన్, హేమంత్ అగర్వాల్, వికాస్నాయక్, సంజ గోవెకర్, రమేష్చౌహాన్ వంటి డ్రగ్ కింగ్పిన్లను అరెస్ట్ చేశారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నారు. ఇప్పటివరకు అరెస్టయిన నిందితుల సెల్ఫోన్లలో సుమారు 7,000-8,000 మంది డ్రగ్స్ వినియోగిస్తున్న వారి వివరాలున్నట్టు గుర్తించారు. వీరిలో 400 మందికి 41ఎ సీఆర్పీసీ నోటీసులు జారీచేశారు.
ఎడ్విన్ అనుచరులే అధికం
గోవా డ్రగ్ కింగ్పిన్ ఎడ్విన్న్యూన్స్ నుంచి తాజాగా అరెస్టయిన హైదరాబాద్ డీజే మోహిత్ అగర్వాల్ అలియాస్ మైరాన్ మోహిత్ వరకూ ఎక్కువమంది పబ్లు, హోటళ్లలో సర్వర్లుగానే కెరీర్ ప్రారంభించటం గమనార్హం. జీరో నుంచి హీరోగా ఎదగాలనే ఉద్దేశంతో వీరంతా క్రమంగా మత్తుపదార్థాల దందా వైపు అడుగులు వేశారు. మొదట ఏజెంట్లుగా మారారు. క్రమంగా డ్రగ్ మాఫియాతో సంబంధాలు పెంచుకొని మత్తు సామ్రాజ్యాన్ని స్థాపించి.. జాతీయ, అంతర్జాతీయంగా మాదకద్రవ్యాలు సరఫరా చేసే స్థాయికి ఎదిగారు. ఖరీదైన భవనాల్లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారంటే డ్రగ్స్ దందాతో ఎంతగా దోచుకున్నారనేది అర్థం చేసుకోవచ్చని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఎడ్విన్న్యూన్స్ ఒకప్పుడు గోవాలో హోటల్ సర్వర్. ఇప్పుడు అతడికి గోవా, ముంబయి నగరాల్లో కోట్లాది రూపాయల ఆస్తిపాస్తులున్నాయి. సినీ నిర్మాతలకు ఫైనాన్స్ చేసే స్థాయికి ఎదిగాడు. ఇతడి ప్రధాన అనుచరుల్లో తమిళనాడుకు చెందిన బాలమురుగన్ కీలకమైన వ్యక్తి. హిమాచల్ప్రదేశ్ను అడ్డాగా మార్చుకొని రాజస్థాన్, మహారాష్ట్ర, హైదరాబాద్లోని పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లకు డ్రగ్స్ సరఫరా చేసేవాడు. తమిళనాడులో మత్తుకు అలవాటుపడిన ప్రముఖులకు నమ్మకమైన వ్యక్తి. ఇతడి ద్వారానే పలువురు ఖరీదైన ఛరస్ను కొనుగోలు చేసేవారని పోలీసులు గుర్తించారు. మోహిత్ అగర్వాల్ మొదట్లో కవాడిగూడలో ఉండేవాడు. పబ్లో సర్వర్గా చేరి డ్రగ్స్ కోసం గోవా వెళ్లినప్పుడు ఎడ్విన్తో ఏర్పడిన పరిచయంతో డ్రగ్ డాన్గా ఎదిగాడు. బాలీవుడ్ నటి నేహా దేశ్పాండేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. డీజేగా గుర్తింపు వచ్చాక ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను స్థాపించాడు. అంతర్జాతీయంగా 100 మంది డీజేలను దేశానికి రప్పించి ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి చేరాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
NEET exam: నీట్ పరీక్షలో ఓ టీచర్ అవకతవకలకు పాల్పడ్డాడు. అభ్యర్థులకు బదులు పరీక్ష రాసేందుకు వారితో రూ.10లక్షల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నాడు. -
ఈత సరదా మిగిల్చిన విషాదం
వేసవి సెలవుల్లో సరదాగా ఈత కోసం వెళ్లిన ముగ్గురు బాలురు ప్రమాదవశాత్తు మున్నేరులో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని గుదిమళ్ల సమీపంలో గురువారం చోటుచేసుకుంది. -
ఉద్యోగాల క్రమబద్ధీకరణ పేరుతో లంచాలు
తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెబుతూ లంచాలు వసూలు చేయడంపై హైదరాబాద్ సీబీఐ విభాగం తపాలాశాఖ ఉద్యోగులపై కేసు నమోదు చేసింది. -
బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు
బాణసంచా పరిశ్రమలో చోటుచేసుకున్న భారీ పేలుడు ధాటికి 10 మంది మృత్యువాత పడ్డారు. మరో 11 మంది గాయపడ్డారు. -
లారీ క్యాబిన్ ప్రత్యేక అరలో రూ.8.36 కోట్లు
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్టు వద్ద జాతీయ రహదారిపై పైపుల లారీలో తరలిస్తున్న రూ.8.36 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
సజ్జల భార్గవ్రెడ్డిపై సీఐడీ కేసు నమోదు
వైకాపా సామాజిక మాధ్యమ విభాగం ఇన్ఛార్జి సజ్జల భార్గవ్రెడ్డిపై సీఐడీ గురువారం కేసు నమోదు చేసింది. 171-ఎఫ్, 171-జీ, 505(2) రెడ్విత్ 120-బీ సెక్షన్ల కింద కేసు పెట్టింది. -
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
కదులుతున్న మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై 28 ఏళ్ల వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. తనకు ఎదురైన ఘటనపై బాలుడు ఎక్స్ వేదికగా పోస్టులు చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం