Andhra News: వాగులో దూకి నిందితుడి పరారీ.. పోలీసులు గాలించినా లభించని ఆచూకీ
పోలీసుల నుంచి తప్పించుకున్న నిందితుడు నదిలో దూకాడు. 24గంటలు దాటినా అతని ఆచూకీ తెలియకపోవడంతో గల్లంతయ్యాడా.. లేక పారిపోయాడా తెలియక పోలీసులు హైరానా పడుతున్నారు.
సంగం, న్యూస్టుడే: పోలీసుల నుంచి తప్పించుకున్న నిందితుడు నదిలో దూకాడు. 24గంటలు దాటినా అతని ఆచూకీ తెలియకపోవడంతో గల్లంతయ్యాడా.. లేక పారిపోయాడా తెలియక పోలీసులు హైరానా పడుతున్నారు. ఈ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగంలో జరిగింది. ఒంటరి మహిళల బంగారు ఆభరణాలను దోచుకుంటున్నారని నెల్లూరు గ్రామీణ మండలంలోని ఉప్పుటూరుకు చెందిన ఎ.గిరి, మరొకరిని ఆదివారం సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా వీరిని బుధవారం రాత్రి ఏఎస్ పేటకు తీసుకెళ్లారు. తిరిగి నెల్లూరు వస్తుండగా నిందితుడు గిరి పారిపోయేందుకు పథకం వేశాడు. తనతో కలసి నేరాలకు పాల్పడే మరో వ్యక్తి, సంగంలోని కొండ ప్రాంతంలో ఉంటాడని పోలీసులను నమ్మించాడు. అతన్నీ పట్టుకోవచ్చని వాహనాన్ని అటు మళ్లించారు. వాహనం ఆత్మకూరు వెళ్లే మార్గంలో బీరాపేరు వాగు పెన్నా నదిలో కలిసే ప్రాంతానికి వెళ్లగానే పోలీసులను మాటల్లో పెట్టి వాహనం నెమ్మదిగా వెళ్లేలా చేశాడు. ఈ క్రమంలో తోటి నిందితుడితో కలిసి వేసిన సంకెళ్లను తొలగించుకొని వాహనంలోంచి కిందికి దూకాడు. పోలీసులు తేరుకునే సరికి పక్కనే ఉన్న బీరాపేరు వాగులోకి వెళ్లాడు. పోలీసులు వెంటపడే సరికి వాగులో లోతుకు వెళ్లి కనిపించలేదు. స్థానికుల సాయంతో గాలించినా జాడ దొరకలేదు. గురువారం గజ ఈతగాళ్లతోనూ వెదికించారు. పరారయ్యాడా లేక నదిలో గల్లంతయ్యాడా అనేది పోలీసులకు అంతుపట్టడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈత సరదా మిగిల్చిన విషాదం
వేసవి సెలవుల్లో సరదాగా ఈత కోసం వెళ్లిన ముగ్గురు బాలురు ప్రమాదవశాత్తు మున్నేరులో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని గుదిమళ్ల సమీపంలో గురువారం చోటుచేసుకుంది. -
ఉద్యోగాల క్రమబద్ధీకరణ పేరుతో లంచాలు
తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెబుతూ లంచాలు వసూలు చేయడంపై హైదరాబాద్ సీబీఐ విభాగం తపాలాశాఖ ఉద్యోగులపై కేసు నమోదు చేసింది. -
బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు
బాణసంచా పరిశ్రమలో చోటుచేసుకున్న భారీ పేలుడు ధాటికి 10 మంది మృత్యువాత పడ్డారు. మరో 11 మంది గాయపడ్డారు. -
లారీ క్యాబిన్ ప్రత్యేక అరలో రూ.8.36 కోట్లు
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్టు వద్ద జాతీయ రహదారిపై పైపుల లారీలో తరలిస్తున్న రూ.8.36 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
సజ్జల భార్గవ్రెడ్డిపై సీఐడీ కేసు నమోదు
వైకాపా సామాజిక మాధ్యమ విభాగం ఇన్ఛార్జి సజ్జల భార్గవ్రెడ్డిపై సీఐడీ గురువారం కేసు నమోదు చేసింది. 171-ఎఫ్, 171-జీ, 505(2) రెడ్విత్ 120-బీ సెక్షన్ల కింద కేసు పెట్టింది. -
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
కదులుతున్న మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై 28 ఏళ్ల వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. తనకు ఎదురైన ఘటనపై బాలుడు ఎక్స్ వేదికగా పోస్టులు చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
-
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
-
ఇరాన్ అదుపులో నౌక.. ఎట్టకేలకు భారత నావికుల్లో ఐదుగురికి విముక్తి
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..
-
వ్యభిచారం చేయడానికి వచ్చావా? పోలీసులకు పట్టిస్తాం