Eluru: మాతృమూర్తే శత్రువైంది.. కన్నబిడ్డలను రెండో భర్త పరం చేసిన మహిళ
మాతృత్వానికి మచ్చతెచ్చేలా ఓ కన్నతల్లి అత్యంత దారుణంగా వ్యవహరించింది. వయసొచ్చిన తన కుమార్తెలను రెండో భర్త పరం చేసింది.
ఏలూరు నేరవార్తలు, న్యూస్టుడే: మాతృత్వానికి మచ్చతెచ్చేలా ఓ కన్నతల్లి అత్యంత దారుణంగా వ్యవహరించింది. వయసొచ్చిన తన కుమార్తెలను రెండో భర్త పరం చేసింది. ఈ అమానవీయ ఘటన ఏలూరు జిల్లా పెదపాడు మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. కుమార్తెల ఫిర్యాదుతో దిశ పోలీసులు గురువారం తల్లిని, ఆమె రెండో భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళకు భర్త, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆమె కు.ని. శస్త్రచికిత్స చేయించుకుంది. 2007లో ఆమె భర్త అనారోగ్యంతో మృతిచెందారు. తర్వాత మేనత్త కొడుకును రెండోపెళ్లి చేసుకుంది. తనకు పిల్లలు కావాలని, లేదంటే మరో పెళ్లి చేసుకుంటానని అతడు బెదిరించేవాడు. కొన్నేళ్లకు.. ఆడపిల్లలిద్దరూ యుక్తవయసుకు వచ్చారు. వేరే పెళ్లి వద్దని, తన కుమార్తెలతోనే పిల్లల్ని కనాలని తన రెండో భర్తను ఆమె ఒప్పించింది. 17 ఏళ్ల పెద్ద కుమార్తె 2017లో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తర్వాత మగ పిల్లవాడి కోసం తన రెండో కుమార్తెనూ భర్తకు అప్పగించింది. ఆమెకు ఏడాది క్రితం మగశిశువు పుట్టి చనిపోయాడు. ఆ మృతదేహాన్ని కాలువలో పడేశారు. ఇటీవల భర్తతో విభేదాలతో.. కుమార్తెలను గ్రామంలోనే వదిలేసి విశాఖలోని పుట్టింటికి వెళ్లిపోయింది. చిన్న కుమార్తె తనకు పరిచయమైన యువకుడికి ఇదంతా చెప్పడంతో.. అతడు పిల్లల మేనమామకు తెలిపాడు. బంధువులంతా ఏలూరు వచ్చి బాధితులతో దిశ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయించారు. దిశ సీఐ ఇంద్రకుమార్ ఆధ్వర్యంలో నిందితులపై పోక్సో కేసు నమోదుచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాచుపల్లిలో గోడ కూలిన ఘటన.. ఆరుగురి అరెస్టు
నగర శివారు బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో గోడ కూలి ఏడుగురు మృతి చెందిన ఘటనలో అధికారులు చర్యలు చేపట్టారు. -
ప్రియురాలితో ఫోన్లో మాట్లాడుతూ ఆత్మహత్య
ప్రేమించిన యువతితో గొడవపడిన ఓ యువకుడు ఆమెతోనే ఫోన్ మాట్లాడుతూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. -
పోలింగ్ బూత్ నుంచి ఇన్స్టా లైవ్.. బోగస్ ఓటింగ్కు పాల్పడ్డాడంటూ అరెస్టు చేసిన పోలీసులు
గుజరాత్లోని దాహోద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఓ పోలింగ్ కేంద్రం లోపల నుంచి వీడియోను ప్రత్యక్ష ప్రసారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు స్థానిక భాజపా నాయకుడి కుమారుడైన విజయ్ భాభోర్.. పోలింగ్ కేంద్ర లోపల నుంచి ఇన్స్టా లైవ్ చేసి ప్రజాస్వామ్యాన్ని అవమానించారంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. -
కేరళలో ఏనుగు దాడి.. కెమెరామన్ దుర్మరణం
కేరళలో గుంపు నుంచి తప్పిపోయిన అడవి ఏనుగు దాడిలో ఎ.వి.ముకేశ్ (34) అనే యువకుడు తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ప్రముఖ న్యూస్ ఛానల్ ‘మాతృభూమి’ కెమెరామన్గా, కాలమిస్ట్గా పనిచేస్తున్న ముకేశ్ రిపోర్టరుతో కలిసి మలమ్పుఝా - కంజికోడ్ మార్గంలో నదిని దాటే ఏనుగుల గుంపు దృశ్యాల చిత్రీకరణకు వెళ్లాడు. -
అత్యాచారం కేసు నిందితుడు 40 ఏళ్ల తర్వాత దొరికాడు
అత్యాచారం కేసులో పరారీలో ఉన్న నిందితుడిని 40 ఏళ్ల తర్వాత అరెస్టు చేసిన ముంబయి పోలీసులు మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. ముంబయికి చెందిన పాపా అలియాస్ దావూద్ 1984లో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. -
ఈవీఎంలలో చిప్ మారుస్తా.. మిమ్మల్ని గెలిపిస్తా
డబ్బులిస్తే ఈవీఎంలలో చిప్ను మార్చి ఎక్కువ ఓట్లు పడేలా చేస్తానని మోసగించేందుకు యత్నించిన ఓ జవానును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
శాంపిట్రోడా వ్యాఖ్యలను ఖండించిన చంద్రబాబు
-
సందేశ్ఖాలీ ఘటనలో కీలక మలుపు.. టీఎంసీ నేతలపై కేసు వెనక్కి
-
ముంబయి ఇండియన్స్లో హార్దిక్పై అసంతృప్తి..!
-
టోల్ ఛార్జీలను తప్పించుకునేందుకు.. సీఎం కాన్వాయ్ను ఫాలో అయి..
-
ఆ విధ్వంసమేంటి? ఫస్ట్ బ్యాటింగ్ చేసుంటే ‘300’ కొట్టేవాళ్లేమో: సచిన్
-
బాచుపల్లిలో గోడ కూలిన ఘటన.. ఆరుగురి అరెస్టు