Eluru: మాతృమూర్తే శత్రువైంది.. కన్నబిడ్డలను రెండో భర్త పరం చేసిన మహిళ

మాతృత్వానికి మచ్చతెచ్చేలా ఓ కన్నతల్లి అత్యంత దారుణంగా వ్యవహరించింది. వయసొచ్చిన తన కుమార్తెలను రెండో భర్త పరం చేసింది.

Updated : 14 Jul 2023 18:14 IST

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: మాతృత్వానికి మచ్చతెచ్చేలా ఓ కన్నతల్లి అత్యంత దారుణంగా వ్యవహరించింది. వయసొచ్చిన తన కుమార్తెలను రెండో భర్త పరం చేసింది. ఈ అమానవీయ ఘటన ఏలూరు జిల్లా పెదపాడు మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. కుమార్తెల ఫిర్యాదుతో దిశ పోలీసులు గురువారం తల్లిని, ఆమె రెండో భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళకు భర్త, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆమె కు.ని. శస్త్రచికిత్స చేయించుకుంది. 2007లో ఆమె భర్త అనారోగ్యంతో మృతిచెందారు. తర్వాత మేనత్త కొడుకును రెండోపెళ్లి చేసుకుంది. తనకు పిల్లలు కావాలని, లేదంటే మరో పెళ్లి చేసుకుంటానని అతడు బెదిరించేవాడు. కొన్నేళ్లకు.. ఆడపిల్లలిద్దరూ యుక్తవయసుకు వచ్చారు. వేరే పెళ్లి వద్దని, తన కుమార్తెలతోనే పిల్లల్ని కనాలని తన రెండో భర్తను ఆమె ఒప్పించింది. 17 ఏళ్ల పెద్ద కుమార్తె 2017లో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తర్వాత మగ పిల్లవాడి కోసం తన రెండో కుమార్తెనూ భర్తకు అప్పగించింది. ఆమెకు ఏడాది క్రితం మగశిశువు పుట్టి చనిపోయాడు. ఆ మృతదేహాన్ని కాలువలో పడేశారు. ఇటీవల భర్తతో విభేదాలతో.. కుమార్తెలను గ్రామంలోనే వదిలేసి విశాఖలోని పుట్టింటికి వెళ్లిపోయింది. చిన్న కుమార్తె తనకు పరిచయమైన యువకుడికి ఇదంతా చెప్పడంతో.. అతడు పిల్లల మేనమామకు తెలిపాడు. బంధువులంతా ఏలూరు వచ్చి బాధితులతో దిశ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. దిశ సీఐ ఇంద్రకుమార్‌ ఆధ్వర్యంలో నిందితులపై పోక్సో కేసు నమోదుచేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని