ఆ ‘గోవా’ మద్యం తాగితే ప్రాణాలు పోవడం తథ్యం
ఎన్నికల వేళ రాష్ట్రంలోని ఓ ప్రధాన రాజకీయ పార్టీ ఉచితంగా పోస్తున్న మద్యం తాగుతున్నారా? అది మద్యం కాదు.. మీ ప్రాణాలు తోడేసే విషం. గోవా బ్రాండ్ల పేరుతో ఆ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల పెద్ద ఎత్తున కల్తీ మద్యాన్ని పంచుతోంది. అత్యంత హానికర రసాయనాలతో తయారైన సరకు తాగితే ప్రాణాలు పోవటం తథ్యమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
విషపూరిత సరకుతో పొంచి ఉన్న పెనుముప్పు
అత్యంత హానికర రసాయనాలతో తయారీ
కల్తీ మద్యం పంచుతున్న ఓ ప్రధాన పార్టీ
ఈనాడు, అమరావతి: ఎన్నికల వేళ రాష్ట్రంలోని ఓ ప్రధాన రాజకీయ పార్టీ ఉచితంగా పోస్తున్న మద్యం తాగుతున్నారా? అది మద్యం కాదు.. మీ ప్రాణాలు తోడేసే విషం. గోవా బ్రాండ్ల పేరుతో ఆ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల పెద్ద ఎత్తున కల్తీ మద్యాన్ని పంచుతోంది. అత్యంత హానికర రసాయనాలతో తయారైన సరకు తాగితే ప్రాణాలు పోవటం తథ్యమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రెండు, మూడు రోజులపాటు ఈ మద్యం తాగితే కీలక అవయవాలన్నీ దెబ్బతినటం ఖాయమని చెబుతున్నారు. దీని మత్తులో ఉంటే ఒక్కసారిగా శ్వాసక్రియ నిలిచి ఆకస్మికంగా రక్త ప్రసరణ ఆగిపోయే ముప్పుందని పేర్కొంటున్నారు. అయినప్పటికీ పెనుముప్పు ఎదుర్కొనేలోగా మాకు ఓటేయండి అనేలా పార్టీ నాయకులు కల్తీ మద్యాన్ని యథేచ్ఛగా పంచుతున్నారు. అతి తక్కువ ఖర్చుతో తయారయ్యే అత్యంత ప్రమాదకరమైన మద్యాన్ని పోస్తూ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ఆ పార్టీ ఇదే తరహాలో కల్తీ మద్యాన్ని పంచుతూ పలువురి ప్రాణాలను బలిగొంది. ఇప్పుడూ మళ్లీ అదే విషపు చుక్కలను పంచుతోంది. ఈ మద్యం రెండు, మూడు క్వార్టర్లు తాగితే ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే.
అర్థమయ్యేలోపే అవయవాలపై తీవ్ర ప్రభావం
ఆంధ్రప్రదేశ్లో అమ్ముతున్న జే బ్రాండ్లే ప్రమాదకరం కాగా.. ప్రధాన పార్టీ ఇప్పుడు గోవా బ్రాండ్ల పేరిట పంచుతున్న మద్యం మరింత హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కల్తీ మద్యం తయారీలో ఆరితేరిన ముఠా ఆఫ్రికా దేశాల తరహాలో అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన కల్తీ మద్యాన్ని గోవాలోని డిస్టిలరీల్లో తయారు చేయిస్తోంది. ఆ సరకును సీసాల్లో నింపి అచ్చం అసలైనదేనని నమ్మించేలా నకిలీ లేబుళ్లు, హోలోగ్రామ్లు అతికించి సీళ్లు వేయించింది. దాన్నే గోవా మద్యమంటూ ఓటర్లకు పంచుతోంది. ఇది తాగితే ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
‘తాగితే ఒళ్లంతా సూదులతో గుచ్చినట్లుంటుంది. శ్వాసలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. కళ్లు ఎరుపెక్కుతాయి. జీర్ణం కాదు. శరీరం మెలికలు తిరుగుతుంది. ఒక్కోసారి మూర్చతో పడిపోతారు. అసలేమవుతుందో అర్థం చేసుకునేలోపే అవయవాలపై తీవ్ర ప్రభావం పడుతుంది’ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలేయం, క్లోమ గ్రంథి (పాంక్రియాస్) దెబ్బతింటాయని చెబుతున్నారు.
2014లో పలువురి ప్రాణాలు బలిగొన్న పార్టీ
2014 ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఇదే తరహాలో కల్తీ మద్యం తయారుచేసి ఓటర్లకు పంచింది. అప్పట్లో అది తాగి 8 మంది చనిపోయారు. బాధిత కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కనీసం వారిని ఆదుకునే దిక్కు లేదు. ఈ వ్యవహారంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై కేసులున్నాయి. అప్పట్లో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల పరిధిలో కల్తీ మద్యం పంచిన ఆ పార్టీ.. ఈసారి రాష్ట్రంలో చాలా చోట్ల విస్తారంగా పంచుతోంది. ఇప్పటికైనా ఎన్నికల సంఘం, పోలీసులు మేల్కొని సరకు పంపిణీ అడ్డుకోకపోతే వందల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.
తాళిబొట్లు తెంచేసే విషాన్ని మహిళలే అడ్డుకోవాలి
ఓట్ల కోసం ప్రలోభాలకు తెరలేపిన రాజకీయ పార్టీ గ్రామగ్రామానికీ భారీగా గోవా మద్యం పంపుతోంది. వ్యసనపరులందరికీ అందజేస్తోంది. రాబోయే 2, 3 రోజుల్లో దీన్ని మరింత పెంచనుంది. వీటిని ఎక్కడికక్కడ మహిళలే అడ్డుకోవాల్సి ఉంది. లేకపోతే ఈ మద్యమే వారి తాళిబొట్లు తెంచే విషమవుతుంది.
గోవా మద్యం తాగాక.. ఊపిరాడక అల్లాడిపోయా
‘రెండు రోజుల పాటు ఓ ప్రధాన పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా. గోవా బ్రాండ్ల పేరిట వారిచ్చిన మద్యం తాగాక 20 నిమిషాల్లో ఆయాసం వచ్చింది. ఊపిరాడక అల్లాడిపోయా. చచ్చిపోతానేమోనన్నంత భయమేసింది. వెంట ఉన్నవాళ్లు ఆసుపత్రికి తీసుకెళ్లటంతో ప్రాణాపాయం తప్పింది. లేకుంటే ఈపాటికే ప్రాణాలు పోయుండేవి’ అని నెల్లూరుకు చెందిన ఓ నడివయస్కుడు చెప్పారు. ఈ దెబ్బకు భయపడి అసలు ఆ పార్టీ ప్రచారంవైపే కన్నెత్తి చూడడం లేదని తెలిపారు.
ప్రాణాలు ఎవరో తోడేస్తున్నట్లు అయింది..
‘జగనన్న బ్రాండ్లు నాసిరకంగా ఉన్నాయి. అవి తాగితే ఆరోగ్యం పాడవుతోంది. ఇప్పుడు నాణ్యమైన మద్యం ఇస్తారేమోనని ఓ ప్రధాన పార్టీ ప్రచారంలో పాల్గొన్నా. గోవా బ్రాండ్ల పేరుతో వారిచ్చిన మద్యం తాగిన వెంటనే కడుపులో తీవ్రమైన నొప్పి వచ్చింది. కంటిచూపు మసకబారింది. తల తిరిగింది. పేగుల్లో తిప్పేసింది. ముఖమంతా నల్లగా అయింది. శరీరంపైనే నియంత్రణ కోల్పోయా. ఎవరో ప్రాణాలు బలవంతంగా తోడేస్తున్నట్లయింది’ అని కాకినాడకు చెందిన రోజు కూలీ చెప్పారు.
చావంటే ఏంటో కళ్ల ముందు కనిపించింది..
‘ఓ రాజకీయ పార్టీ వాళ్లు ఉచితంగా గోవా మద్యం పోస్తున్నారని తాగేశా. రెండు, మూడు క్వార్టర్లు వరుసగా తాగేసరికి శరీరం బొంగరంలా తిరిగింది. నోరంతా దాహంతో పిడచకట్టుకుపోయింది. వాంతులయ్యాయి. శరీరమంతా సూదులతో గుచ్చేసినట్లయింది. చావంటే ఏంటో కళ్ల ముందు కనిపించింది. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డా’ అని ప్రకాశం జిల్లాకు చెందిన కార్మికుడు తెలిపారు. ఇలాంటి బాధితులు కోకొల్లలు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పొలాలన్నీ దున్నేశాక.. పంటనష్టం లెక్కలా!
జూన్ 1 నుంచి ఖరీఫ్ పంట కాలం కిందే లెక్క.. నైరుతి రుతుపవనాలూ వచ్చేస్తున్నాయి. అతి త్వరలోనే రాష్ట్రాన్ని కూడా తాకనున్నాయి. అంటే రైతులకు మళ్లీ పొలం పనులు మొదలైనట్లే. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు రబీ పంటనష్టం గుర్తొచ్చింది. అదీ ఈ నెల 24 లోగా పూర్తిచేయాలి. దుక్కులు దున్నించి.. మళ్లీ విత్తనం వేసేందుకు సిద్ధం చేసిన పొలాల్లో వ్యవసాయాధికారులకు ఏ పంటనష్టం కనిపిస్తుందో మరి? ఇది వైకాపా నేతలు, కార్యకర్తల కరవు తీర్చడానికా? నిజంగా నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడానికా? అనే ప్రశ్నలు అన్నదాతల్లో వ్యక్తమవుతున్నాయి. -
పోలీసులపై ప్రశ్నల పరంపర
పల్నాడు జిల్లా నరసరావుపేట, తిరుపతి జిల్లా చంద్రగిరి, అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ సందర్భంగానూ.. ఆ తర్వాత జరిగిన దమనకాండపై సిట్ అధికారులు రెండో రోజైన ఆదివారం కూడా విచారణ జరిపారు. -
బాధితుల గొంతు వినిపించడం నేరమా?
ఎన్డీయే అభ్యర్థులకు ఓటు వేశామనే అక్కసుతో తమపై వైకాపా మూకలు దాడికి తెగబడి తలలు పగలకొట్టి రక్తపాతం సృష్టించారంటూ బాధితులు చెబితే.. ఆ విషయాన్ని టీవీ ఛానళ్లలో ప్రసారం చేయడం నేరమా? వారికి జరిగిన అన్యాయాన్ని, వారి ఆవేదనను రిపోర్టింగ్ చేయడం వర్గాల మధ్య శత్రుత్వం పెంచడమా? -
విద్యార్థుల లెక్కలపై ప్రభుత్వం దొంగాట!
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయింది. ‘విద్యా కానుక’ కోసం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని బహిర్గతం చేశాయి. -
ముగ్గురు ఐపీఎస్లపై అభియోగాల నమోదు
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు బాధ్యుల్ని చేస్తూ ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన అనంతపురం, పల్నాడు ఎస్పీలు అమిత్ బర్దర్, బిందుమాధవ్ గరికపాటి, బదిలీ వేటుకు గురైన తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్పై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. -
మమ్మల్ని వెంటనే భారత్కు రప్పించండి
కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కెక్లో స్థానికులు, ఈజిప్ట్ విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న విశాఖ జిల్లా విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
ఇదీ స్ట్రాంగ్రూమే!
చిత్రంలో టార్పాలిన్ కప్పి ఉంచిన కార్యాలయ గది బాపట్ల శాసనసభ నియోజకవర్గ పోస్టల్ బ్యాలట్ పెట్టెలను భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్. -
శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్రెడ్డి, రాష్ట్ర విభజన సమయంలో యాక్టింగ్ సీజేగా పనిచేసి ఇటీవల పదవీవిరమణ పొందిన జస్టిస్ ప్రవీణ్కుమార్ ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు. -
అప్పన్న సన్నిధిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా ఆదివారం సతీసమేతంగా సింహాద్రి అప్పన్నస్వామిని దర్శించుకున్నారు. -
రూ.5 వేలకు ఓటు అమ్ముకొని సస్పెండైన మంగళగిరి ఎస్సై
ఓ పోలీసు అధికారి తన పోస్టల్ బ్యాలట్ ఓటును అమ్ముకొని.. సస్పెండయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న ఖాజాబాబుది ప్రకాశం జిల్లా కురిచేడు. -
తాడిపత్రిలో రెండోరోజు కొనసాగిన సిట్ విచారణ
అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లపై సిట్ అధికారులు రెండోరోజైన ఆదివారం కూడా విచారణ కొనసాగించారు. -
రెండు రోజుల్లో తుపానుపై స్పష్టత
బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇది ఈశాన్య దిశగా పయనించి 24 నాటికి వాయుగుండంగా బలపడనుంది. -
వైభవంగా అన్నవరం సత్యనారాయణస్వామి కల్యాణం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం ఆదివారం కనులపండువగా జరిగింది. రాత్రి 9.30 గంటలకు కల్యాణతంతు ప్రారంభించారు. -
గవి మఠం భూమి నొక్కేసిన ఉద్యోగి
కంచే చేను మేసిన చందంగా.. దేవాదాయశాఖ పరిధిలోని ఓ మఠంలో పనిచేసిన ఉద్యోగి, ఆ మఠానికి చెందిన భూమిని ఎవరికీ తెలియకుండా తన కుటుంబసభ్యుల పేరిట రికార్డుల్లో రాయించుకున్నారు. -
విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేశ్ అడ్డగింత
అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ను గన్నవరం విమానాశ్రయ భద్రతా సిబ్బంది అడ్డుకొని, గన్నవరం పోలీసులకు అప్పగించారు. -
అక్క మరణం తట్టుకోలేక ఆగిన చెల్లెలి గుండె
తనతో ఎంతో స్నేహంగా ఉండే అక్క ఇక లేదని తెలిసి మానసిక వికలాంగురాలైన చెల్లెలు తట్టుకోలేకపోయింది. మౌనంగానే రోదించి గంటల వ్యవధిలోనే తనూ కన్నుమూసింది. -
తప్పిన విద్యుత్ లెక్కలు.. ప్రజలపై రూ.250 కోట్ల భారం!
వేసవిలో విద్యుత్ డిమాండ్పై ఇంధనశాఖ లెక్కలు తారుమారయ్యాయి. ఆ కారణంగా సుమారు రూ.259 కోట్ల మేర అదనపు భారం పడనుంది. -
పులివర్తి నానిపై దాడి ఘటనలో అక్రమ అరెస్టులు
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు అక్రమ అరెస్టులు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది. -
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీవీకి మద్దతుగా 22,559 మంది సంతకాలు
జగన్ ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు, వేధింపులకు బలైపోయిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతుగా ‘ఛేంజ్.ఓఆర్జీ’లో ఉద్యమం కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..