Mulugu: కొండాయి.. గుండె పగిలింది
ఏటూరునాగారం మండలంలోని ఏజెన్సీ గ్రామమైన కొండాయిని ఊహించని వరద ముంచెత్తి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గ్రామ సమీపంలోని జంపన్నవాగు వరద ఎనిమిది మందిని బలిగొంది.
ఊహించని విపత్తుకు 8 మంది ప్రాణాలు బలి
జంపన్నవాగులో గల్లంతైన వారి మృతదేహాలు లభ్యం
ఏటూరునాగారం, న్యూస్టుడే: ఏటూరునాగారం(Eturnagaram) మండలంలోని ఏజెన్సీ గ్రామమైన కొండాయిని ఊహించని వరద ముంచెత్తి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గ్రామ సమీపంలోని జంపన్నవాగు వరద ఎనిమిది మందిని బలిగొంది. గురువారం వరదలో కొట్టుకుపోయి గల్లంతైన వారంతా విగతజీవులయ్యారు. ఊరు మునుగుతుందేమోననే భయమే వారిని మృత్యు ఒడిలోకి చేర్చింది. సురక్షిత ప్రాంతానికి వెళ్దామనుకుని నీటిలో మునిగిపోయారు. కొండాయి గ్రామానికి చెందిన మహమ్మద్ మజీద్ఖాన్ (75) ఆయన భార్య లాల్బీబీ (65), షేక్ మహబూబ్ఖాన్ (60), మహమ్మద్ షరీఫ్ (55) ఆయన కుమారుడు అజార్ (22), మహమ్మద్ రషీద్ (52), ఆయన భార్య కరీమా (42), కొండాయి గోవిందరాజులు దేవాలయ ప్రధాన పూజారి తల్లి దబ్బకట్ల సమ్మక్క (75)లు గురువారం రాత్రి గల్లంతయ్యారు. వారికోసం గ్రామస్థులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శుక్రవారం ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టగా మధ్యాహ్నానికి మృతదేహాలు లభ్యమయ్యాయి. మునుపెన్నడూ లేని విధంగా కొండాయి గ్రామాన్ని వరద చుట్టుముట్టింది. బుధవారం రాత్రి నుంచి చిన్నగా పెరిగిన వరద గురువారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఒక్కసారిగా పోటెత్తింది. గ్రామస్థులంతా ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. ఈ ఘటనలో చనిపోయినవారి ఇళ్లు పక్కపక్కనే ఉంటాయి. వరద పెరుగుతుండగా వీరు మల్యాల గ్రామానికి వెళ్లేందుకు పయనమయ్యారు. రోడ్డు వెంట నడుస్తూ రెండు ఊళ్ల మధ్యకు రాగానే హఠాత్తుగా వరద ఎక్కువై.. వారంతా గల్లంతయ్యారు.
కల్వర్టు వల్లే ప్రమాదం
కొండాయి, మల్యాల మధ్యన కొత్త కల్వర్టు నిర్మించారు. సిమెంట్ పైపులు వేసి మట్టి పోసి వదిలేశారు. డబుల్ రోడ్డు నిర్మాణంలో భాగంగా పాత కల్వర్టును తొలగించి దీన్ని నిర్మించారు. వరద తాకిడికి ఆ కల్వర్టు పూర్తిగా కొట్టుకుపోవడంతో లోతుగా ఒర్రె ఏర్పడింది. మల్యాల వైపు పయనమైన బాధితులు 8 మందీ.. రోడ్డే అనుకుని నడుస్తూ ఒక్కసారిగా ఆ ఒర్రెలో పడి.. కొట్టుకుపోయారు. గల్లంతైన వారిలో రషీద్ గజ ఈతగాడైనా వరద ఒత్తిడిని ఎదుర్కోలేక ప్రాణాలు కోల్పోయాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కర్నూలులో చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్జెండర్ల అనుమానాస్పద మృతి
జిల్లాలోని కర్నూలు మండలం గార్గేయపురం చెరువులో ముగ్గురు ట్రాన్స్జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. -
సీఎం సభకు జనసమీకరణ పేరిట ఎమ్మెల్యేకు టోకరా
పథకాల పేరు చెప్పి ప్రజాప్రతినిధులను మోసగిస్తున్న ఒక నిందితుడిని హైదరాబాద్ సైబర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ డి.కవిత తెలిపిన వివరాల ప్రకారం.. -
ఫుట్బోర్డు మీదనుంచి జారిపడి మహిళ దుర్మరణం
రద్దీ కారణంగా ఆర్టీసీ బస్సు ఫుట్బోర్డుపై నిల్చున్న ఓ మహిళ ప్రమాదవశాత్తు వెనక టైరు కిందపడి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. -
పెళ్లింట తీవ్ర విషాదం
పెళ్లి ముహూర్తం దగ్గర పడటంతో దుస్తులు కొనుగోలు చేయడానికి కుటుంబ సభ్యులందరూ అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్లారు. రోజంతా షాపింగ్ చేసి రాత్రికి తిరుగు ప్రయాణమయ్యారు. అప్పటికే అలసిపోవడంతో అందరూ నిద్రపోయారు. -
మానవ అక్రమ రవాణా.. ఆపై సైబర్ నేరాలు
విదేశాల్లో ఉద్యోగాలు.. లక్షల్లో సంపాదన అని నమ్మించి కాంబోడియాకు మనుషులను విక్రయిస్తున్న ఓ ముఠాను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. ఓ బాధితుడు తప్పించుకుని పోలీసులకు ఇచ్చిన సమాచారంతో కొందరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. -
దివ్యాంగురాలైన తల్లి.. ఇద్దరు కూతుళ్లను కడతేర్చిన కిరాతకుడు
భార్య చనిపోయిన కొద్దిరోజులకే మరో వివాహం చేసుకొని ఊరి నుంచి వెళ్లిపోవడంతో పాక్షిక అంధురాలైన తల్లే అతని ఇద్దరు కూతుళ్లను చేరదీశారు. వారిని ప్రభుత్వ విద్యాలయాల్లో చదివిస్తూ తనకొచ్చే పింఛను, రైతుబంధుతో జీవితం సాగించేవారు. -
బస్సులో 9 మంది సజీవ దహనం
హరియాణాలోని నూహ్ జిల్లా ధులావత్ గ్రామం సమీపంలో కుండ్లి-మనేసర్- పల్వాల్(కేఎంపీ) ఎక్స్ప్రెస్వేపై శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కదులుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. -
ఫోన్లోనే ట్రిపుల్ తలాక్.. నిందితుడిపై కేసు నమోదు
తన మొదటి భార్యకు ఫోన్లో ట్రిపుల్ తలాక్ చెప్పిన నిందితుడిపై ఆదిలాబాద్ మహిళా పోలీసు స్టేషన్లో శనివారం కేసు నమోదైంది.
తాజా వార్తలు (Latest News)
-
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు
-
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..