Medak: పెళ్లి బృందంపైకి కారు.. యువతి దుర్మరణం
పెళ్లికూతురిని మెట్టినింటికి పంపించాక జరిగిన గొడవలో, అక్కడున్నవారిపైకి ఓ వ్యక్తి కారు ఎక్కించాడు. ఈ ఘటనలో ఓ యువతి మృతిచెందగా, పలువురు గాయపడిన ఘటన చేగుంట మండలం రెడ్డిపల్లి కాలనీలో గురువారం రాత్రి జరిగింది.
పరారీలో కారుతోలిన యువకుడు
చేగుంట, న్యూస్టుడే: పెళ్లికూతురిని మెట్టినింటికి పంపించాక జరిగిన గొడవలో, అక్కడున్నవారిపైకి ఓ వ్యక్తి కారు ఎక్కించాడు. ఈ ఘటనలో ఓ యువతి మృతిచెందగా, పలువురు గాయపడిన ఘటన చేగుంట మండలం రెడ్డిపల్లి కాలనీలో గురువారం రాత్రి జరిగింది. స్థానిక ఎస్సై హరీశ్ తెలిపిన ప్రకారం.. రెడ్డిపల్లి వడ్డెర కాలనీకి చెందిన ఉప్పు వెంకటి కూతురు సువర్ణ వివాహం గురువారం జరిగింది. రాత్రి ఆనందంగా ఊరేగింపు నిర్వహించి ఆమెను కామారెడ్డి జిల్లా బికనూరు మండలం లక్ష్మిదేవిపల్లికి సాగనంపారు. అనంతరం ఇంటికి వస్తుండగా, అదే కాలనీకి చెందిన ఉప్పు నరేందర్, స్వామి గొడవపడ్డారు.
ఈ సమయంలో నరేందర్, స్వామిని నెట్టివేయడంతో కిందపడ్డాడు. అక్కడున్న వారు అతన్ని పక్కను తీసుకెళ్లారు. దీంతో నరేందర్ ఆగ్రహంతో తన కారు (థార్)ను తెచ్చి అక్కడ ఉన్నవారిపైకి ఎక్కించడంతో రమ్య (23), ఉప్పు దుర్గయ్య, సుజాత, యాదగిరి, సురేష్కు తీవ్ర గాయాలయ్యాయి. రమ్యను హైదరాబాద్ తరలిస్తుండగా మరణించింది. దుర్గయ్య, సుజాత, సురేష్ను నార్సింగిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. యాదగిరిని కామారెడ్డికి పంపించారు. రమ్య డిగ్రీ పూర్తి చేసింది. కారును వారిపైకి తోలుతున్న సమయంలో భీంరావుపల్లికి చెందిన యాదగిరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో పూర్తిగా ధ]్వంసం అయింది. ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డాడు. బైక్ అడ్డులేకపోతే చాలా మంది తీవ్రంగా గాయపడేవారని ఎస్సై తెలిపారు. నరేందర్ పరారీలో ఉన్నాడన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. వాహనం లోయలో పడి 18 మంది మృతి
ఛత్తీస్గఢ్(Chhattisgarh)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందారు. -
అధిక వడ్డీ ఆశచూపి రూ.200 కోట్లు మోసం.. పోలీసు స్టేషన్ వద్ద బాధితుల ఆందోళన
అబిడ్స్లోని శ్రీప్రియాంక ఎంటర్ప్రైజెస్ భారీ మోసానికి పాల్పడింది. అధిక వడ్డీ ఆశచూపి 517 మంది నుంచి రూ.200 కోట్లు మోసం చేసింది. -
చిన్నారి వైరల్ వీడియోపై విమర్శలు.. తల్లి ఆత్మహత్య
తాజాగా వైరలైన తమ చిన్నారికి సంబంధించిన వీడియోపై నెటిజన్ల విమర్శలను తట్టుకోలేని ఓ మహిళ ఆదివారం ఆత్మహత్య చేసుకున్న ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. -
బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు పట్టుబడ్డారు. ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్ హౌస్లో బర్త్ డే పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాడి చేశారు. -
ఆస్తి తగాదాను మనసులో పెట్టుకొని.. తాతను కొట్టి చంపిన మనవళ్లు
ఆస్తి తగాదాను మనసులో పెట్టుకొని నల్లా నీరు విషయంలో జరిగిన గొడవను సాకుగా తీసుకొని తాతపై మనవళ్లు దాడిచేసి చంపిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. -
అమ్మానాన్నలే హంతకులయ్యారు
అల్లారుముద్దుగా పెంచిన అమ్మానాన్నలే కుమార్తెను హతమార్చారు. మానసిక స్థితి సరిగా లేదని ఆసుపత్రులు, దేవాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదని ఆవేదన చెందిన తల్లిదండ్రులు 13 నెలల మనవడికి తల్లిని దూరం చేశారు. -
పిడుగుపాటుకు ముగ్గురు రైతుల దుర్మరణం
వికారాబాద్ జిల్లా యాలాల మండలం జుంటుపల్లి, బెన్నూరు గ్రామాల్లో పిడుగుపాటుతో ఆదివారం ముగ్గురు రైతులు దుర్మరణం చెందారు. -
రూ.105 కోట్ల హెరాయిన్ పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న హెరాయిన్ను అసోం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. -
గోవును అక్రమ రవాణా చేస్తున్నాడని.. వృద్ధుడిని బైక్తో ఈడ్చుకెళ్లిన దుండగులు
ఝార్ఖండ్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. అక్రమంగా గోవును రవాణా చేస్తున్నాడన్న అనుమానంతో 60 ఏళ్ల వృద్ధుడిని ముగ్గురు వ్యక్తులు తమ ద్విచక్ర వాహనానికి కట్టి ఈడ్చుకెళ్లారు. -
విద్యుదాఘాతంతో దంపతుల దుర్మరణం
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో విద్యుదాఘాతానికి గురై దంపతులు మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ
-
ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్
-
అయిదో దశ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్!
-
మళ్లీ వచ్చేది మోదీ సర్కార్.. పీవోకే విలీనం పక్కా: అమిత్ షా