Sexual Abuse: తండ్రి వేధింపుల నుంచి కాపాడతానని నమ్మించి.. బాలికపై సామూహిక అత్యాచారం!
కన్న తండ్రి చేతిలో లైంగిక వేధింపులకు గురవుతోన్న ఓ బాలికను కాపాడతానంటూ నమ్మించిన ఓ వ్యక్తి.. తన స్నేహితుడితో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రాజస్థాన్లో ఈ దారుణం వెలుగుచూసింది.
జైపుర్: తల్లిలేని కుమార్తెను కళ్లలో పెట్టుకుని చూసుకోవాల్సిన కన్న తండ్రే.. ఆమె పట్ల లైంగిక వేధింపుల (Sexual Abuse)కు దిగాడు! ఇదే అదనుగా.. తండ్రి అఘాయిత్యాల నుంచి కాపాడతానంటూ ఓ వ్యక్తి ఆమెను నమ్మించి ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే తన స్నేహితుడితో కలిసి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. రాజస్థాన్ (Rajasthan)లో ఈ దారుణం వెలుగుచూసింది. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె తండ్రితోపాటు ఆ ఇద్దరినీ అరెస్టు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. స్థానికంగా ఓ 13 ఏళ్ల బాలిక తన తండ్రి (68)తో కలిసి నివసిస్తోంది. ఆమె తల్లి అయిదేళ్ల క్రితమే చనిపోయింది. ఈ క్రమంలోనే జూన్ 22 నుంచి తన కుమార్తె కనిపించడం లేదంటూ అతను ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ఆచూకీ కనుగొన్నారు. విచారణలో భాగంగా ఈ విషయాలు బయటపడ్డాయి. తన తండ్రి ఏడాదిన్నర కాలంగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరిస్తున్నాడని తెలిపింది.
మరోవైపు.. అదే సమయంలో బాలికకు ఓ వ్యక్తి (29)తో పరిచయం ఏర్పడింది. తండ్రి వేధింపుల నుంచి రక్షిస్తాననే సాకుతో ఆమెను వెంట తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే తన స్నేహితుడితో కలిసి ఆమెపై పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక వాంగ్మూలాల ఆధారంగా.. నిందితులపై పోక్సో చట్టంతోపాటు ఆయా సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో తండ్రితోపాటు మరో ఇద్దరినీ అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో తదుపరి విచారణ సాగుతోందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
ఏజెంట్లు ఇచ్చే కమీషన్లకు ఆశపడి..ఉద్యోగాల పేరుతో యువకులను మభ్యపెట్టి కంబోడియాకు తరలిస్తున్న ముఠా గుట్టును రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఆ ముఠా సభ్యుడు కంచర్ల సాయి ప్రసాద్ను అరెస్టు చేశారు. -
ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ నాయకుడి హత్య
ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు జోగ పొడియం(48)ను మావోయిస్టులు శుక్రవారం అర్ధరాత్రి ఆయన ఇంట్లోనే దారుణంగా హత్య చేశారు. పొటాలి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపు సమీపంలో మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడ్డారు. -
ఆకస్మిక తనిఖీల్లో భారీ సొత్తు స్వాధీనం
మల్టీజోన్-1 పరిధిలోని 16 జిల్లాల్లో చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో పోలీసులు భారీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. -
డ్రగ్స్ తయారీ మాఫియా గుట్టురట్టు
గుజరాత్, రాజస్థాన్లలో మాదక ద్రవ్యాల తయారీ ముఠా గుట్టు రట్టయింది. రహస్యంగా నడుపుతున్న డ్రగ్స్ ల్యాబ్లపై మాదక ద్రవ్యాల నిరోధక విభాగం (ఎన్సీబీ), గుజరాత్కు చెందిన ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్) దాడులు నిర్వహించి 13 మందిని అరెస్టు చేశాయి. -
ఝార్ఖండ్లో స్కూల్ బస్సు బోల్తా.. 15 మంది చిన్నారులకు గాయాలు
ఝార్ఖండ్లోని రాంచీలో చిన్నారులతో పాఠశాలకు వెళుతున్న ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
-
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
-
సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు.. ఉత్తీర్ణులు చేసిన ఆచార్యుల తొలగింపు
-
అప్పలరాజును చిత్తుగా ఓడించాలి: ఎంపీ రామ్మోహన్నాయుడు
-
ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా.. శస్త్రచికిత్స మధ్యలో ఆపేసిన వైద్యుడు
-
వైకాపా మ్యానిఫెస్టో తుస్సుమంది: గంటా