Leopard: చిన్నారులను చంపుతోన్న చిరుత.. 10రోజుల్లో ముగ్గురి మృత్యువాత
ఝార్ఖండ్లోని ఓ జిల్లాలో చిరుత స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా ఓ ఆరేళ్ల చిన్నారిపై దాడి చేసి ప్రాణాలు తీసింది. ఇలా 10 రోజుల్లో ముగ్గురు బాలికలను ఈ చిరుత పులి పొట్టనపెట్టుకున్నట్లు అటవీ అధికారులు పేర్కొన్నారు.
రాంచీ: ఝార్ఖండ్లోని గాడ్వా జిల్లాలో ఓ చిరుత (Leopard) వణికిస్తోంది. పలామూ డివిజన్లో వరస దాడులకు పాల్పడుతూ స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా ఓ ఆరేళ్ల చిన్నారిని పొట్టనపెట్టుకుంది. గడిచిన 10రోజుల వ్యవధిలోనే ముగ్గురు చిన్నారులు చిరుత దాడుల్లో ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. అయితే, ఈ ముగ్గురినీ చంపింది ఒకే చిరుతేనని అటవీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
గర్వా జిల్లాలో (Garhwa Division) సేవదీ గ్రామానికి చెందిన ఓ ఆరేళ్ల చిన్నారి తన ఇంటి సమీపంలో మూత్ర విసర్జనకు వెళ్లింది. అదే సమయంలో చిన్నారిపై ఒక్కసారిగా దాడి చేసిన చిరుత (Leopard) .. బాలిక మెడను పట్టుకొని అడవిలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. ఇది గమనించిన గ్రామ ప్రజలు.. కర్రలు పట్టుకొని పులిని వెంబడించారు. జనాలను చూసిన ఆ క్రూరమృగం బాలికను వదిలి అడవిలోకి పారిపోయింది. అయితే, అప్పటికే ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. గడిచిన 10 రోజుల వ్యవధిలో ఇది మూడో మరణం కావడం గమనార్హం.
డిసెంబర్ 14న అదే జిల్లాకు చెందిన భాందారియా ప్రాంతంలో ఓ ఆరేళ్ల చిన్నారి కూడా చిరుత దాడిలో హతమయ్యింది. అంతకుముందు డిసెంబర్ 10వ తేదీన లాతేహర్ జిల్లాలో ఓ 12ఏళ్ల బాలిక పులి దాడిలో చనిపోయింది. అయితే, ఈ ముగ్గురిని చంపింది ఒకే చిరుత అని భావిస్తున్నామని గాడ్వా డివిజన్ అటవీ అధికారి శశి కుమార్ వెల్లడించారు. చిరుతను బంధించేందుకు కృషి చేస్తున్నామన్న ఆయన.. దానిని మనుషులను తినే జంతువుగా ప్రకటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. పులి దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం తరఫున చట్ట ప్రకారం పరిహారం అందిస్తామని అటవీ అధికారులు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
NEET exam: నీట్ పరీక్షలో ఓ టీచర్ అవకతవకలకు పాల్పడ్డాడు. అభ్యర్థులకు బదులు పరీక్ష రాసేందుకు వారితో రూ.10లక్షల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నాడు. -
ఈత సరదా మిగిల్చిన విషాదం
వేసవి సెలవుల్లో సరదాగా ఈత కోసం వెళ్లిన ముగ్గురు బాలురు ప్రమాదవశాత్తు మున్నేరులో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని గుదిమళ్ల సమీపంలో గురువారం చోటుచేసుకుంది. -
ఉద్యోగాల క్రమబద్ధీకరణ పేరుతో లంచాలు
తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెబుతూ లంచాలు వసూలు చేయడంపై హైదరాబాద్ సీబీఐ విభాగం తపాలాశాఖ ఉద్యోగులపై కేసు నమోదు చేసింది. -
బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు
బాణసంచా పరిశ్రమలో చోటుచేసుకున్న భారీ పేలుడు ధాటికి 10 మంది మృత్యువాత పడ్డారు. మరో 11 మంది గాయపడ్డారు. -
లారీ క్యాబిన్ ప్రత్యేక అరలో రూ.8.36 కోట్లు
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్టు వద్ద జాతీయ రహదారిపై పైపుల లారీలో తరలిస్తున్న రూ.8.36 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
సజ్జల భార్గవ్రెడ్డిపై సీఐడీ కేసు నమోదు
వైకాపా సామాజిక మాధ్యమ విభాగం ఇన్ఛార్జి సజ్జల భార్గవ్రెడ్డిపై సీఐడీ గురువారం కేసు నమోదు చేసింది. 171-ఎఫ్, 171-జీ, 505(2) రెడ్విత్ 120-బీ సెక్షన్ల కింద కేసు పెట్టింది. -
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
కదులుతున్న మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై 28 ఏళ్ల వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. తనకు ఎదురైన ఘటనపై బాలుడు ఎక్స్ వేదికగా పోస్టులు చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం