Crime news : తాను శివుడి అవతారమట.. తిరిగి బతికిస్తానని చెప్పి వృద్ధురాలిని గొడుగుతో కొట్టి చంపాడు!
రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రంలో పట్టపగలు దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి 85 ఏళ్ల వృద్ధురాలిని గొడుగుతో కొట్టి చంపాడు.
జైపుర్ : రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రంలోని ఉదయ్పుర్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తనను తాను శివుడి అవతారంగా పేర్కొన్న ఓ 60 ఏళ్ల వ్యక్తి.. 85 ఏళ్ల వృద్ధురాలిపై గొడుగుతో దాడి చేసి హతమార్చాడు. పక్కనే ఇద్దరు మైనర్ బాలురు ఈ ఘటనను చూస్తూ ప్రేక్షకపాత్ర వహించారు. అందులో ఒకరు ఆ దాడి దృశ్యాలను చిత్రీకరించారు. మృతురాలిని తిరిగి బతికిస్తానని చెప్పి నిందితుడు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
శంషాబాద్ విమానాశ్రయంలో రూ.77 లక్షల విలువైన బంగారం స్వాధీనం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి ఫూటుగా మద్యం తాగాడు. ఆ తరువాత అతడికి కల్కిబాయ్ గమేతి అనే వృద్ధురాలు కనిపించింది. మద్యం మత్తులో తనను తాను శివుడి అవతారంగా భావించిన ఆ వ్యక్తి ఆ మహిళను చంపి తిరిగి బతికించాలనుకున్నాడు. వృద్ధురాలి పక్కన కూర్చొని తాను శివుడి అనుచరుడినని చెప్పాడు. ‘నువ్వు మహారాణివి’ అంటూ వెంటనే ఆమె ఛాతీపై పిడిగుద్దులు కురిపించాడు. ఆ దెబ్బలకు తాళలేక వృద్ధురాలు నేలపై పడిపోయింది. వెంటనే ఆమె జుట్టు పట్టుకుని కొంతదూరం ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఆ తరువాత గొడుగు తీసుకొని చితకబాదాడు. దాంతో వృద్ధురాలు మరణించింది.
గోగుండా తహసీల్ పరిధిలో ఈ హత్య చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఇది ఆదివాసీలు ఎక్కువగా నివసించే కొండ ప్రాంతం. సమీపంలోని వారి ఇంటికి వృద్ధురాలు నడుచుకుంటూ వెళ్తుండగా నిందితుడు ఆమెకు తారసపడ్డాడని పోలీసులు చెప్పారు. ఈ హత్యను ఇద్దరు మైనర్లు వీడియో తీశారని, మరో వ్యక్తి ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్నాడని ఉదయ్పూర్ ఎస్పీ భువన్ భూషణ్ వెల్లడించారు. చనిపోయిన మహిళ మంత్రగత్తె కావడంతోనే వృద్ధుడు హత్యకు పాల్పడ్డాడనే వదంతులను ఆయన తోసిపుచ్చారు. ఈ కేసులో మొత్తం నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని ఎస్పీ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
ఓ వ్యక్తి మైనర్ను బంధించి అత్యాచారం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో చోటు చేసుకుంది. -
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
ఏజెంట్లు ఇచ్చే కమీషన్లకు ఆశపడి..ఉద్యోగాల పేరుతో యువకులను మభ్యపెట్టి కంబోడియాకు తరలిస్తున్న ముఠా గుట్టును రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఆ ముఠా సభ్యుడు కంచర్ల సాయి ప్రసాద్ను అరెస్టు చేశారు. -
ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ నాయకుడి హత్య
ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు జోగ పొడియం(48)ను మావోయిస్టులు శుక్రవారం అర్ధరాత్రి ఆయన ఇంట్లోనే దారుణంగా హత్య చేశారు. పొటాలి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపు సమీపంలో మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడ్డారు. -
ఆకస్మిక తనిఖీల్లో భారీ సొత్తు స్వాధీనం
మల్టీజోన్-1 పరిధిలోని 16 జిల్లాల్లో చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో పోలీసులు భారీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. -
డ్రగ్స్ తయారీ మాఫియా గుట్టురట్టు
గుజరాత్, రాజస్థాన్లలో మాదక ద్రవ్యాల తయారీ ముఠా గుట్టు రట్టయింది. రహస్యంగా నడుపుతున్న డ్రగ్స్ ల్యాబ్లపై మాదక ద్రవ్యాల నిరోధక విభాగం (ఎన్సీబీ), గుజరాత్కు చెందిన ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్) దాడులు నిర్వహించి 13 మందిని అరెస్టు చేశాయి. -
ఝార్ఖండ్లో స్కూల్ బస్సు బోల్తా.. 15 మంది చిన్నారులకు గాయాలు
ఝార్ఖండ్లోని రాంచీలో చిన్నారులతో పాఠశాలకు వెళుతున్న ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
-
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..