Anantapur: 7 తులాల బంగారం కోసం.. వృద్ధురాలిని ముక్కలుగా నరికేశారు

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఎర్రగుంట్లలో దారుణం చోటు చేసుకుంది.

Published : 22 Mar 2024 16:49 IST

గార్లదిన్నె: అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఎర్రగుంట్లలో దారుణం చోటు చేసుకుంది. బంగారం కోసం గ్రామానికి చెందిన ఓబులమ్మ(84)ను దారుణంగా హత్య చేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వృద్ధురాలు ఒంటరిగా ఇంట్లో ఉండేది. ఆమె కుమార్తె హైదరాబాద్‌లో స్థిరపడింది. ఇటీవల అదే గ్రామానికి చెందిన కృష్ణమూర్తి ఇంట్లో శుభకార్యం కోసం దాదాపు 7 తులాల బంగారు నగలను ఓబులమ్మ ఇచ్చింది.

15 రోజులు గడిచినా వారు తిరిగి ఇవ్వకపోవడంతో స్థానికులను ఆశ్రయించింది. దీంతో ఆగ్రహించిన కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు శుక్రవారం ఆమెతో ఘర్షణకు దిగి గొడ్డలితో నరికి చంపారు. శరీర భాగాలను ముక్కలు చేసి పెనకచర్ల డ్యామ్‌లో పడేశారు. వృద్ధురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలాన్ని అనంతపురం రూరల్‌ డీఎస్పీ వెంకట శివారెడ్డి, సీఐ శ్రీధర్, ఎస్‌ఐ బాషాలు పరిశీలించారు. పెనకచర్ల డ్యామ్‌ నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని